Followers

Sunday 23 March 2014

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఆరవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
తతః ప్రాచేతసోऽసిక్న్యామనునీతః స్వయమ్భువా

షష్టిం సఞ్జనయామాస దుహితౄః పితృవత్సలాః
దశ ధర్మాయ కాయాదాద్ద్విషట్త్రిణవ చేన్దవే

బ్రహ్మ ఆజ్ఞ్య మేరకు దక్షుని భార్య యందు అరవై మంది పుత్రికలను సృష్టించాడు. వారికి తండ్రి మీద అపారమైన ప్రేమ కలదు. ధర్ముడికి పది మంది, పదమూడు మందిని కశ్యప ప్రజాపతికి, చంద్రుడికి ఇరవై ఏడు మంది

భూతాఙ్గిరఃకృశాశ్వేభ్యో ద్వే ద్వే తార్క్ష్యాయ చాపరాః
నామధేయాన్యమూషాం త్వం సాపత్యానాం చ మే శృణు

రుద్రునికి అంగిరసునికి అగ్నికి ఇద్దరేసి మంది తార్క్షునికి ఒకరిని. వారి పేర్లు విను 

యాసాం ప్రసూతిప్రసవైర్లోకా ఆపూరితాస్త్రయః
భానుర్లమ్బా కకుద్యామిర్విశ్వా సాధ్యా మరుత్వతీ

వీరి సంతానమే మూడు లోకాలూ నిండి ఉన్నది. 
భానుః, లంబా కకుద్యామిర్విశ్వా సాధ్యా మరుత్వతీ వసుర్ముహూర్తా సఙ్కల్పా - వీరంతా ధర్ముని భార్యలు 

వసుర్ముహూర్తా సఙ్కల్పా ధర్మపత్న్యః సుతాఞ్శృణు
భానోస్తు దేవఋషభ ఇన్ద్రసేనస్తతో నృప

భానువు యొక్క సంతానం దేవఋషభుడు, అతనికి ఇంద్రసేనుడు

విద్యోత ఆసీల్లమ్బాయాస్తతశ్చ స్తనయిత్నవః
కకుదః సఙ్కటస్తస్య కీకటస్తనయో యతః

మనం పొందే ప్ర్తీ అనుభూతీ అచేతనం కాదు. ప్రతీ దానికి ఒక అధిష్ఠాన దేవత ఉంటుంది. అలాగే కంప అనే వాడు సంతానం. వణకడం ఈయన వలన వస్తుంది. శరీరములో కలిగే ప్రతీ వికారానికి ఒక అధిదేవత ఉంటుంది. ప్రతీ స్పందనకూ ప్రతినిధులున్నారు. విద్యోత (మెరుపు) , ఉరుము పుట్టారు. 

భువో దుర్గాణి యామేయః స్వర్గో నన్దిస్తతోऽభవత్
విశ్వేదేవాస్తు విశ్వాయా అప్రజాంస్తాన్ప్రచక్షతే

భూ అనే ఆమెకు దుర్గాలు (కోటలు) దాని నుండి స్వర్గమూ నంది.
విశ్వేదేవాలు విశ్వేదవతలు పుట్టారు. వారికి సంతానం లేదు. అందుకే శ్రాద్ధములో వారికి అన్నం పెడతారు. మొదటి తర్పణం వారికే. 

సాధ్యోగణశ్చ సాధ్యాయా అర్థసిద్ధిస్తు తత్సుతః
మరుత్వాంశ్చ జయన్తశ్చ మరుత్వత్యా బభూవతుః

సాధ్య అనే అమ్మాయికి సాధ్య గణం. వారికి అర్థ సిద్ధి సాధ్యం (ప్రయత్నం) నుంచి సిద్ధి (ఫలం)
మరుత్వతి అనే అమాయికి మరుత్వాన్ జయంతుడు అని కలిగారు.

జయన్తో వాసుదేవాంశ ఉపేన్ద్ర ఇతి యం విదుః
మౌహూర్తికా దేవగణా ముహూర్తాయాశ్చ జజ్ఞిరే

ఈ జయంతుడు వాసుదేవుని అంశ. ఇతనికి కూడా ఉపేంద్ర అని పేరు ఉంది. ముహూర్తా అనే ఆమెకు మౌహూర్తికా అనే దేవగణాలు పుట్టారు. మనమే ముహూర్తం పెట్టినా ఆ అధిదేవత ఆ ముహూర్తాన్ని ప్రసన్నముగా చూడాలి. శుభగ్రహాలు (గురు శుక్ర) ముహూర్తాన్ని చూస్తే మంచిది. ముహూర్త ధర్ముని భార్యలలో ఒకరు. మనం ధర్మాన్ని చక్కగా ఆచరిస్తే ముహూర్తం అతని సంతానమే కాబట్టి మనకు మంచే జరుగుతుంది. ధర్మం తప్పకుండా ఉంటే ముహూర్తం బాగుంటుంది.

యే వై ఫలం ప్రయచ్ఛన్తి భూతానాం స్వస్వకాలజమ్
సఙ్కల్పాయాస్తు సఙ్కల్పః కామః సఙ్కల్పజః స్మృతః

ఈ మౌహూర్తి గణములే ప్రపంచములో అన్ని ప్రాణులూ తమ తమ సమయములో రావలసిన ఫలితాన్ని ఇస్తాయి. సంకల్ప అనే ఆమెనుండి సంకల్పం, ఆ సంకల్పం నుంచి కామ (కోరిక).

వసవోऽష్టౌ వసోః పుత్రాస్తేషాం నామాని మే శృణు
ద్రోణః ప్రాణో ధ్రువోऽర్కోऽగ్నిర్దోషో వాస్తుర్విభావసుః

వసువుకు ఎనిమిది పుత్రులు. వారి పేర్లు. ద్రోణః ప్రాణో ధ్రువోऽర్కోऽగ్నిర్దోషో వాస్తుర్విభావసుః

ద్రోణస్యాభిమతేః పత్న్యా హర్షశోకభయాదయః
ప్రాణస్యోర్జస్వతీ భార్యా సహ ఆయుః పురోజవః

ద్రోణునికి అభిమతి అన్న భార్య నుండి హర్ష శోకము మొదలైనవి కలిగాయి పుత్రులుగా

ధ్రువస్య భార్యా ధరణిరసూత వివిధాః పురః
అర్కస్య వాసనా భార్యా పుత్రాస్తర్షాదయః స్మృతాః

ధ్రువుని భార్య ధరణి. (వీరే నంద యశొదలు). వీరికి పురములు సంతానం. అర్కుడి భార్య పేరు వాసన. సంతానం హర్షము.

అగ్నేర్భార్యా వసోర్ధారా పుత్రా ద్రవిణకాదయః
స్కన్దశ్చ కృత్తికాపుత్రో యే విశాఖాదయస్తతః

అగ్ని భార్య వసుధార (నెయ్యి) వారి సంతానం ద్రవిణ ( ద్రవ్యం, దక్షిణ). కృత్తిక యొక్క పుత్రులు స్కంధుడు. ఆయన నుండి విశాఖాదులు

దోషస్య శర్వరీపుత్రః శిశుమారో హరేః కలా
వాస్తోరాఙ్గిరసీపుత్రో విశ్వకర్మాకృతీపతిః

దోషునికి శర్వరీ పుత్ర. వీరికి శిశుమారుడని పరమాత్మ అంశ పుట్టారు. వసువుకు ఆంగీరసుని నుంచి విశ్వకర్మ పుట్టాడు. 

తతో మనుశ్చాక్షుషోऽభూద్విశ్వే సాధ్యా మనోః సుతాః
విభావసోరసూతోషా వ్యుష్టం రోచిషమాతపమ్

విశ్వకర్మ నుండి మనువు. వారి నుండి విశ్వే సాధ్యా అని పుట్టారు. అగ్నిహోత్రుని నుండి ఉష ముగ్గురిని కన్నది

పఞ్చయామోऽథ భూతాని యేన జాగ్రతి కర్మసు
సరూపాసూత భూతస్య భార్యా రుద్రాంశ్చ కోటిశః

రోజుకు ఐదు ఝాములు. ఐదు ఝాములు గల దినములో అన్ని ప్రాణులూ కర్మలు చేస్తాయి. పగలు అందరూ పని చేస్తారు. రుద్రుని భార్య సరూప కోటి మంది రుద్రులని సృష్టించింది

రైవతోऽజో భవో భీమో వామ ఉగ్రో వృషాకపిః
అజైకపాదహిర్బ్రధ్నో బహురూపో మహానితి

వీరు ఏకాదశ రుద్రులు. వీరికి కోట్ల మంది ప్రాశ్వదులు ఉన్నారు. 

రుద్రస్య పార్షదాశ్చాన్యే ఘోరాః ప్రేతవినాయకాః
ప్రజాపతేరఙ్గిరసః స్వధా పత్నీ పితౄనథ

అంగిరుడికి స్వధా అన్న భార్యకు కలిగిన వారు పితృదేవతలు. మనం ఇచ్చేది వీరికే శ్రాద్ధాది కర్మలలో. అందుకే స్వధాకారముతో (తల్లి చేత) వీరికే ఇస్తాము. 

అథర్వాఙ్గిరసం వేదం పుత్రత్వే చాకరోత్సతీ
కృశాశ్వోऽర్చిషి భార్యాయాం ధూమకేతుమజీజనత్

వీరు అధర్వణ వేదాన్ని స్వీకరించారు. అగ్నిహోత్రుడు తన భార్య అయిన అర్చిషులో ధూమకేతున్ని కన్నాడు

ధిషణాయాం వేదశిరో దేవలం వయునం మనుమ్
తార్క్ష్యస్య వినతా కద్రూః పతఙ్గీ యామినీతి చ

కార్క్షునికి వినతా కద్రూ పతంగి యామినీ. పతంగి పక్షులనీ, యామిని మిడతలనూ, వినత పరమాత్మ వాహనమైన గరుడుడినీ, పొందింది

పతఙ్గ్యసూత పతగాన్యామినీ శలభానథ
సుపర్ణాసూత గరుడం సాక్షాద్యజ్ఞేశవాహనమ్
సూర్యసూతమనూరుం చ కద్రూర్నాగాననేకశః

వినతకు కలిగిన ఇంకో కుమారుడు అనూరుడు, ఊరువులు లేని వాడు. కద్రువు నాగాదులని పొందింది

కృత్తికాదీని నక్షత్రాణీన్దోః పత్న్యస్తు భారత
దక్షశాపాత్సోऽనపత్యస్తాసు యక్ష్మగ్రహార్దితః

చంద్రుని భార్య కృత్రికాదులు. వారికి సంతానం కలగలేదు దక్షుని శాపం వలన. 

పునః ప్రసాద్య తం సోమః కలా లేభే క్షయే దితాః
శృణు నామాని లోకానాం మాతౄణాం శఙ్కరాణి చ

దక్షున్ని మరలా ప్రసన్నం చేసుకుని తన కళలను మళ్ళీ పొందాడు. వారి పేర్లు చెబుతాను విను. 

అథ కశ్యపపత్నీనాం యత్ప్రసూతమిదం జగత్
అదితిర్దితిర్దనుః కాష్ఠా అరిష్టా సురసా ఇలా

సకల లోకాలకూ హితం కలిగించే కశ్యప ప్రజాపతి భార్యల పేర్లు చెబుతాను విను. వారితోనే ఈ జగత్తు ఏర్పడింది.

మునిః క్రోధవశా తామ్రా సురభిః సరమా తిమిః
తిమేర్యాదోగణా ఆసన్శ్వాపదాః సరమాసుతాః

ఈ పదమూడు మందిలో తిమికి యాదో గణాలు (నీటిలో ఉండేవారు). సరమ కు సారమేయులు (కుక్కలు)

సురభేర్మహిషా గావో యే చాన్యే ద్విశఫా నృప
తామ్రాయాః శ్యేనగృధ్రాద్యా మునేరప్సరసాం గణాః

సురభి నుండి గేదెలూ గావులు. రెండు గిట్టలున్న జంతువులన్నీ ఈవిడ సంతానమే. తామ్రకు డేగలూ గద్దలు. మునికి అప్సరసలు

దన్దశూకాదయః సర్పా రాజన్క్రోధవశాత్మజాః
ఇలాయా భూరుహాః సర్వే యాతుధానాశ్చ సౌరసాః

క్రోధవత్తుకు సర్పాలు. ఇలా అనే భార్యకు భూరుహా (వృక్షములు) సురసకు రాక్షసులు అరిష్టకు గంధర్వులు కాష్టకు ఒక గిట్ట ఉన్న సంతానం

అరిష్టాయాస్తు గన్ధర్వాః కాష్ఠాయా ద్విశఫేతరాః
సుతా దనోరేకషష్టిస్తేషాం ప్రాధానికాఞ్శృణు

ధను యొక్క పుత్రులు అరవై ఒక్క మంది. వారిలో ముఖ్యులు

ద్విమూర్ధా శమ్బరోऽరిష్టో హయగ్రీవో విభావసుః
అయోముఖః శఙ్కుశిరాః స్వర్భానుః కపిలోऽరుణః

పులోమా వృషపర్వా చ ఏకచక్రోऽనుతాపనః
ధూమ్రకేశో విరూపాక్షో విప్రచిత్తిశ్చ దుర్జయః

స్వర్భానోః సుప్రభాం కన్యామువాహ నముచిః కిల
వృషపర్వణస్తు శర్మిష్ఠాం యయాతిర్నాహుషో బలీ

స్వర్భాను యొక్క బిడ్డను నముచి వివాహం చేసుకున్నాడు. వృషపర్వణుడి కుమార్తే శర్మిష్ట, ఈమెను యయాతి మహారాజు పెళ్ళి చేసుకున్నాడు

వైశ్వానరసుతా యాశ్చ చతస్రశ్చారుదర్శనాః
ఉపదానవీ హయశిరా పులోమా కాలకా తథా

ఉపదానవీం హిరణ్యాక్షః క్రతుర్హయశిరాం నృప
పులోమాం కాలకాం చ ద్వే వైశ్వానరసుతే తు కః

ఉపయేమేऽథ భగవాన్కశ్యపో బ్రహ్మచోదితః
పౌలోమాః కాలకేయాశ్చ దానవా యుద్ధశాలినః

పులోమా పుత్రులు కాలకేయులు అరవై వేల మంది. వీరు ఎవరు యజ్ఞ్యం చేసినా ధ్వంసం చేస్తారు. 

తయోః షష్టిసహస్రాణి యజ్ఞఘ్నాంస్తే పితుః పితా
జఘాన స్వర్గతో రాజన్నేక ఇన్ద్రప్రియఙ్కరః

వీరిని మీ తాతగారు చంపారు. 

విప్రచిత్తిః సింహికాయాం శతం చైకమజీజనత్
రాహుజ్యేష్ఠం కేతుశతం గ్రహత్వం య ఉపాగతాః

విప్రచిత్తి సింహిక యందు నూట ఒక మంది సంతానం పొందారు. రాహువు కేతువులు మొదట చివరి వారు

అథాతః శ్రూయతాం వంశో యోऽదితేరనుపూర్వశః
యత్ర నారాయణో దేవః స్వాంశేనావాతరద్విభుః

అధితి వంశాన్ని చెబుతాను విను. ఈ అధితి వంశములోనే శ్రీమన్నారాయణుడు అవతరించాడు. 

వివస్వానర్యమా పూషా త్వష్టాథ సవితా భగః
ధాతా విధాతా వరుణో మిత్రః శత్రు ఉరుక్రమః

వీరు ద్వాదశాదిత్యులు. అదితి పుత్రులంతా ఆదిత్యులు, దితి పుత్రులు దైత్యులు.

వివస్వతః శ్రాద్ధదేవం సంజ్ఞాసూయత వై మనుమ్
మిథునం చ మహాభాగా యమం దేవం యమీం తథా
సైవ భూత్వాథ వడవా నాసత్యౌ సుషువే భువి

సూర్యుని భార్య సజ్ఞ్య, వీరికి శ్రాద్ధ దేవుడు. వీరికే యముడూ యమునా కలిగారు. సూర్యభగవానుని తాపాన్ని తట్టుకోలేక నీడకి ప్రాణం పోసి ఆమెనుంచి ఈమె వెళ్ళిపోయింది. చాయతో సూర్యునికి కలిగినవారు శని. వడవ యందు అశ్వినీ దేవతలూ 

ఛాయా శనైశ్చరం లేభే సావర్ణిం చ మనుం తతః
కన్యాం చ తపతీం యా వై వవ్రే సంవరణం పతిమ్

చాయకు సూర్యునికీ శనీ, సావర్ణి పుట్టారు. ఈ సావర్ణి మనువు. వైవస్వత మనువు అని అంటారు. ఈమెకు తపతి అన్న కుమార్తె. ఈమె సంవరణున్ని పతిగా పొందింది. 

అర్యమ్ణో మాతృకా పత్నీ తయోశ్చర్షణయః సుతాః
యత్ర వై మానుషీ జాతిర్బ్రహ్మణా చోపకల్పితా

అర్యమ భార్య మాతృక, వీరికి చర్షణి పుట్టింది. చర్షణి అంటే కర్మ. చర్షణులంటే కర్మ కారులు. ఈ చర్షణ నుంచే మనుష్య జాతి పుట్టింది. 

పూషానపత్యః పిష్టాదో భగ్నదన్తోऽభవత్పురా
యోऽసౌ దక్షాయ కుపితం జహాస వివృతద్విజః

పూషకు పళ్ళు లేవు. ఇతను పిండి తింటాడు. శంకరున్ని దక్షుడు అవమానించినప్పుడు పళ్ళతో (ద్విజ - రెండు సార్లు వచ్చేవి) నవ్వాడు. పళ్ళు లేని కారణముగా ఈయనకు పిల్లలు లేరు. త్వష్ట భార్య రచన. వీరిద్దరి సంతానమే విశ్వరూపుడు. ఈ త్వష్ట ద్వాదశాదిత్యులలో ఒకడు 

త్వష్టుర్దైత్యాత్మజా భార్యా రచనా నామ కన్యకా
సన్నివేశస్తయోర్జజ్ఞే విశ్వరూపశ్చ వీర్యవాన్

త్వష్ట భార్య రాక్షస స్త్రీ. ఆమెను వివాహం చేసుకున్నందు వలన విశ్వరూపుడు రాక్షసులంటే ప్రేమగా ఎక్కువగా ఉండేవాడు. ఈ విశ్వరూపుడే దేవతలకు గురువుగా ఉండేవాడు. 

తం వవ్రిరే సురగణా స్వస్రీయం ద్విషతామపి
విమతేన పరిత్యక్తా గురుణాఙ్గిరసేన యత్

ఇంద్రుడు ఇతన్ని గురువుగా ఎందుకు స్వీకరించాడంటే ఇంద్రుడు త్రైలోక్య రాజ్యమదముతో బృహస్పతిని అవమానించాడు. అవమానానికి గురైన బృహస్పతి తప్పుకోగానే రాక్షసులు దాడి చేసారు.

Popular Posts