Followers

Wednesday 26 June 2013

చితాభస్మాన్ని నియమానుసారం ధరిస్తే..?

చితాభస్మం... ఉజ్జయినిలోని శ్రీ మహాకాల అనే జ్యోతిర్లింగానికి చితాభస్మంతో అభిషేకాన్ని చేస్తారు. చితాభస్మాన్ని కాపాలికులు, మాంత్రికులు, అఘోరీలు, శవసాధకులు, ప్రేతాత్మలను పూజించేవారు. వామచారులు, వామ వర్గాలకు చెందిన వారు ఉపయోగిస్తారు. మాంత్రికుల్లో ఒక నమ్మకం వుంది. తమ గురువుల చితాభస్మాన్ని మాత్రమే వారు ఉపయోగిస్తారు. దీన్ని వాడటం ద్వారా తమ గురువుల ఆత్మ తమతోనే ఉంటుందని నమ్మకం. నియమానుసారం చితాభస్మాన్ని ధరిస్తే ప్రేతాత్మలు భస్మధారణ చేసిన వారి మాటను ఎప్పుడూ వింటూనే ఉంటాయని మంత్ర రహస్యాల్లో వివరించబడి ఉంది. అయితే శ్రీ మహాకాల జ్యోతిర్లింగానికి అభిషేకం చేసిన భస్మం ప్రసాదంగా మారుతుంది. ఇది ఎటువంటి హానీ కలిగించదు. ఇది క్షేత్ర మహిమ అంటూ పండితులు చెబుతున్నారు.

Popular Posts