Followers

Tuesday 25 March 2014

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం పదిహేనవ అధ్యాయం


శ్రీనారద ఉవాచ
కర్మనిష్ఠా ద్విజాః కేచిత్తపోనిష్ఠా నృపాపరే
స్వాధ్యాయేऽన్యే ప్రవచనే కేచన జ్ఞానయోగయోః

భగవదారాధనా రూపముగా కర్మలు ఆచరించే వారు కొందరు. అవి పక్కన పెట్టి తపస్సు చేసే వారు కొందరు. కొందరు నిత్యం వేదం అభ్యాసం చేస్తూ, స్వాధ్యాయ ప్రవచనములు చేస్తూ ఉండేవారు కొందరు. కొందరు జ్ఞ్యానాన్ని కొందరు యోగాన్ని. కర్మ నిష్ఠులూ తపో నిష్టులు స్వాధ్యాయ ప్రవచన జ్ఞ్యా యోగులని ఆరు కర్మలు

జ్ఞాననిష్ఠాయ దేయాని కవ్యాన్యానన్త్యమిచ్ఛతా
దైవే చ తదభావే స్యాదితరేభ్యో యథార్హతః

హవ్య కవ్యాలలో ప్రధమ తాంబూలం జ్ఞ్యాన నిష్ఠునికే. తరువాత దైవ నిష్ఠులకూ, తరువాత ఆయా యోగ్యతలను బట్టి ఇవ్వాలి

ద్వౌ దైవే పితృకార్యే త్రీనేకైకముభయత్ర వా
భోజయేత్సుసమృద్ధోऽపి శ్రాద్ధే కుర్యాన్న విస్తరమ్

శ్రాద్ధమప్పుడు ఇద్దరు బ్రాహ్మణులకు విశ్వేదేవతల స్థానములో, పితృ కార్యములో ముగ్గురుని.  శక్తి లేకపోతే ఇద్దరు సరిపోతారు.ఎంత గొప్ప సంపద ఉన్నా శ్రాద్ధాన్ని విస్తరింపచేయరాదు

దేశకాలోచితశ్రద్ధా ద్రవ్యపాత్రార్హణాని చ
సమ్యగ్భవన్తి నైతాని విస్తరాత్స్వజనార్పణాత్

విస్తరం ఎందుకు చేయకూడదంటే, మంది ఎక్కువైన కొద్దీ శ్రద్ధ తగ్గుతుంది. దేశకాలాలు మారుతాయి యోగ్యతా మారుతుంది. శ్రాద్ధమునకు తన వారిని పిలవరాదు. తనవారికి పెట్టినా ఎక్కువ మందికి పెట్టినా ఇవన్నీ లోపిస్తాయి

దేశే కాలే చ సమ్ప్రాప్తే మున్యన్నం హరిదైవతమ్
శ్రద్ధయా విధివత్పాత్రే న్యస్తం కామధుగక్షయమ్

సరి ఐన సమయములో కాలములో దేశములో పాత్రకు హరి అర్పణ బుద్ధితో ఇస్తే అది అక్షయమవుతుంది.
శ్రద్ధతో హరి అర్పణ భావముతో కంద మూలాలు ఇచ్చినా మంచిదే.

దేవర్షిపితృభూతేభ్య ఆత్మనే స్వజనాయ చ
అన్నం సంవిభజన్పశ్యేత్సర్వం తత్పురుషాత్మకమ్

దేవ పితృ ఋషి భూతములూ తాను తనవారు - ఆరు భాగాలుగా విభజించాలి. శ్రాద్ధములో మాంఅసాన్ని పెట్టకూడదూ తినకూడదు. ముని అన్నం వలన కలిగే ప్రీతి పశు హింసతో కలగదు

న దద్యాదామిషం శ్రాద్ధే న చాద్యాద్ధర్మతత్త్వవిత్
మున్యన్నైః స్యాత్పరా ప్రీతిర్యథా న పశుహింసయా

నైతాదృశః పరో ధర్మో నృణాం సద్ధర్మమిచ్ఛతామ్
న్యాసో దణ్డస్య భూతేషు మనోవాక్కాయజస్య యః

ఉత్తమ ధర్మం ఆశించేవారు ప్రాణులను మానసికముగా వాచికముగా కాయకముగా సకల భూతాల మీద శిక్షను మానుట కన్నా మించినది లేదు. 

ఏకే కర్మమయాన్యజ్ఞాన్జ్ఞానినో యజ్ఞవిత్తమాః
ఆత్మసంయమనేऽనీహా జుహ్వతి జ్ఞానదీపితే

కొందరు కర్మ యజ్ఞ్యములూ కొందరు జ్ఞ్యాన యజ్ఞ్యములూ చేస్తారు. మనో నిగ్రహం కావాలి. క్రోధమూ లోభమూ మొదలైనవి జ్ఞ్యానాగ్నిలో హవిస్సులా ఇవ్వాలి

ద్రవ్యయజ్ఞైర్యక్ష్యమాణం దృష్ట్వా భూతాని బిభ్యతి
ఏష మాకరుణో హన్యాదతజ్జ్ఞో హ్యసుతృప్ధ్రువమ్

యజ్ఞ్యములో హవ్యముగా ఇవ్వ వలసినది పశు హింస కాదు. ఇంద్రియ ప్రీతిని హవిస్సుగా ఇవ్వాలి. దాని వలన మనో నిగ్రహం ఏర్పడుతుంది. 

తస్మాద్దైవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మవిత్
సన్తుష్టోऽహరహః కుర్యాన్నిత్యనైమిత్తికీః క్రియాః

ఫలితాన్ని కోరి జ్ఞ్యాన యజ్ఞ్యం కాకుండా ద్రవ్యములతో మాత్రమే యజ్ఞ్యం చేసే వారిని చూచి ప్రాణులన్నీ భయపడతాయి. వీడు తత్వం తెలియని వాడు. కరుణ లేని వాడై మమ్ములని చంపుతున్నాడు. వీడు తన ప్రాణములను తృప్తి పరచేవాడు. పరమాత్మ ఇచ్చిన కంద మూలాలతో శ్రాద్ధం పెట్టినా భగవానుడు సంతోషిస్తాడు. నైమిత్తిక నిత్య కర్మలు కంద మూలలతో చేసినా చాలు 

విధర్మః పరధర్మశ్చ ఆభాస ఉపమా ఛలః
అధర్మశాఖాః పఞ్చేమా ధర్మజ్ఞోऽధర్మవత్త్యజేత్

ధర్మాభాసము - ధర్మమే అనిపించేవి. విధర్మమూ పరధర్మమూ ఆభాసము ఉపమ చరం అనే ఐదు అధర్మ శాఖలు. అధర్మాన్ని విడిచిపెట్టినట్లే వీటినీ విడిచిపెట్టాలి. 

ధర్మబాధో విధర్మః స్యాత్పరధర్మోऽన్యచోదితః
ఉపధర్మస్తు పాఖణ్డో దమ్భో వా శబ్దభిచ్ఛలః

ఆచరించవలసిన ధర్మాలు దాచడం విధర్మం. ఇతరులకు చెప్పిన ధర్మం మనం ఆచరించడం పర ధర్మం. పాఖండ ధర్మాన్ని ఉపధర్మం అంటారు. దంభముగా ఉండటం చలం (కపటం)

యస్త్విచ్ఛయా కృతః పుమ్భిరాభాసో హ్యాశ్రమాత్పృథక్
స్వభావవిహితో ధర్మః కస్య నేష్టః ప్రశాన్తయే

ఒక ఆశ్రమములో ఉండేవాడు ఇంకో ఆశ్రమ ధర్మాన్ని చేయడం ఆభాసం. ఏ ఏ ధర్మం వారు ఏ ఏ విధముగా ఆచరిస్తారో దాన్ని బట్టే పెద్దలు వర్ణాశ్రమాలను నిర్ణయించారు. వర్ణాశ్రమ ధర్మములు స్వభావ విరుద్ధములు కావు. 

ధర్మార్థమపి నేహేత యాత్రార్థం వాధనో ధనమ్
అనీహానీహమానస్య మహాహేరివ వృత్తిదా

ఆయా ధర్మములు ఆచరించుట వారికి మానసిక ప్రశాంతి కలుగుటకే. ధర్మం కోసం గానీ యాత్ర కోసం కానీ, ధనము లేని వాడు ధనాన్ని కోరుకోకూడదు.యాత్రకు ధనాన్ని అడగకూడదు.

సన్తుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య యత్సుఖమ్
కుతస్తత్కామలోభేన ధావతోऽర్థేహయా దిశః

పది మందినీ భిక్షాటన చేసి యాత్రలకు వెళ్ళి నీవు పొందే తృప్తి ఏమీ ఉండదు. తృప్తి కలవాడు ఇంటిలో పొందే ఆనందం తృప్తి లేని వాడు యాత్రలలో కూడా పొందలేదు. ఏ కోరిక లేని కొండచిలువ ఎక్కడికీ వెళ్ళక ఉంటుంది. 
నిత్య సంతుషుటినికి ఏ కోరికలూ లేని వానికి కలిగే సంతోషం కోరికల కోసం పది దిక్కులకూ పరిగెత్తే వానికి కలుగుతుందా

సదా సన్తుష్టమనసః సర్వాః శివమయా దిశః
శర్కరాకణ్టకాదిభ్యో యథోపానత్పదః శివమ్

నిరంతరం సంతోషం ఉన్న వారికి అన్ని చోట్లూ ఆనందాన్నే ఇస్తాయి. చెప్పులేసుకున్నవాడికి ముళ్ళూ రాళ్ళూ గుచ్చుకుంటాయా. సంతోషముగా బతికేవాడు నీళ్ళతో కూడా బతుకుతాడు 

సన్తుష్టః కేన వా రాజన్న వర్తేతాపి వారిణా
ఔపస్థ్యజైహ్వ్యకార్పణ్యాద్గృహపాలాయతే జనః

ఉపస్థా జిహ్వ యొక్క వ్యామోహము వలన మానవుడు శునకములాగ బతుకుతున్నాడు 

అసన్తుష్టస్య విప్రస్య తేజో విద్యా తపో యశః
స్రవన్తీన్ద్రియలౌల్యేన జ్ఞానం చైవావకీర్యతే

సంతుష్టిలేని బ్రాహ్మణుడికి తేజస్సూ విద్యా తపస్సూ కీర్తీ అన్నీ జారిపోతాయి ఇంద్రియ లౌల్యముల వలన 

కామస్యాన్తం హి క్షుత్తృడ్భ్యాం క్రోధస్యైతత్ఫలోదయాత్
జనో యాతి న లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః

ఉన్న జ్ఞ్యానం కూడా వెదజల్ల బడుతుంది. కామ క్రోధముల కంటే మహా భయంకరమైన శత్రువు లోభము. పది దిక్కులూ జయించినా లోభాన్ని జయించలేము. 

పణ్డితా బహవో రాజన్బహుజ్ఞాః సంశయచ్ఛిదః
సదసస్పతయోऽప్యేకే అసన్తోషాత్పతన్త్యధః

అసఙ్కల్పాజ్జయేత్కామం క్రోధం కామవివర్జనాత్
అర్థానర్థేక్షయా లోభం భయం తత్త్వావమర్శనాత్

మహాపండితులూ బాగా తెలిసినవారు, ఇతరుల సంశయాలను తీర్చగలిగినవారు కూడా అసంతృప్తి వలన పతనమవుతారు. కోరికను జయించాలి అంటే ఏమిచేయాలి? సంకల్పము చేయకు.సంకల్పాన్ని మానుకో. కామాన్ని వదలడం వలన క్రోధం ఉండదు.  అర్థములను అనర్థములు అనుకుంటే లోభం పోతుంది. తత్వాన్ని తెలుసుకుంటే భయం పోతుంది

ఆన్వీక్షిక్యా శోకమోహౌ దమ్భం మహదుపాసయా
యోగాన్తరాయాన్మౌనేన హింసాం కామాద్యనీహయా

శరీరాత్మ విజ్ఞ్యానముతో శోకమోహాన్ని విడిచిపెట్టాలి, మహానుభావులను సేవించడం వలన ధంభాన్నీ, యోగములో వచ్చే విఘ్నాలను మౌనముతో పోగొట్టాలి. 

కృపయా భూతజం దుఃఖం దైవం జహ్యాత్సమాధినా
ఆత్మజం యోగవీర్యేణ నిద్రాం సత్త్వనిషేవయా

శరీరం మీద వ్యామోహాన్ని మానుకో, దాని వలన హింస పోతుంది, ఎదుటి వారి మీద కృప చూపి దుఃఖాన్ని తొలగించుకో, సమాధిలో ఉండుట వలన ఆది దైవికాన్ని గెలవాలి, మనసులో కలిగే దోషాలను యోగ బలముతో గెలవాలి, పరమాత్మ స్వరూపాన్ని సేవించడం వలన నిద్రని గెలవాలి. రజసతమో గుణాలని సత్వముతో గెలవాలి, 

రజస్తమశ్చ సత్త్వేన సత్త్వం చోపశమేన చ
ఏతత్సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యఞ్జసా జయేత్

ఇవన్నీ చేయాలంటే గురువు మీద భక్తి ఉండాలి. 

యస్య సాక్షాద్భగవతి జ్ఞానదీపప్రదే గురౌ
మర్త్యాసద్ధీః శ్రుతం తస్య సర్వం కుఞ్జరశౌచవత్

ఎక్కడ గురువుగారి మీద "ఈయన కూడా మనిషి" అన్న బుద్ధి ఉంటుందో అక్కడ వాడు చదివినదంతా ఏనుగు స్నానములాగ పనికిరాకుండా పోతుంది 

ఏష వై భగవాన్సాక్షాత్ప్రధానపురుషేశ్వరః
యోగేశ్వరైర్విమృగ్యాఙ్ఘ్రిర్లోకో యం మన్యతే నరమ్

ఈ కృష్ణుడు (ఏష వై) ప్రకృతికీ పురుషునికీ అధిపతి. మహా యోగేశ్వరులు ఈయన పాద పద్మాలను వెతుకుతూ ఉంటారు. ఇలాంటి స్వామిని మనం మామూలు మనిషి అనుకుంటున్నాము. 

షడ్వర్గసంయమైకాన్తాః సర్వా నియమచోదనాః
తదన్తా యది నో యోగానావహేయుః శ్రమావహాః

కామ క్రోధాది షడ్వర్గములను నిగ్రహించే అన్ని నియమాలూ అన్ని విధులూ యోగ సాధనాలూ పరమాత్మలో ఆత్మని ఉంచకపోతే, అన్నీ శ్రమ మాత్రమే. అరిషడ్వర్గ జయమే కాదు,

యథా వార్తాదయో హ్యర్థా యోగస్యార్థం న బిభ్రతి
అనర్థాయ భవేయుః స్మ పూర్తమిష్టం తథాసతః

 మన బతుకు తెరువుకోసం ఆచరిస్తున్న అన్ని వృత్తులూ చివరకు యోగములోకే పర్యవసించాలి. లేకుంటే అవి వ్యర్థము. మనం బతుకు తెరువుకు చేసే ధర్మ విరుద్ధము కాని పనులన్నీ యోగార్థమును సాధించనట్లైతే అవి అన్నీ అనర్థములవుతాయి. యజ్ఞ్య యాగాదులూ దాన ధర్మాలు దేవాలయాలు కట్టించడం చెరువులూ త్రవ్వించడం మొదలైనవన్నీ కూడా యోగము కొరకే కావాలి. అవి అహంకారమును పెంచేవే ఐతే వ్యర్థం. 

యశ్చిత్తవిజయే యత్తః స్యాన్నిఃసఙ్గోऽపరిగ్రహః
ఏకో వివిక్తశరణో భిక్షుర్భైక్ష్యమితాశనః

మనసును గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మొదలు మనసును గెలవాలంటే మనసు దేని మీదా ఆస్కతి కాకుండా ఉండటానికి ప్రయత్నించాలి. అది లేకుండా ఉండాలంటే ఎవరు ఏమిచ్చినా తీసుకోకూడదు. ఒంటరిగా ఉండాలి. 

దేశే శుచౌ సమే రాజన్సంస్థాప్యాసనమాత్మనః
స్థిరం సుఖం సమం తస్మిన్నాసీతర్జ్వఙ్గ ఓమితి

భిక్ష చేసుకుని, భిక్షలో వచ్చిన వాటిని కూడా మితముగా తినాలి. పవిత్రమైన ప్రదేశములో సమానముగా ఉన్న ప్రదేశములో ఆసనమును ఏర్పాటు చేసుకుని, స్థిరముగా, సమముగా, సుఖముగా, నిటారుగా ఉండి, ఓంకారముతో ప్రాణాయామం చేయాలి. పూరక కుంభక రేచకములతో ప్రాణాయామం చేసి ప్రాణ వాయువును నిలుపుకోవాలి. మనసు కోరికల వెంట పరిగెత్తడం ఆపేదాకా, ముక్కు చివర మీద దృష్టి లగ్నం చేయాలి

ప్రాణాపానౌ సన్నిరున్ధ్యాత్పూరకుమ్భకరేచకైః
యావన్మనస్త్యజేత్కామాన్స్వనాసాగ్రనిరీక్షణః

యతో యతో నిఃసరతి మనః కామహతం భ్రమత్
తతస్తత ఉపాహృత్య హృది రున్ధ్యాచ్ఛనైర్బుధః

మనసు ఏ ఏ దారుల వైపు పరిగెత్తుతుందో అక్కడి నుంచి వెనక్కు లాగాలి మెల్ల మెల్లగా. 

ఏవమభ్యస్యతశ్చిత్తం కాలేనాల్పీయసా యతేః
అనిశం తస్య నిర్వాణం యాత్యనిన్ధనవహ్నివత్

ఇలా అభ్యాసం చేస్తే కొద్ది కాలములోనే చిత్త జయాన్ని పొందుతారు. ఇలా చేస్తే కట్టెలు లేని నిప్పు లాగ ఆశ చల్లారిపోతుంది. కామ క్రోధాదులతో కొట్టబడకుండా ఉండే చిత్తమే బ్రహ్మానందం 

కామాదిభిరనావిద్ధం ప్రశాన్తాఖిలవృత్తి యత్
చిత్తం బ్రహ్మసుఖస్పృష్టం నైవోత్తిష్ఠేత కర్హిచిత్

యః ప్రవ్రజ్య గృహాత్పూర్వం త్రివర్గావపనాత్పునః
యది సేవేత తాన్భిక్షుః స వై వాన్తాశ్యపత్రపః

పరమాత్మ యందు ఉన్న మనసు మళ్ళీ అక్కడి నుంచి లేచి బయటకు రాకూడదు.విరక్తి పుట్టి సంసారం వదిలి సన్యాసం తీసుకున్నవాడు మళ్ళీ గృహస్థాశ్రమములోకి వస్తే వాడు వాంతి చేసుకున్నదాన్ని తిన్నవాడు, సిగ్గులేని వాడు. 

యైః స్వదేహః స్మృతోऽనాత్మా మర్త్యో విట్కృమిభస్మవత్
త ఏనమాత్మసాత్కృత్వా శ్లాఘయన్తి హ్యసత్తమాః

ఏ ఏ పనులని ఆచరించుట వలన, వేటిని వినుట వలన శరీరం ఆత్మ కాదు అని తెలియబడినదో, మలమూ క్రిమీ విట్ గా మారే శరీరం గురించీ, శరీరం ఆత్మనుంచి వేరు అని తెలుసుకున్నవారే దేహం కొరకు తాపత్రయపడితే, దేహ పోషణ కోసం ఎవరినైనా అడిగితే, అడిగినవాడూ అడిగించుకున్నవాడూ ఇద్దరూ చెడతారు.  దేహం గురించి అలమటించే స్థితి కలగకూడదు, అలమటించకూడదు.అజ్ఞ్యానులు మాత్రమే దేహ పోషణకు ఇతరులను పొగుడుతారు

గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి
తపస్వినో గ్రామసేవా భిక్షోరిన్ద్రియలోలతా

గృహస్థుడు కర్మలనూ బ్రహ్మచారి వ్రతమునూ విడువరాదు, వానప్రస్థుడు ఊళ్ళో ఉండరాదు, సన్యాసి కి ఇంద్రియ చాపల్యం ఉండరాదు. ఎవరైనా ఇలా చేస్తే "మేము ఈ ఆశ్రమములో ఉన్నాము" అని పటాటోపం చేసేవారు. 

ఆశ్రమాపసదా హ్యేతే ఖల్వాశ్రమవిడమ్బనాః
దేవమాయావిమూఢాంస్తానుపేక్షేతానుకమ్పయా

అలాంటి వారు ఉంటే చూసిన వారు వారిని విమర్శించకూడదు. భగవంతుని మాయ ఇంతదా అని జాలిపడాలి. జాలితో ఉపేక్షించు. 

ఆత్మానం చేద్విజానీయాత్పరం జ్ఞానధుతాశయః
కిమిచ్ఛన్కస్య వా హేతోర్దేహం పుష్ణాతి లమ్పటః

జ్ఞ్యానముతో సంస్కారాన్ని పవిత్రం చేసి ఆత్మను తెలుసుకుంటే, దేనికోసం శరీరాన్ని ఎక్కువగా పోషిస్తాడు. ఆత్మ జ్ఞ్యానం ఉన్నవాడు ఏ ప్రయోజనాన్ని కోరి శరీరాన్ని ఎక్కువగా పోషిస్తాడు

ఆహుః శరీరం రథమిన్ద్రియాణి హయానభీషూన్మన ఇన్ద్రియేశమ్
వర్త్మాని మాత్రా ధిషణాం చ సూతం సత్త్వం బృహద్బన్ధురమీశసృష్టమ్

అక్షం దశప్రాణమధర్మధర్మౌ చక్రేऽభిమానం రథినం చ జీవమ్
ధనుర్హి తస్య ప్రణవం పఠన్తి శరం తు జీవం పరమేవ లక్ష్యమ్

రాగో ద్వేషశ్చ లోభశ్చ శోకమోహౌ భయం మదః
మానోऽవమానోऽసూయా చ మాయా హింసా చ మత్సరః

రజః ప్రమాదః క్షున్నిద్రా శత్రవస్త్వేవమాదయః
రజస్తమఃప్రకృతయః సత్త్వప్రకృతయః క్వచిత్

యావన్నృకాయరథమాత్మవశోపకల్పం
ధత్తే గరిష్ఠచరణార్చనయా నిశాతమ్
జ్ఞానాసిమచ్యుతబలో దధదస్తశత్రుః
స్వానన్దతుష్ట ఉపశాన్త ఇదం విజహ్యాత్

శరీరం రథమూ, ఇంద్రియములు గుఱ్ఱములూ, మనసు పగ్గము, ఐదు విషయములూ మార్గములు, బుద్ధి సారధి, పెద్ద సత్వం దాని ప్రధానమైన భాగం, ఇదే మనకు బంధురం, బంధములని కలిగించేది, పది ఆకులు పది ప్రాణములు, ధర్మాధర్మములు రెండు చక్రములు, జీవుడు రధికుడు. రధం మీద ఉన్న రధికుని ధనువు ఓంకారం. జీవుడే శరం, పరమాత్మే గురి (లక్ష్యం). జీవాత్మ బాణం,పరమాత్మ గురి, ఓంకారముతో సంధించాలి. రహ్తమూ గుఱ్ఱమూ సారధ్హీ ఉండగా, లాభమూ శోకమూ మోహమూ మత్సరమూ  ప్రమాదమూ క్షుట్ నిద్ర మొదలైనవన్నీ శత్రువులు. కొందరు రజ ప్రకృతులూ, కొందరు తమఃప్రకృతులూ కొందరు సత్వ ప్రకృతులు
లక్ష్యాన్ని భేధించాలంటే శరమును సానపెట్టాలి. మాన శరీరం అనే ఈ రథం తన శరీరములో ఉన్నట్లు చేసుకుని గురువుగారి పాదములను అర్చిచి, తద్వారా ఆయుధానికి పదునుపెట్టు. జ్ఞ్యానమనే కత్తిని గురువు గారి పాద పూజ అనే దానితో పదును పెట్టాలి. అప్పుడు శత్రువులు నశిశ్స్తారు.అప్పుడు పరమపదాన్ని పొందుతాడు. 

నోచేత్ప్రమత్తమసదిన్ద్రియవాజిసూతా
నీత్వోత్పథం విషయదస్యుషు నిక్షిపన్తి
తే దస్యవః సహయసూతమముం తమోऽన్ధే
సంసారకూప ఉరుమృత్యుభయే క్షిపన్తి

ఈ పని చేయకుంటే దుష్ట ఇంద్రియములనే గుర్రాలు దుష్ట సారధి చెడు దారిలోకి తీసుకుని వెళ్ళి దొంగలకు అప్పచెబుతాడు. విషయములనేవి దొంగలు. మన ఆస్తిని మొత్తం లాక్కుని మనను కటిక చీకటి బావిలో పడవేస్తాడు. అక్కడ మృత్యు భయం ఉంటుంది 

ప్రవృత్తం చ నివృత్తం చ ద్వివిధం కర్మ వైదికమ్
ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేనాశ్నుతేऽమృతమ్

వైదిక కర్మ రెండు రకాలు. ఫలాకాంక్ష ఉన్నది, ఫలాకాంక్షలేనిది. ప్రవృత్తి కర్మ ఆచరిస్తే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటావు. 

హింస్రం ద్రవ్యమయం కామ్యమగ్నిహోత్రాద్యశాన్తిదమ్
దర్శశ్చ పూర్ణమాసశ్చ చాతుర్మాస్యం పశుః సుతః

యజ్ఞ్యాలు చేస్తూ పశువులను ఆహుతి ఇవ్వడం హింస మయం, కామ్య మయం, ద్రవ్య మయం, అశాంతినిచ్చేది. చాతుర్మాస్యాది హోమాలన్నీ "ఇష్టములు". 
పూర్తములంటే తోటలూ సత్రాలూ బావులూ చెరువులూ మొదలైనవి కట్టడం

ఏతదిష్టం ప్రవృత్తాఖ్యం హుతం ప్రహుతమేవ చ
పూర్తం సురాలయారామ కూపాజీవ్యాదిలక్షణమ్

ద్రవ్యసూక్ష్మవిపాకశ్చ ధూమో రాత్రిరపక్షయః
అయనం దక్షిణం సోమో దర్శ ఓషధివీరుధః

ద్రవ్యములలో కూడా దక్షిణాయనములో చేసేవి కొన్నీ ఉత్తరాయణములో చేసేవి కొన్నీ మొదలైన పితృ మార్గాలు ఉన్నాయి. ఇదే ధూమ దారి, నల్ల దారి. 

అన్నం రేత ఇతి క్ష్మేశ పితృయానం పునర్భవః
ఏకైకశ్యేనానుపూర్వం భూత్వా భూత్వేహ జాయతే

కామముతో చేసే యజ్ఞ్యములన్నీ మనకు పితృ మార్గములో పయనింపచేస్తాయి.ఇవన్నీ పునర్జన్మనిచ్చేవి. మనం చేసే ప్రతీ దానికీ జన్మనెత్తుతూనే ఉండాలి. 

నిషేకాదిశ్మశానాన్తైః సంస్కారైః సంస్కృతో ద్విజః
ఇన్ద్రియేషు క్రియాయజ్ఞాన్జ్ఞానదీపేషు జుహ్వతి

ఇంద్రియాలను మనసులో మనసుని ఊర్ములలో, సాత్విక మనసును వాక్కులో వాక్కును అక్షరాలలో అక్షరాలను ఓంకారములో ఓంకారమును బిందువులో దాన్ని ప్రాణములో ప్రాణమును మహత్తులో ఉంచాలి. 

ఇన్ద్రియాణి మనస్యూర్మౌ వాచి వైకారికం మనః
వాచం వర్ణసమామ్నాయే తమోంకారే స్వరే న్యసేత్
ఓంకారం బిన్దౌ నాదే తం తం తు ప్రాణే మహత్యముమ్

అగ్నిః సూర్యో దివా ప్రాహ్ణః శుక్లో రాకోత్తరం స్వరాట్
విశ్వోऽథ తైజసః ప్రాజ్ఞస్తుర్య ఆత్మా సమన్వయాత్

దేవయానమిదం ప్రాహుర్భూత్వా భూత్వానుపూర్వశః
ఆత్మయాజ్యుపశాన్తాత్మా హ్యాత్మస్థో న నివర్తతే
నిశేకమునుండీ శ్మశానం వరకూ ఉన్న సంస్కారాలతో బ్రాహ్మణుడు జ్ఞ్యానాగ్నిలో క్రియాలన్నీ ఆహుతి చేస్తాడు. 
అగ్ని సూర్యుడూ విశ్వా తేజసా ప్రాజ్ఞ్యా తురీయ అనే నాలుగు రకాల ఆత్మ సమన్వయముతో దేవయానం చేస్తాడు (తెల్ల దారి). ఈతను మళ్ళీ తిరిగిరాడు. ఈతను ఆత్మ యాజి. ఝ్న్యాన దీపములో తనను తాను అర్పించుకున్నాడు. మనసులో ఏ ఉద్వేగాలూ ఉండవు. ఈతను మళ్ళీ తిరిగిరాడు. దీన్ని శాస్త్ర జ్ఞ్యానముతో తెలుసుకుంటే జనులు మోహాన్ని పొందరు

య ఏతే పితృదేవానామయనే వేదనిర్మితే
శాస్త్రేణ చక్షుషా వేద జనస్థోऽపి న ముహ్యతి

ఆదావన్తే జనానాం సద్బహిరన్తః పరావరమ్
జ్ఞానం జ్ఞేయం వచో వాచ్యం తమో జ్యోతిస్త్వయం స్వయమ్

ఆబాధితోऽపి హ్యాభాసో యథా వస్తుతయా స్మృతః
దుర్ఘటత్వాదైన్ద్రియకం తద్వదర్థవికల్పితమ్

క్షిత్యాదీనామిహార్థానాం ఛాయా న కతమాపి హి
న సఙ్ఘాతో వికారోऽపి న పృథఙ్నాన్వితో మృషా

ఆద్యంతములో లోపలా వెలుపలా ఆదీ అంతమూ జ్ఞ్యానం జ్ఞేయం వాక్కూ వాక్యం చీకటీ వెలుతురూ ప్రవృత్తీ నివృత్తీ. ఇంద్రియాలను అదుపులోనికి తెచ్చుకోకుండా ఏ మార్గములోకీ వెళ్ళలేము. ప్రవృత్తి నివృత్తి మార్గాలలో ఇంద్రియ జయముండాల్సిందే. అదే కష్టమైనది. ఈ అర్థమా ఆ అర్థమా, ఏది కావాలి? ఇవి ఏ ఒక్క భాగం వచ్చినా తృప్తి కలగదు.ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, కుండ మట్టితో తయారయ్యింది, కానీ మట్టి ముద్దను కుండ అనలేము. 

ధాతవోऽవయవిత్వాచ్చ తన్మాత్రావయవైర్వినా
న స్యుర్హ్యసత్యవయవిన్యసన్నవయవోऽన్తతః

స్యాత్సాదృశ్యభ్రమస్తావద్వికల్పే సతి వస్తునః
జాగ్రత్స్వాపౌ యథా స్వప్నే తథా విధినిషేధతా

వస్త్రం దారల సమూహం కాదు, దారాల సమూహం వస్త్రం కాదు. అది విడిగా ఉండదూ కలిసీ ఉండదు. అబద్దమూకాదు నిజమూ కాదు. అవయవి అవయవాలు లేకుండా ఉండదు.అంత మాత్రాన అవయవాలే అవయవి కాదు.వస్త్రం లేకుండా దారం ఉండొచ్చు గానీ దారములేకుండా వస్త్రం ఉండదు. కానీ వస్త్రములలో దారం కనపడు. పొందిన ఫలములో చేసిన కర్మ కనపడదు. అంత మాత్రాన కర్మ చేయకుండా ఫలితం వచ్చిందని చెప్పగలమా
మేలుకొని ఉంటాము నిద్రపోతామూ కలగంటాము. కల రాకుండా ఉండాలంటే నిద్రపోకూడదు అనగలమా. విధినిషేధాల వలన అవస్థలు మనకు కలగవు.

భావాద్వైతం క్రియాద్వైతం ద్రవ్యాద్వైతం తథాత్మనః
వర్తయన్స్వానుభూత్యేహ త్రీన్స్వప్నాన్ధునుతే మునిః

భావాద్వైతం క్రియాద్వైతం ద్రవ్యాద్వైతం అని మూడు ఉంటాయి ఆత్మకు. ముని ఐన వాడు వీటిని తొలగించుకుంటాడు.

కార్యకారణవస్త్వైక్య దర్శనం పటతన్తువత్
అవస్తుత్వాద్వికల్పస్య భావాద్వైతం తదుచ్యతే

దారాలన్ని కలిస్తే వస్త్రం ఏర్పడింది.ఈ రెండూ ఒక్కటే, వికల్పం (దారం వేరు వస్త్రం వేరు అనుకోవడం) లేదు అనుకోవడం భావాద్వైతం. 

యద్బ్రహ్మణి పరే సాక్షాత్సర్వకర్మసమర్పణమ్
మనోవాక్తనుభిః పార్థ క్రియాద్వైతం తదుచ్యతే

కాయిక వాచిక మానసిక కర్మలు పరమాత్మ యందే అర్పించుట క్రియాద్వైతం.  పరమాత్మకే అర్పించుట క్రియాద్వైతం

ఆత్మజాయాసుతాదీనామన్యేషాం సర్వదేహినామ్
యత్స్వార్థకామయోరైక్యం ద్రవ్యాద్వైతం తదుచ్యతే

భార్యా పుత్రులూ ఇతర ప్రాణులూ, మనమెలా మన స్వార్థం కోరుకుంటామో వారు కూడా అంతే అని భావించడం ద్రవ్యాద్వైతం. అందరినీ ఒకటిగా చూచుట ద్రవ్యాద్వైతం. అన్ని క్రియలూ పరమాత్మకు అర్పించుట క్రియ అద్వైతం. కార్య కారణ సంబంధం భావాద్వైతం

యద్యస్య వానిషిద్ధం స్యాద్యేన యత్ర యతో నృప
స తేనేహేత కార్యాణి నరో నాన్యైరనాపది

ఏ వర్ణం వాడు ఏ ఆశ్రమం వాడు ఏ పనిని చేయకూడదని నిషేధించారో ఆ నిషేదించినదాన్ని ఆపద లేని సమయములో ఆచరించరాదు. 

ఇలాంటి ధర్మాలు ఇంటిలో ఉండి ఆచరించినా మోక్షం పొందుతారు.

ఏతైరన్యైశ్చ వేదోక్తైర్వర్తమానః స్వకర్మభిః
గృహేऽప్యస్య గతిం యాయాద్రాజంస్తద్భక్తిభాఙ్నరః

యథా హి యూయం నృపదేవ దుస్త్యజాదాపద్గణాదుత్తరతాత్మనః ప్రభోః
యత్పాదపఙ్కేరుహసేవయా భవానహారషీన్నిర్జితదిగ్గజః క్రతూన్

మీరు ఇంటిలోనే ఉండి మీకు వచ్చిన ఎన్నో ఆప్దలను ఈయన వలనే, ఈయన పాదముల యందు ఉన్న భక్తి వలనే తొలగించుకున్నారు . ఇన్ని యజ్ఞ్యాలు అన్ని దిక్కులూ జయించి చేసావు. అది ఆయన పదముల భక్తి వలన. భగవత్ భాగవత పాద సేవ వలన అన్ని కష్టాలు తొలగుతాయి. దీనికి దుష్టాంతం నేనే

అహం పురాభవం కశ్చిద్గన్ధర్వ ఉపబర్హణః
నామ్నాతీతే మహాకల్పే గన్ధర్వాణాం సుసమ్మతః

నేను పూర్వం ఒక గంధర్వ రాజును. సౌకుమార్యం సౌగంధ్యం మాధుర్యముతో నేను స్త్రీలకు ఇష్టునిలాగ బ్రతికాను.

రూపపేశలమాధుర్య సౌగన్ధ్యప్రియదర్శనః
స్త్రీణాం ప్రియతమో నిత్యం మత్తః స్వపురలమ్పటః

ఏకదా దేవసత్రే తు గన్ధర్వాప్సరసాం గణాః
ఉపహూతా విశ్వసృగ్భిర్హరిగాథోపగాయనే

ఒక సారి అందరూ యాగం చేసారు. మమ్ము కూడా హరి కథా గానం కోసం పిలిచారు. వారు చెప్పినట్లు గానం చేయడానికి స్త్రీలతో కూడి వెళ్ళాను.

అహం చ గాయంస్తద్విద్వాన్స్త్రీభిః పరివృతో గతః
జ్ఞాత్వా విశ్వసృజస్తన్మే హేలనం శేపురోజసా
యాహి త్వం శూద్రతామాశు నష్టశ్రీః కృతహేలనః

భగవంతుని కథలను గానం చేయడానికి ప్రియురాలిని తీసుకుని వచ్చినందుకు, దేవ ధర్మాన్ని హేళన చేసినందుకు శూద్ర జాతిలో జన్మించమని శపించారు. కొంత సేపు ఆడవారితో కలిసి ఐనా సరే పరమాత్మ నామాన్ని సంకీర్తన చేసాను కాబట్టి దాసీ పుత్రునిగా జన్మించినా బ్రహ్మజ్ఞ్యానులను సేవించే అవకాశం వచ్చింది. వారిని సేవించడం వలన బ్రహ్మకు పుత్రుడినయ్యాను

తావద్దాస్యామహం జజ్ఞే తత్రాపి బ్రహ్మవాదినామ్
శుశ్రూషయానుషఙ్గేణ ప్రాప్తోऽహం బ్రహ్మపుత్రతామ్

ధర్మస్తే గృహమేధీయో వర్ణితః పాపనాశనః
గృహస్థో యేన పదవీమఞ్జసా న్యాసినామియాత్

గృహస్థ ధర్మాలని నీకు వర్ణించాను నీ పాపాలు పోగొట్టే విధముగా. నేను చెప్పే ఈ ధర్మాలను సక్రమముగా ఆచరిస్తే గృహస్థు కూడా సన్యాసి పొందే ఫలితాన్ని పొందుతారు. మానవ లోకములో మీరు గొప్ప అదృష్టం చేసుకున్నవారు. అన్ని లోకాలను పవిత్రం చేసే మహర్షులందరూ ఇక్కడికి వస్తున్నారు.
మీ ఇంటిలో పరబ్రహ్మ మానవ రూపములో రహస్యముగా ఉన్నాడని సకల లోకాలనూ పావనం చేసే ఋషులు నీ దగ్గరకు వస్తున్నారు

యూయం నృలోకే బత భూరిభాగా లోకం పునానా మునయోऽభియన్తి
యేషాం గృహానావసతీతి సాక్షాద్గూఢం పరం బ్రహ్మ మనుష్యలిఙ్గమ్

స వా అయం బ్రహ్మ మహద్విమృగ్య కైవల్యనిర్వాణసుఖానుభూతిః
ప్రియః సుహృద్వః ఖలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృద్గురుశ్చ

ఎవరో అనుకోకు. ఆయన ఈయనే. కైవల్య సామ్రాజ్యానికి అధిపతి. అలాంటి వాడు మీకు ప్రియుడు మిత్రుడు మేనమామ కొడుకు మీ ఆత్మ వంటి వాడు మీరు చెప్పినట్లు వినేవాడు, మీకు చెప్పేవాడు 

న యస్య సాక్షాద్భవపద్మజాదిభీ రూపం ధియా వస్తుతయోపవర్ణితమ్
మౌనేన భక్త్యోపశమేన పూజితః ప్రసీదతామేష స సాత్వతాం పతిః

బ్రహ్మ రుద్రేంద్రాదులు ఊహలో కూడా ఈయన రూపం ఇలా ఉంటుంది అని తెలుసుకోలేరో, మౌనముతో భక్తితో శాంతముతో పూజించబడే అటువంటి స్వామి మాకు ప్రసన్నమవు గాక. 

శ్రీశుక ఉవాచ
ఇతి దేవర్షిణా ప్రోక్తం నిశమ్య భరతర్షభః
పూజయామాస సుప్రీతః కృష్ణం చ ప్రేమవిహ్వలః

ఈ రీతిగా నరదుడు చెప్పిన మాటను ధర్మరాజు విని, ఆయననూ శ్రీకృష్ణున్నీ ప్రేమతో పూజించాడు

కృష్ణపార్థావుపామన్త్ర్య పూజితః ప్రయయౌ మునిః
శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థః పరమవిస్మితః

కృష్ణ ధర్మరాజుల అనుమతి పొంది నారదుడు వెళ్ళిపోయాడు. కృష్ణుడు పరమాత్మ అని తెలుసుకుని పరమాశ్చర్యాన్ని పొంది మరింతగా కృష్ణున్ని సేవించాడు

ఇతి దాక్షాయిణీనాం తే పృథగ్వంశా ప్రకీర్తితాః
దేవాసురమనుష్యాద్యా లోకా యత్ర చరాచరాః

ఇది దక్ష ప్రజాపతి పుత్రికల వంశ కథలు. దేవ రాక్షస మనుష్య క్రిమి కీటకాదులన్నీ వారి సంతానమే. 

                                          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts