Followers

Wednesday 26 June 2013

అనివార్యమైన మార్పు గీతాసారంతోనే

అనివార్యమైన మార్పు గీతాసారంతోనే
geetaనేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.

(ద్వితీయోధ్యాయం- సాంఖ్యాయోగం)


శ్లోకంః వేదావినాశినం నిత్యం
య ఏన మజ మవ్యయమ్‌
కథం స పురుషః పార్థ !
కం ఘాతయతి హంతికమ్‌ 


ధీమంతులగు పృథువంశమున జన్మించిన అర్జునా!వివేకము కోల్పోకుము. ఆత్మలు నశించవని, త్రైకాలికాభాధ్యములనీ జన్మాదులు లేనివగుటచే స్థిరరూపము కలవని తెలుసుకున్నవాడు ఎవ్వడూ ఆత్మలను ఏ శస్త్రాదులచేతనూ చంపించు ప్రయత్నము చేయడు. స్వయముగను యుద్దాదులలో ఆ యుద్దములలో చంపు ప్రయత్నము చేయడు. కనుక బుద్దిమంతుడు చేయు యుద్ధాది క్రియల్లో అతడు చంపుతున్నది కానీ, చంపునది కానీ పాపదుష్టమైన వరీరములనేయని గుర్తుంచుకొనుము. ఆత్మయొక్క యదార్ధ స్థితి నీకు తెలియక భ్రమపడి, భీష్మ ద్రోణాదుల ఆత్మలనే చంపుచున్నానని శోకము చెందుచున్నావు. అది విడువుము.
శ్లోకంః వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ 


తెలివైనవాడు ధరించగా శిధిలమైన వస్తమ్రులను వదలివేయును. వాడుటకు వీలగు కొత్త వస్త్రాలను తిరిగి ధరించును. పాత వస్తమ్రును విడుచుట గానీ, నూతన వస్తమ్రును ధరించుటకు గానీ చింతింపడు. సంతోషమునే పొందును. అట్లే కర్మానుభవమునకై లభించిన శరీరము, ఆ భోగము పూర్తికాగానే దాని వయసుతో నిమిత్తము లేకుండా శిథిలమైనదిగ పరిగణింపబడును. మరో కర్మానుభవమున శరీరము పనికిరాదన్నమాట. వానిని వదలి నూతన కర్మానుభవమున కనువగు మరొక నూతన దేహమును పొందును. ఇది ధర్మ యుద్దము. ఇందు మరణించిన వారందరికీ రమణీయ దేహము లభించుట నిశ్చయము. కనుక, ఇకపై దేహమే లభింపక ప్రళయములో ఆత్మమగ్గిపోవలసి యుడునేమోయనికానీ, ఒకవేల లభించినా, ఇప్పటి శరీరాలకంటే చెట్టు, పక్షి, ఇత్యాది నీచ శరీరములు లభించునేమోననే బెంగకానీ నీకవసరం లేదు. ఆనందించవలసిన యుద్ధ సమయంలో శోకించుచున్నావు.

Popular Posts