Followers

Monday 24 March 2014

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం మూడవ అధ్యాయం


శ్రీనారద ఉవాచ
హిరణ్యకశిపూ రాజన్నజేయమజరామరమ్
ఆత్మానమప్రతిద్వన్ద్వమేకరాజం వ్యధిత్సత

స తేపే మన్దరద్రోణ్యాం తపః పరమదారుణమ్
ఊర్ధ్వబాహుర్నభోదృష్టిః పాదాఙ్గుష్ఠాశ్రితావనిః

జటాదీధితిభీ రేజే సంవర్తార్క ఇవాంశుభిః
తస్మింస్తపస్తప్యమానే దేవాః స్థానాని భేజిరే

తస్య మూర్ధ్నః సముద్భూతః సధూమోऽగ్నిస్తపోమయః
తీర్యగూర్ధ్వమధో లోకాన్ప్రాతపద్విష్వగీరితః

చుక్షుభుర్నద్యుదన్వన్తః సద్వీపాద్రిశ్చచాల భూః
నిపేతుః సగ్రహాస్తారా జజ్వలుశ్చ దిశో దశ

తేన తప్తా దివం త్యక్త్వా బ్రహ్మలోకం యయుః సురాః
ధాత్రే విజ్ఞాపయామాసుర్దేవదేవ జగత్పతే

విష్ణు పురాణం పద్మ పురాణం విష్ణు ధర్మోత్తర పురాణములో ఈ గాధ ఇంకా విపులముగా ఉంటుంది . హిరణ్యకశిపుడు విష్ణువు మీదకు యుద్ధానికి వెళతానంటే శుక్రాచార్యుడు వారించి "ఈ బలం నీకు సరిపోదని" చెప్పి తపస్సు చేసి శక్తి సంపాదించుకోమని చెప్పాడు
తాను ఎవరి చేతిలో ఓడిపోకుండా తనకు సాటి ఇంకొకరు లేకుండా ఉండాలని సంకల్పించి మందర గిరి పర్వతము మీద పరమ దారుణమైన తపస్సు చేసాడు. కేవలం ఒక కాలి బొటన వేలిమీద నిలబడి ఆకాశాన్ని మాత్రమే చూస్తూ తపస్సు చేసాడు. ఇతని తపశ్శక్తితో జటల యొక్క కాంతులతో ప్రళయకాల సూర్యునిలా భాసించాడు. ఇతను తపస్సుకు వెళ్ళగానే దేవతలంతా వారి వారి లోకాలకు మళ్ళీ వెళ్ళారు. తపస్సు చేస్తున్న హిరణ్య కశిపుని నుంచి తపో జ్వాల లేచి అన్నిలోకాలనూ తపింపచేస్తూ, నదులూ సముద్రాలు క్షోభించాయి, ద్వీపములూ అద్రులు చలించాయి. గ్రహములూ నక్షత్రములూ తారలు కిందకు పడబోతున్నాయి

దైత్యేన్ద్రతపసా తప్తా దివి స్థాతుం న శక్నుమః
తస్య చోపశమం భూమన్విధేహి యది మన్యసే
లోకా న యావన్నఙ్క్ష్యన్తి బలిహారాస్తవాభిభూః

తస్యాయం కిల సఙ్కల్పశ్చరతో దుశ్చరం తపః
శ్రూయతాం కిం న విదితస్తవాథాపి నివేదితమ్

సృష్ట్వా చరాచరమిదం తపోయోగసమాధినా
అధ్యాస్తే సర్వధిష్ణ్యేభ్యః పరమేష్ఠీ నిజాసనమ్

తదహం వర్ధమానేన తపోయోగసమాధినా
కాలాత్మనోశ్చ నిత్యత్వాత్సాధయిష్యే తథాత్మనః

అన్యథేదం విధాస్యేऽహమయథా పూర్వమోజసా
కిమన్యైః కాలనిర్ధూతైః కల్పాన్తే వైష్ణవాదిభిః

అప్పుడందరూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ఇతను చేసే తపస్సు వలన మేము ఉండలేకున్నాము అని చెప్పారు. నీకు అన్ని రకముల్ పూజలు ఆచరించే అన్ని లోకములూ నశించకముందే అతని తపస్సుని నివారించవలసింది. అతను ఏమనుకుని తపస్సు చేస్తున్నాడో నీకు తెలిసే ఉంటుంది. ఘోరమైన తపస్సు చేసిన నీవు సకల చరాచర జగత్తునూ సృష్టించి సత్యలోకాన్ని అధిష్ఠించావన్న విషయం తనకు తెలుసు. త్రిమూత్రులలా తాను కూడా ఆ శక్తులు పొందాలని తపస్సు చేస్తున్నాడు. ఎన్ని యుగాలు తపస్సు చేస్తే నీవు బ్రహ్మవయ్యావో. బ్రహ్మాసనం శివత్వం విష్ణుత్వం కావాలి అన్న కోరిక కోరితే, అతను ఈ ఒక్క జన్మలో పొందలేకపోయినా తరువాత వచ్చే జన్మలలో అవ్వగలడు, ఎందుకంటే ఆత్మ నిత్యం కాబట్టి. అలా వరముని పొంది నీవు యధా పూర్వం ఉన్న దాన్ని సృష్టించిన దాన్ని అతను తారు మారు చేస్తాడు. ఇతను బ్రహ్మను గూర్చి తపస్సు చేస్తున్నాడు కాబట్టి అతనికి ఆ లోకమే నిత్యం అనుకుని విష్ణువూ శివుడూ కాలముతో నశించేవని భావించి తన తమో గుణముతో నీ లోకం కోరతాడు.

ఇతి శుశ్రుమ నిర్బన్ధం తపః పరమమాస్థితః
విధత్స్వానన్తరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర

ఇవన్నీ అనుకుని ఈ నిర్భంధముతో ఈ తపస్సు చేస్తున్నాడని మేము విన్నాము. ఏది యోగ్యమో ఆ పని నీవు చేయవలసినది

తవాసనం ద్విజగవాం పారమేష్ఠ్యం జగత్పతే
భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయ చ

ఇతను తపస్సు మొదలు నీ ఆసనం  కోరి చేస్తున్నాడు. బ్రాహ్మణ, గో స్థానాన్ని, పారమేష్ఠి స్థానం కోరి చేస్తున్నాడు

ఇతి విజ్ఞాపితో దేవైర్భగవానాత్మభూర్నృప
పరితో భృగుదక్షాద్యైర్యయౌ దైత్యేశ్వరాశ్రమమ్

అతని శరీరాన్ని పిపీలికాదులు తినేసాయి. ఎముకలు మాత్రం ఉన్నాయి. మబ్బు కమ్మిన సూర్యునిలా ఉన్న అతన్ని చూచి హంసవాహనుడు నవ్వి చూస్తూ

న దదర్శ ప్రతిచ్ఛన్నం వల్మీకతృణకీచకైః
పిపీలికాభిరాచీర్ణం మేదస్త్వఙ్మాంసశోణితమ్

తపన్తం తపసా లోకాన్యథాభ్రాపిహితం రవిమ్
విలక్ష్య విస్మితః ప్రాహ హసంస్తం హంసవాహనః

ఇలా అందరూ విజ్ఞ్యాపనం చేస్తే ప్రజాపతులనూ ఋషులనూ వెంటపెట్టుకుని హిరణ్యకశిపుని ఆశ్రమానికి వెళ్ళాడు. అతని మీద అప్పటికే పుట్ట మొలచి ఉంది, పుట్టా, వెదురు బొంగులూ, గడ్డీ, దర్భా, మొలిచాయి. 

శ్రీబ్రహ్మోవాచ
ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే తపఃసిద్ధోऽసి కాశ్యప
వరదోऽహమనుప్రాప్తో వ్రియతామీప్సితో వరః

అద్రాక్షమహమేతం తే హృత్సారం మహదద్భుతమ్
దంశభక్షితదేహస్య ప్రాణా హ్యస్థిషు శేరతే

నీవు తపస్సులో సిద్ధిపొందావు. ఇంక నీవు లే. నీకు వరములివ్వడానికి వచ్చాను. నీ హృదయ బలం ఎంతటిదో నేను చూడగలిగాను

నైతత్పూర్వర్షయశ్చక్రుర్న కరిష్యన్తి చాపరే
నిరమ్బుర్ధారయేత్ప్రాణాన్కో వై దివ్యసమాః శతమ్

వ్యవసాయేన తేऽనేన దుష్కరేణ మనస్వినామ్
తపోనిష్ఠేన భవతాజితోऽహం దితినన్దన

తతస్త ఆశిషః సర్వా దదామ్యసురపుఙ్గవ
మర్తస్య తే హ్యమర్తస్య దర్శనం నాఫలం మమ

ప్రాణాన్ని ఇంతవరకూ ఎముకలలో నిలిపినవాడి నీవొక్కడవే. ఇలా ఇంకెవరూ చేయలేరు. నీరు కూడా లేకుండా ఇలా తపస్సు ఎవరు చేయగలరు. నీ పట్టుదలతో నన్ను గెలిచావు. నీకేమి కావాలో కోరికో. నీవు మర్త్యుడవు, నేను అమర్త్యున్ని. నా దర్శనం వృధా ఎప్పుడూ కాదు. అన్ని కోరికలనూ తీరుస్తుంది. 

శ్రీనారద ఉవాచ
ఇత్యుక్త్వాదిభవో దేవో భక్షితాఙ్గం పిపీలికైః
కమణ్డలుజలేనౌక్షద్దివ్యేనామోఘరాధసా

"మొదటి పుట్టిన" దేవుడైన బ్రహ్మగారు చీమల దగ్గరనుంచీ అన్ని క్రిములూ తినేసిన హిరణ్యకశిపుని శరీరం మీద తన కమండలములో ఉన్న (విష్ణు పాదోదకమైన),అద్భుతమైన ఆరాధన చేసి పొందిన,  జలమును ప్రోక్షించాడు

స తత్కీచకవల్మీకాత్సహజోబలాన్వితః
సర్వావయవసమ్పన్నో వజ్రసంహననో యువా
ఉత్థితస్తప్తహేమాభో విభావసురివైధసః

ఈ జలం ప్రోక్షించబడగానే ఓజస్సూ సహస్సూ బలం కలిగి ఆ పుట్టను చేధించుకుని యువకుడై వజ్రము వంటి దేహము ఏర్పడి చక్కగా కాల్చిన బంగారు దేహముతో అగ్నిహోత్రునిలాగ లేచాడు

స నిరీక్ష్యామ్బరే దేవం హంసవాహముపస్థితమ్
ననామ శిరసా భూమౌ తద్దర్శనమహోత్సవః

ఉత్థాయ ప్రాఞ్జలిః ప్రహ్వ ఈక్షమాణో దృశా విభుమ్
హర్షాశ్రుపులకోద్భేదో గిరా గద్గదయాగృణాత్

శ్రీహిరణ్యకశిపురువాచ
కల్పాన్తే కాలసృష్టేన యోऽన్ధేన తమసావృతమ్
అభివ్యనగ్జగదిదం స్వయఞ్జ్యోతిః స్వరోచిషా

ఆత్మనా త్రివృతా చేదం సృజత్యవతి లుమ్పతి
రజఃసత్త్వతమోధామ్నే పరాయ మహతే నమః

నమ ఆద్యాయ బీజాయ జ్ఞానవిజ్ఞానమూర్తయే
ప్రాణేన్ద్రియమనోబుద్ధి వికారైర్వ్యక్తిమీయుషే

త్వమీశిషే జగతస్తస్థుషశ్చ ప్రాణేన ముఖ్యేన పతిః ప్రజానామ్
చిత్తస్య చిత్తైర్మనైన్ద్రియాణాం పతిర్మహాన్భూతగుణాశయేశః

త్వం సప్తతన్తూన్వితనోషి తన్వా త్రయ్యా చతుర్హోత్రకవిద్యయా చ
త్వమేక ఆత్మాత్మవతామనాదిరనన్తపారః కవిరన్తరాత్మా

త్వమేవ కాలోऽనిమిషో జనానామాయుర్లవాద్యవయవైః క్షిణోషి
కూటస్థ ఆత్మా పరమేష్ఠ్యజో మహాంస్త్వం జీవలోకస్య చ జీవ ఆత్మా

త్వత్తః పరం నాపరమప్యనేజదేజచ్చ కిఞ్చిద్వ్యతిరిక్తమస్తి
విద్యాః కలాస్తే తనవశ్చ సర్వా హిరణ్యగర్భోऽసి బృహత్త్రిపృష్ఠః

వ్యక్తం విభో స్థూలమిదం శరీరం యేనేన్ద్రియప్రాణమనోగుణాంస్త్వమ్
భుఙ్క్షే స్థితో ధామని పారమేష్ఠ్యే అవ్యక్త ఆత్మా పురుషః పురాణః

అనన్తావ్యక్తరూపేణ యేనేదమఖిలం తతమ్
చిదచిచ్ఛక్తియుక్తాయ తస్మై భగవతే నమః

ఆకాశములో ఉన్న హంస వాహనుడైన స్వామిని చూచి చేతులు జోడించి ఆనందాశ్రువులతో పులకింతలతో గద్గదమైన కంఠముతో స్తోత్రం చేస్తూ ప్రళయకాలములో అంధకారములో మునిగినా ఈ జగమును బయటకు తెచ్చావు. సత్వ రజస్సు తమస్సులను తెచ్చుకుని సృష్టి స్థితి సంహారం చేస్తున్నావు. ఇలాంటి త్రిగుణ ధామమైన నీకు నమస్కారం. సకల చరాచర జగత్తుకూ నీవు ఆది మూర్తివి. స్థావర జంగమములకు నీవే పతివి. నీవే బుద్ధికీ చిత్తానికీ పంచభూతములకూ అధిపతివి.నీవే మనసుకు ఈశ్వరుడవు.ఒక్క అహంకారం తప్ప మిగిలిన సప్త తంత్రులనూ నీవే కల్పించావు. యజ్ఞ్య విద్యా తపో విద్యా యోగ విద్యా సృష్టి విద్యా నీవే ఆత్మవై ఆత్మ కలవారందరికీ ఆత్మవై, అనాధివై ఉన్నావు. నీవే కాలానివీ నీవే ఆయువువూ, ఆయుష్యాన్ని పెంచేవాడివీ తీసుకునేవాడివీ నీవే. నీవే కూటస్థుడవు, మార్పులేనివాడవు, పుట్టుకలేని వాడవు, నీవే ఆత్మవు, నీకంటే పరమైనది వేరేదేదీ లేదు. కదిలేదీ కదలనిదీ రెండూ నీవే. అన్ని  విద్యలూ కళలూ మూర్తులూ నీవే. నీవే హిరణ్యగర్భుడవూ బ్రహ్మవూ, ప్రకృతివీ. ఇంద్రియములూ ప్రాణములూ మనసూ గుణములూ ఇవన్నీ నీ స్థూల శరీరం. ఆకలేసినప్పుడు ప్రపంచమంతా నీకొక చిన్న ముద్ద. నీవే ప్రకృతివీ జీవుడవూ పరమాత్మవు. చిత్ అచిత్ ఈశ్వర అనే మూడు శక్తులతో కూడి ఉన్న నీకు నమస్కారం.

యది దాస్యస్యభిమతాన్వరాన్మే వరదోత్తమ
భూతేభ్యస్త్వద్విసృష్టేభ్యో మృత్యుర్మా భూన్మమ ప్రభో

నాన్తర్బహిర్దివా నక్తమన్యస్మాదపి చాయుధైః
న భూమౌ నామ్బరే మృత్యుర్న నరైర్న మృగైరపి

వ్యసుభిర్వాసుమద్భిర్వా సురాసురమహోరగైః
అప్రతిద్వన్ద్వతాం యుద్ధే ఐకపత్యం చ దేహినామ్

నేను వరం అడుగుతున్నాను. ఇవ్వదలచుకుంటే ఇవ్వు. నీ సృష్టితో మరణించకుండా వరమును ఇవ్వు. లోపల గానీ వెలుపల గానీ పగలు గానీ రాత్రి కానీ ఆయుధాలతో కానీ భూమి మీద గానీ ఆకాశములో గానీ 

సర్వేషాం లోకపాలానాం మహిమానం యథాత్మనః
తపోయోగప్రభావాణాం యన్న రిష్యతి కర్హిచిత్

మానవులతో మృగములతో ప్రాణం ఉన్నవాటితో లేని వాటితో దేవ దానవ యక్ష నాగ కిన్నెరలలో నాకు ఎదురు ఉండకూడదు. సకల చరాచర జగత్తుకూ నేనే అధిపతిని కావాలి. సకల లోకపాలకుల ప్రభావం నాకే రావలి. తపస్సుతో యోగముతో గానీ నశించని శక్తి కావాలి. నా ఎదురుగా ఎవరూ నిలబడకూడదు అని అడిగాడు

Popular Posts