Followers

Wednesday 19 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదహేడవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
తత్ర భగవతః సాక్షాద్యజ్ఞలిఙ్గస్య విష్ణోర్విక్రమతో వామపాదాఙ్గుష్ఠనఖ
నిర్భిన్నోర్ధ్వాణ్డకటాహవివరేణాన్తఃప్రవిష్టా యా బాహ్యజలధారా తచ్చరణపఙ్కజావనేజనారుణ
కిఞ్జల్కోపరఞ్జితాఖిలజగదఘమలాపహోపస్పర్శనామలా సాక్షాద్భగవత్పదీత్యనుపలక్షితవచో
భిధీయమానాతిమహతా కాలేన యుగసహస్రోపలక్షణేన దివో మూర్ధన్యవతతార యత్తద్విష్ణుపదమాహుః

సీతా అలకనందా భద్ర చక్షు అనే నాలుగు నదులూ పరమాత్మ పాదాంగుష్ఠమునుంచి పుట్టిన నదులు. పరమాత్మ యజ్ఞ్య లింగుడు. పరమాత్మను గుర్తించేది యజ్ఞ్యముతోనే. ఆయన త్రివిక్రమావతారములో ఈయన ఎడమ కాలిని పైలోకం కొలవడానికి పంపాడు. దాని బొటన వేలి గోరు చివర తగిలి బ్రహ్మాండ కటాహం పగిలి రంధ్రం ఏర్పడి అందులోంచి జలం పుట్టింది. అదే గంగా నది. జలము లోపల ప్రవేశించింది. పరమాత్మ యొక్క పాదమును ఆ జలమే కడిగింది. పరమాత్మ పాద పద్మములను కడుగుట వలన ఆ పాద పద్మముల అరుణిమ (ఎర్రదనం) నీటిలో ప్రవేశించింది. ఆ ఎరుపుదుదనం పద్మము మధ్య ఉన్న పుప్పొడి వంటిది. సకల జగముల పాపమును తొలగించదగినది కాబట్టి ఈ జలం పవిత్రం. ఈ నదిని భగవత్ పది అంటారు. బ్రహ్మాండ కటాహం నుంచి రావడానికి ఎన్నో యుగాలు పట్టింది. అలా కొన్ని వేల యుగాల తరువాత ద్యౌ భాగానికి వచ్చింది. దానికే విష్ణు పదం అని పేరు. ప్రకృతి నుంచి వచ్చిన మహత్ తత్వం మహత్ తత్వం నుంచి వచ్చిన అహంకారం, తామసాహంకారం నుంచి పుట్టిన వాటిలో ఒకటి ఆకాశం. అలా ప్రకృతిని భేదించుకుని రావడానికి కొన్ని వేల యుగాలు పట్టింది.

యత్ర హ వావ వీరవ్రత ఔత్తానపాదిః పరమభాగవతోऽస్మత్కులదేవతాచరణారవిన్దోదకమితి
యామనుసవనముత్కృష్యమాణభగవద్భక్తియోగేన దృఢం క్లిద్యమానాన్తర్హృదయ ఔత్కణ్ఠ్య
వివశామీలితలోచనయుగలకుడ్మలవిగలితామలబాష్పకలయాభివ్యజ్యమానరోమపులకకులకోऽధునాపి
పరమాదరేణ శిరసా బిభర్తి

అక్కడే ధ్రువుడు ఉన్నాడు. శింశుమారమంటే మొసలి ఆకారముతో ఉంటుంది. పరమభాగవతుడు ధ్రువుడు. ఈ జలం మా కులదైవమైన పరమాత్మ పాదోదకమని ప్రతీ క్షణం ఆకర్షితమైన భక్తి రసముతో తడిసిన హృదయముతో ఉన్న వాడిని గంగ తడిపింది. కంటి నిండా ఆనందబాష్పాలూ శరీరమంతా పులకింతలూ కలిగి పరమాత్మ యందు అతనికున్న భక్తి పారవశ్యం సూచించబడుతూ ఉంది. ఈనాటికీ ఆ గంగా జలాన్ని ధ్రువుడు రోజూ శిరస్సున ధరిస్తూ ఉన్నాడు

తతః సప్త ఋషయస్తత్ప్రభావాభిజ్ఞా యాం నను తపస ఆత్యన్తికీ సిద్ధిరేతావతీ భగవతి
సర్వాత్మని వాసుదేవేऽనుపరతభక్తియోగలాభేనైవోపేక్షితాన్యార్థాత్మగతయో ముక్తిమివాగతాం ముముక్షవ
ఇవ సబహుమానమద్యాపి జటాజూటైరుద్వహన్తి

పరమాత్మ ప్రభావం బాగా తెలిసిన తపస్వులు "మేమాచరించే తపస్సుకు అసలైన సిద్ధి ఇదే" అనుకొని, ఎప్పుడూ తగ్గని భక్తి యోగముతో ఇతర సకల పురుషార్థములనూ వారు ఉపేక్షించారు. వచ్చిన గంగను చూచి ముక్తే నడచి వచ్చింది అనుకున్నారు. ఎంతో భక్తితో గౌరవముతో ఇప్పటికీ ఆ జలాన్ని తమ జటలతో వహిస్తున్నారు.

తతోऽనేకసహస్రకోటివిమానానీకసఙ్కులదేవయానేనావతరన్తీన్దు మణ్డలమావార్య బ్రహ్మ
సదనే నిపతతి

అక్కడి నుంచీ మరి కాస్త కిందకి దిగింది గంగ. ఆకాశములోకి అవతరించింది. అక్కడ ఎప్పుడూ అనేక సహస్ర కోటి దేవతల విమానములతో నిండిన ఆకాశములో చంద్రమండలాన్ని ముంచేసి బ్రహ్మలోకానికి వచ్చింది.

తత్ర చతుర్ధా భిద్యమానా చతుర్భిర్నామభిశ్చతుర్దిశమభిస్పన్దన్తీ నదనదీ
పతిమేవాభినివిశతి సీతాలకనన్దా చక్షుర్భద్రేతి

బ్రహ్మ దగ్గరకొచ్చేసరికి ఈ నది నాలుగుగా మారింది. అల మారి నాలుగు నదులుగా ప్రవహించి సముద్రములో కలుస్తుంది. వాటిలో ఒకటి

సీతా తు బ్రహ్మసదనాత్కేసరాచలాదిగిరిశిఖరేభ్యోऽధోऽధః ప్రస్రవన్తీ గన్ధమాదనమూర్ధసు
పతిత్వాన్తరేణ భద్రాశ్వవర్షం ప్రాచ్యాం దిశి క్షారసముద్రమభిప్రవిశతి

సీతా నది. అది బ్రహ్మలోకములో కేసరాచలా పర్వతం నుంచి గంధమాదన పర్వతములోకొచ్చి భద్రాశవ వర్షములో పశ్చిమ దిక్కులో ఉప్పు సముద్రములో కలుస్తుంది

ఏవం మాల్యవచ్ఛిఖరాన్నిష్పతన్తీ తతోऽనుపరతవేగా కేతుమాలమభి చక్షుః ప్రతీచ్యాం దిశి సరిత్
పతిం ప్రవిశతి

ఇంకో నది చక్షు, మాల్యవ శికరం నుంచి జారిపడుతూ వేగం తగ్గకుండా కేతుమాలమునుంచి వచ్చి పశ్చిమ దిక్కునుంచి సముద్రములో చేరుతుంది

భద్రా చోత్తరతో మేరుశిరసో నిపతితా గిరిశిఖరాద్గిరిశిఖరమతిహాయ శృఙ్గవతః
శృఙ్గాదవస్యన్దమానా ఉత్తరాంస్తు కురూనభిత ఉదీచ్యాం దిశి జలధిమభిప్రవిశతి

భద్రా నది మేరు నుండి ఉత్తరభాగం నుండి పడి ఒక్కో పర్వతాన్ని దాటుకుంటూ వచ్చి శృగవత్ పర్వతం నుంచి జారుతూ ఉత్తర దిక్కులో సముద్రాన్ని చేరుతుంది.

తథైవాలకనన్దా దక్షిణేన బ్రహ్మసదనాద్బహూని గిరికూటాన్యతిక్రమ్య
హేమకూటాద్ధైమకూటాన్యతిరభసతరరంహసా లుఠయన్తీ భారతమభివర్షం దక్షిణస్యాం దిశి
జలధిమభిప్రవిశతి యస్యాం స్నానార్థం చాగచ్ఛతః పుంసః పదే పదేऽశ్వమేధరాజసూయాదీనాం ఫలం
న దుర్లభమితి

అలకనంద బ్రహ్మలోకం నుంచి దక్షిణ దిక్కు నుంచి జారి ఎన్నో పర్వతాలను దాటి హేమ పర్వతాన్ని దాటి భారత వర్షము వద్ద దక్షిణ దిక్కులో సముద్రాన్ని చేరుతుంది. ఈ నదిలో స్నానం చేసిన వాడికి ప్రతీ అడుగుకూ పది అశ్వమేధాలూ రాజసూయాలు చేసినట్లు

అన్యే చ నదా నద్యశ్చ వర్షే వర్షే సన్తి బహుశో మేర్వాదిగిరిదుహితరః శతశః
తత్రాపి భారతమేవ వర్షం కర్మక్షేత్రమన్యాన్యష్ట వర్షాణి స్వర్గిణాం పుణ్యశేషోపభోగ
స్థానాని భౌమాని స్వర్గపదాని వ్యపదిశన్తి

ఇలా ఈ నాలుగే కాక ప్రతీ వర్షములో ఎన్నో నదులూ నదములూ ఉన్నాయి. కొన్ని మేరు పర్వతం యొక్క బిడ్డలు. ఒక్కో పర్వతం నుండీ వేల నదులు పుట్టాయి. అవి ఈ భూ ప్రపంచాన్ని ఆవరించి ఉన్నాయి. వీటిలో అలకనందకు ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే భార్త క్షేత్రం గొప్పది కాబట్టి అలకనంద గొప్పది. భార్త క్షేత్రం కర్మ భూమి. ఆయా లోకాలకు వెళ్ళడానికి కావలసిన కర్మలు చేయడానికి ఉన్నది భారత భూమి. స్వర్గములో దేవతలు కూడా ఇక్కడికే వచ్చి ఆ స్థానం పొందారు. మిగతా ఎనిమిది వర్షములూ స్వర్గానికి వెళ్ళేవారు పుణ్య శేషముతో అనుభవించే భోగస్థానాలు.

ఏషు పురుషాణామయుతపురుషాయుర్వర్షాణాం దేవకల్పానాం నాగాయుతప్రాణానాం
వజ్రసంహననబల
వయోమోదప్రముదితమహాసౌరతమిథునవ్యవాయాపవర్గవర్షధృతైకగర్భకలత్రాణాం తత్ర తు త్రేతా
యుగసమః కాలో వర్తతే

మిగతా వర్షాలలో పురుషులకు పదివేల, లక్ష సంవత్సరాలు ఆయువు కలవారు, పదివేల ఏనుగుల బలం కలవారు. వజ్రాయుధం కన్నా ఎక్కువ బలం కలవారు. నిరంతరం ఆమోదమే, మోదమూ (శరీర హర్షం లేదా అనుకూల వస్తువును చూడటం వలన కలిగేది) ప్రమోదమూ (మాన్సిక హర్షం లేదా చూసిన వస్తువును తనది చేసుకోవడం వలన కలిగేది) ఆనందమూ (ఆత్మానందం లేదా తనది చేసుకున్న దానిని అనుభవించడం వలన కలిగేది.)  ఇవి కలగడం వలన సంతోషించిన వారూ, నిరంతరం దంపతుల సమాగమముతోనే కాలం గడిపేవారు. వారు కేవలం యుగం పూర్తైన తరువాత చివరి సంవత్సరములో మాత్రమే ఆ భార్యలు గర్భాన్ని ధరిస్తారు. అక్కడి కాలం త్రేతాయుగములా ఉంటుంది.

యత్ర హ దేవపతయః స్వైః స్వైర్గణనాయకైర్విహితమహార్హణాః సర్వర్తుకుసుమస్తబకఫల
కిసలయశ్రియానమ్యమానవిటపలతావిటపిభిరుపశుమ్భమానరుచిరకాననాశ్రమాయతనవర్షగిరిద్రోణీషు
తథా చామలజలాశయేషు వికచవివిధనవవనరుహామోదముదితరాజహంసజలకుక్కుటకారణ్డవసారస
చక్రవాకాదిభిర్మధుకరనికరాకృతిభిరుపకూజితేషు జలక్రీడాదిభిర్విచిత్రవినోదైః సులలితసురసున్దరీణాం
కామకలిలవిలాసహాసలీలావలోకాకృష్టమనోదృష్టయః స్వైరం విహరన్తి

అక్కడి దేవతాపతులు తమ తమ సేవకులతో గొప్ప సేవలు చేయించుకోబడుతూ అన్ని ఋతువులలో ఉన్న అన్ని కాయలూ పళ్ళతో ఆరాధించబడుతూ, చెట్లూ పూలూ కాయలూ పళ్ళూ చెట్ల కొమ్మలూ అరణ్యములూ వాటితో కూడిన పర్వతములూ నదులూ ఆశ్రయములూ పరిశుద్ధమైన జలము కలిగి ఉన్న ఆశ్రమాలు. రక రకముల పక్షులూ తుమ్మెదలూ మొదలైన వాటితో విహరిస్తూ ఉండగా, జల క్రీడలతో పరమ సుందరులైన దేవతా స్త్రీలతో వారి యవ్వనం వయ్యారముతో ఆకర్షించబడిన మనసు కలవారై విహరిస్తూ ఉంటారు

నవస్వపి వర్షేషు భగవాన్నారాయణో మహాపురుషః పురుషాణాం తదనుగ్రహాయాత్మతత్త్వ
వ్యూహేనాత్మనాద్యాపి సన్నిధీయతే

అక్కడ ప్రతీ వర్షములో పరమాత్మ ఏదో ఒక రూపములో అక్కడ ఉన్న వారిలో ముఖ్యమైన వారితో పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ తొమ్మిది వర్షాలలో పరమాత్మ ఆయా రూపాలలో ఇప్పటికీ ఉన్నాడు

ఇలావృతే తు భగవాన్భవ ఏక ఏవ పుమాన్న హ్యన్యస్తత్రాపరో నిర్విశతి భవాన్యాః శాపనిమిత్తజ్ఞో
యత్ప్రవేక్ష్యతః స్త్రీభావస్తత్పశ్చాద్వక్ష్యామి

ఇలావృత వర్షములో కేవల శంకరుడు మాత్రమే పురుషుడు. మిగతా వారు ఎవరు వెళ్ళినా స్త్రీలే అవుతారు. పార్వతీదేవి శాపమున్నది.

భవానీనాథైః స్త్రీగణార్బుదసహస్రైరవరుధ్యమానో భగవతశ్చతుర్మూర్తేర్మహాపురుషస్య
తురీయాం తామసీం మూర్తిం ప్రకృతిమాత్మనః సఙ్కర్షణసంజ్ఞామాత్మసమాధిరూపేణ
సన్నిధాప్యైతదభిగృణన్భవ ఉపధావతి

అమ్మవారు వారందరికీ నాయకురాలు. శంకరుడు పరమాత్మ యొక్క నాలగవ రూపం (సంకర్షణ) అయిన శంకరుడు ఆత్మ రూపములో ఉండి పరమాత్మ అయిన సంకర్షణున్ని ఆరాధిస్తాడు ఈ మంత్రముతో

శ్రీభగవానువాచ
ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణసఙ్ఖ్యానాయానన్తాయావ్యక్తాయ నమ ఇతి
భజే భజన్యారణపాదపఙ్కజం భగస్య కృత్స్నస్య పరం పరాయణమ్
భక్తేష్వలం భావితభూతభావనం భవాపహం త్వా భవభావమీశ్వరమ్

ఇది సంకర్షణ మత్రం. అన్ని గుణములూ వచ్చి చేరిన వాడు. స్వామి విజ్ఞ్యానమూ బలమూ అనంతము. ఆయన అవ్యక్తుడు. అలాంటి స్వామికి నమస్కారం. అని శంకరుడు సంకర్షణున్ని ఇలావృత్తములో స్వామిని అర్చిస్తూ ఉంటాడు. "సేవించదగిన వారికి నెలవైన పాదపద్మములు కలిగినవాడివైన నిన్ను సేవిస్తున్నాను. సకల ఐశ్వర్యము ఇచ్చే స్వామి, సంసారాన్ని తొలగించే నీవు, భక్తుల కోరిక తీర్చే నీకు నమస్కరిస్తున్నాను

న యస్య మాయాగుణచిత్తవృత్తిభిర్నిరీక్షతో హ్యణ్వపి దృష్టిరజ్యతే
ఈశే యథా నోऽజితమన్యురంహసాం కస్తం న మన్యేత జిగీషురాత్మనః

ఈయన తన మాయా గుణములతో చిత్త వృత్తులతో సృష్టించబడిన జగత్తును చూస్తున్నా వాటి యందు ఆయనకు ఆసక్తి కలగదు. మనస్సు లగ్నం కాకుండా ఉండాలంటే కోపాన్ని గెలవాలి. కోపాన్ని గెలవగలిగిన వాడే మనస్సుని గెలవగలరు. మానవులందరూ గెలవలేని కోపం గలవారే. కోపమును గెలవాలనుకున్న వారు ఎవరు ఆ పరమాత్మను సేవించరు?

అసద్దృశో యః ప్రతిభాతి మాయయా క్షీబేవ మధ్వాసవతామ్రలోచనః
న నాగవధ్వోऽర్హణ ఈశిరే హ్రియా యత్పాదయోః స్పర్శనధర్షితేన్ద్రియాః

వంకర చూపు ఉన్నవారికి ప్రపంచం ఉన్నట్లు కనపడుతుంది. మద్య పానం చేసిన వారి కనులు ఎలా ఐతే ఎర్రబారి ప్రపంచమంతా తిరుగుతున్నట్లు కనపడుతుందో అలాగ. నాగ వధువులు ఆరాధించడానికి ముందుకు వచ్చీ, పరమాత్మ పాదములు స్పృశించడం వలన ఇంద్రియ ఘర్షణ కలిగి, సిగ్గుతో ఆరాధించలేకపోతున్నారు నిన్ను. నీకు పుట్టుకా రక్షణా లయం లేదు. అందుకే నిన్ను అనంతం అంటారు.

యమాహురస్య స్థితిజన్మసంయమం త్రిభిర్విహీనం యమనన్తమృషయః
న వేద సిద్ధార్థమివ క్వచిత్స్థితం భూమణ్డలం మూర్ధసహస్రధామసు

ఈ సంకర్షుని వేయి పడగలలో ఏదో ఒక పడగ మీద ఏదో ఒక చిన్న మూల ఆవగింజలా ఉన్న భూమండలం ఉన్నట్లు కూడా ఈయనకు తెలియదు.

యస్యాద్య ఆసీద్గుణవిగ్రహో మహాన్విజ్ఞానధిష్ణ్యో భగవానజః కిల
యత్సమ్భవోऽహం త్రివృతా స్వతేజసా వైకారికం తామసమైన్ద్రియం సృజే

ఈయన గుణాలు అనంతములు. ఈయన అనంతమైన ఆకారములలో ఒక ఆకారం బ్రహ్మ. ఆయన నుంచి నేను (శంకరుడు) పుట్టాను. నేను సత్వ రజస్సు తమో గుణాలూ ఓంకారం ఇలాంటి వాటితో తమోగుణాలనూ పంచభూతాలనూ ప్రళయాన్ని సృష్టించేవాడిగా ఉన్నాను. 

ఏతే వయం యస్య వశే మహాత్మనః స్థితాః శకున్తా ఇవ సూత్రయన్త్రితాః
మహానహం వైకృతతామసేన్ద్రియాః సృజామ సర్వే యదనుగ్రహాదిదమ్

మేమంతా దారముతో కట్టబడిన పక్షులలా ఈయన అధీనములో ఉన్నాము. నేను మహాన్ (అహంకారం), రాజసిక సాత్విక తామసిక అహంకారాన్ని సృష్టిస్తున్నాను. అది ఎవరి అనుగ్రహం వలన చేస్తున్నామో ఆయనకి నమస్కారం

యన్నిర్మితాం కర్హ్యపి కర్మపర్వణీం మాయాం జనోऽయం గుణసర్గమోహితః
న వేద నిస్తారణయోగమఞ్జసా తస్మై నమస్తే విలయోదయాత్మనే

ఎవరి మాయ వలన త్రిగుణాత్మకమైన జగత్తులో పడి దానిని దాటలేకపోతున్నాము. దీనిని ఎలా దాటాలో మనం తెలుసుకోలేకపోతున్నాము. అలాంటి ప్రళయకారకుడైన పరమాత్మకు నమస్కారం

Popular Posts