Followers

Sunday 23 March 2014

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదమూడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
వృత్రే హతే త్రయో లోకా వినా శక్రేణ భూరిద
సపాలా హ్యభవన్సద్యో విజ్వరా నిర్వృతేన్ద్రియాః

ఇలా వృత్తాసుర సంహారం జరిగిన తరువాత ఒక్క ఇంద్రుడు తప్ప లోకపాలకులూ త్రిలోకవాసులూ వారి బాధ తొలగి సంతోషించారు. వృత్తాసురున్ని చంపినందు వలన బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది ఇంద్రునకు. 

దేవర్షిపితృభూతాని దైత్యా దేవానుగాః స్వయమ్
ప్రతిజగ్ముః స్వధిష్ణ్యాని బ్రహ్మేశేన్ద్రాదయస్తతః

దేవతలూ వారి అనుచరులూ సంతోషముతో తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు. 

శ్రీరాజోవాచ
ఇన్ద్రస్యానిర్వృతేర్హేతుం శ్రోతుమిచ్ఛామి భో మునే
యేనాసన్సుఖినో దేవా హరేర్దుఃఖం కుతోऽభవత్

అందరూ ఆనందిస్తుండగా ఇంద్రుడెందుకు ఆనందించలేదు. 

శ్రీశుక ఉవాచ
వృత్రవిక్రమసంవిగ్నాః సర్వే దేవాః సహర్షిభిః
తద్వధాయార్థయన్నిన్ద్రం నైచ్ఛద్భీతో బృహద్వధాత్

వృత్తాసురుడు స్వర్గం మీదకు దండెత్తి వచ్చినప్పుడే అతని భయంకరమైన పరాక్రమాన్ని చూసి భయపడి ఇంద్రున్ని శరణు వేడారు. 

ఇన్ద్ర ఉవాచ
స్త్రీభూద్రుమజలైరేనో విశ్వరూపవధోద్భవమ్
విభక్తమనుగృహ్ణద్భిర్వృత్రహత్యాం క్వ మార్జ్మ్యహమ్

బ్రాహ్మణున్ని చంపడం ఎందుకని ఇంద్రుడు శంకించాడు. ఇది వరకే విశ్వరూపున్ని చంపినందు వలన వచ్చిన బ్రహ్మ హత్యా దోషాన్ని స్త్రీ జలం భూమీ వృక్షాలకు పంచాను. మళ్ళీ వృత్తాసురుని వధతో వచ్చే బ్రహ్మహత్యాపాతకాన్ని ఎలా పోగొట్టుకోవాలో ముందే జాగ్రత్త పడాలి. అది ఎలా పోగొట్టుకోవాలి. 

శ్రీశుక ఉవాచ
ఋషయస్తదుపాకర్ణ్య మహేన్ద్రమిదమబ్రువన్
యాజయిష్యామ భద్రం తే హయమేధేన మా స్మ భైః

అప్పుడు అందరూ "నీ చేత అశ్వమేధము చేయిస్తాము. దాని వలన ఒక్క బ్రహ్మ హత్య కాదు. సమస్తలోకాన్ని చంపిన పాపం పోతుంది"

హయమేధేన పురుషం పరమాత్మానమీశ్వరమ్
ఇష్ట్వా నారాయణం దేవం మోక్ష్యసేऽపి జగద్వధాత్

బ్రహ్మహా పితృహా గోఘ్నో మాతృహాచార్యహాఘవాన్
శ్వాదః పుల్కసకో వాపి శుద్ధ్యేరన్యస్య కీర్తనాత్

పరమాత్మ నామాన్ని స్మరిస్తే బ్రహ్మ పితృ గో ఆచార్య మాతృ హత్యలనే పాపాలు పోతాయి. ఆయనను ఆరాధిస్తే ఏ పాపాలూ ఉండవు

తమశ్వమేధేన మహామఖేన శ్రద్ధాన్వితోऽస్మాభిరనుష్ఠితేన
హత్వాపి సబ్రహ్మచరాచరం త్వం న లిప్యసే కిం ఖలనిగ్రహేణ

మేము చాలా భక్తి శ్రద్ధలతో అశ్వమేధ యాగాన్ని జరిపిస్తాము. నీవూ అలా ఆచరించు, అలా చేస్తే బ్రాహ్మణున్ని చంపిన పాపమే కాదు బ్రహ్మను చంపిన పాపం కూడా పోతుంది. సాధువులను పీడించేవాడు బ్రాహ్మణుడైనా తప్పు కాదు. నీకే భయం లేదు అని ఋషులందరూ హామీ ఇచ్చారు

శ్రీశుక ఉవాచ
ఏవం సఞ్చోదితో విప్రైర్మరుత్వానహనద్రిపుమ్
బ్రహ్మహత్యా హతే తస్మిన్నాససాద వృషాకపిమ్

ఇలా ఋషులందరూ ప్రభోధించి ప్రేరేపిస్తే వృత్తాసురున్ని వధించాడు.వృత్తాసురున్ని చంపగానే బ్రహ్మ హత్యాపాపం ఇంద్రున్ని వెంటాడింది. ఆ తాపమును ఇంద్రుడు సహించలేకపోయాడు.

తయేన్ద్రః స్మాసహత్తాపం నిర్వృతిర్నాముమావిశత్
హ్రీమన్తం వాచ్యతాం ప్రాప్తం సుఖయన్త్యపి నో గుణాః

అందుకు ఆనందించలేకపోయాడు. ఎన్ని మంచి గుణములున్నా పది మంది నోట్లో పడితే (అపనిందపడితే) ఏమి సుఖం ఉంటుంది. ఇంద్రునికదే స్థితి కలిగింది. బ్రహ్మహత్య ఒక చండాల స్త్రీరూపములో ఉండి ముసలి తనముతో కంపిస్తూ, కుష్ఠు వ్యాధితో నెత్తురోడున్న చర్మముతో ఆమె నెరిసిన జుట్టును విరబోసుకుని "ఆగు ఆగ" మని అంటూ వచ్చింది. ఆమె వస్తూ ఉంటే చేపల వాసన అంతా వ్యాపించి దారినే చెడగొడుతున్నది. ఆమె నడిచే దారంతా చేపల వాసనే ఉంది.

తాం దదర్శానుధావన్తీం చాణ్డాలీమివ రూపిణీమ్
జరయా వేపమానాఙ్గీం యక్ష్మగ్రస్తామసృక్పటామ్

వికీర్య పలితాన్కేశాంస్తిష్ఠ తిష్ఠేతి భాషిణీమ్
మీనగన్ధ్యసుగన్ధేన కుర్వతీం మార్గదూషణమ్

నభో గతో దిశః సర్వాః సహస్రాక్షో విశామ్పతే
ప్రాగుదీచీం దిశం తూర్ణం ప్రవిష్టో నృప మానసమ్

ఇంద్రుడు ఏ దిక్కుకు వెళితే ఆ దిక్కుకు వచ్చింది. అలా తిరిగి తిరిగి మానస సరోవరానికి వచ్చాడు. అందులో పద్మము యొక్క నాడములో ఉన్న తంతువులలో దాక్కున్నాడు. 

స ఆవసత్పుష్కరనాలతన్తూనలబ్ధభోగో యదిహాగ్నిదూతః
వర్షాణి సాహస్రమలక్షితోऽన్తః సఞ్చిన్తయన్బ్రహ్మవధాద్విమోక్షమ్

ఒక వెయ్యి సంవత్సరాలు వేరే దారిలేక బ్రహ్మవధ నుడి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ మగ్గిపోయాడు.

తావత్త్రిణాకం నహుషః శశాస విద్యాతపోయోగబలానుభావః
స సమ్పదైశ్వర్యమదాన్ధబుద్ధిర్నీతస్తిరశ్చాం గతిమిన్ద్రపత్న్యా

నహుషుడికి తాత్కాలికముగా ఇంద్రపదవిని ఇచ్చారు. ఈ నగుషుడు విద్యా తపమూ యోగమూ ఉన్నవాడు. అతను స్వర్గాన్ని పరిపాలించాడు. ఆ నహుషుడు పరిపాలిస్తూ ఉన్నాడు. మన పూర్వ పుణ్యము వలన ధర్మం వలన పెద్దలను సేవించడం వలన మంచి యోగం వస్తే ఆ యోగముతో వినయాన్నీ భక్తినీ పెద్దలను సేవించడం పెంచుకోవాలి. పెద్దలను అవమానిస్తే స్థాన భ్రష్టుడవుతాడు.

తతో గతో బ్రహ్మగిరోపహూత ఋతమ్భరధ్యాననివారితాఘః
పాపస్తు దిగ్దేవతయా హతౌజాస్తం నాభ్యభూదవితం విష్ణుపత్న్యా

అలా శచీదేవి వలన నహుషుడు పాముగా మారాడు. అతను వెళ్ళిన తరువాత బ్రహ్మదేవుడే వచ్చి ఇంద్రున్ని స్వయముగా రమ్మని పిలిచి ఋతంభరా మంత్రాన్ని ఉపదేశించాడు. ఋతమంటే పరమాత్మ. పరమాత్మ చేత భరించబడేది, అమ్మ వారు. అది అమ్మవారిని స్తోత్రం చేసే మంత్రం. ఆ మంత్రాన్ని జపించడము వలన అమ్మవారి కృపతో ఇంద్రుడు బయటకు వచ్చినా బ్రహ్మహత్య విడిచిపెట్టింది. 

తం చ బ్రహ్మర్షయోऽభ్యేత్య హయమేధేన భారత
యథావద్దీక్షయాం చక్రుః పురుషారాధనేన హ

ఋతంభర (లక్ష్మీ నారాయణుల ధ్యానముతో తొలగిన పాపము కలవాడై తనలోకానికి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవిచేత కాపాడబడిన ఇంద్రున్ని బ్రహ్మ హత్య ఏమీ చేయలేకపోయింది. అప్పుడు ఋషులందరూ దీక్షనిచ్చి అశ్వమేధయాగాన్ని ప్రారంభించారు. 

అథేజ్యమానే పురుషే సర్వదేవమయాత్మని
అశ్వమేధే మహేన్ద్రేణ వితతే బ్రహ్మవాదిభిః

స వై త్వాష్ట్రవధో భూయానపి పాపచయో నృప
నీతస్తేనైవ శూన్యాయ నీహార ఇవ భానునా

బ్రహ్మహత్యా పాతకం చాలా పెద్దదే అయినా శ్రీమన్నారాయణుని ఆరాధనతో అది బాదించలేకపోయినది. పరమాత్మ ఆరాధనతో తొలగని పాపం అంటూ ఏదీ లేదు. సూర్యభగవానుని వలన మంచు తొలగినట్లు పాపం తొలగించబడింది.

స వాజిమేధేన యథోదితేన వితాయమానేన మరీచిమిశ్రైః
ఇష్ట్వాధియజ్ఞం పురుషం పురాణమిన్ద్రో మహానాస విధూతపాపః

ఇంద్రుడు పెద్దలు చెప్పిన అశ్వమేధయాగాన్ని ఆచరించి, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణున్ని ఆరాధించి పాపము తొలగించుకున్నాడు

ఇదం మహాఖ్యానమశేషపాప్మనాం ప్రక్షాలనం తీర్థపదానుకీర్తనమ్
భక్త్యుచ్ఛ్రయం భక్తజనానువర్ణనం మహేన్ద్రమోక్షం విజయం మరుత్వతః

అఖిల పాపములనూ కడిగేసే ఈ శ్రీమన్నారాయణుని కీర్తనను చేసే వ్యాఖ్యానం ఇది. ఈ చరిత్ర వింటే భక్తి పెరుగుతుంది (వృత్తాసురుడు పరమ భాగవతుడు). దీనిలో ఇంద్రవిజయం ఇంద్ర మోక్షం (పాపము తొలగిపోవుట) ఉన్నాయి. రాజైన వాడికి శత్రు సంహారం వలన విజయం లభించినా దానితోబాటే పాపం కూడా ఉంటుంది. ఇవి జరుగుతున్నా పరమాత్మ నామసంకీర్తన చేస్తుంటే ఆ పాపం మనను బాధించదు. 

పఠేయురాఖ్యానమిదం సదా బుధాః శృణ్వన్త్యథో పర్వణి పర్వణీన్ద్రియమ్
ధన్యం యశస్యం నిఖిలాఘమోచనం రిపుఞ్జయం స్వస్త్యయనం తథాయుషమ్

జ్ఞ్యానము కలవారు ఈ వృత్తాసుర ఉపాఖ్యాన్ని అధ్యయం చేస్తే (శ్రాద్ధ సమయములో వృత్తాసుర వధ, వామన చరిత్ర చదివేవారు) , ప్రతీ పర్వలో (పూర్ణిమా అమావాస్య అష్టమీ ఏకాదశి ఇవి నాలుగు పర్వలు) ఈ ఆఖ్యానాన్ని వినాలి. ఇది ధనమునూ కీర్తినీ ఇస్తుంది అన్ని సంపదలూ ఇస్తుంది, శత్రు సంహారం చేస్తుంది, పాపాలను తొలగిస్తుంది, కీర్తి లభిస్తుంది.

Popular Posts