Followers

Sunday 23 March 2014

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం నాలుగవ అధ్యాయం


శ్రీరాజోవాచ
దేవాసురనృణాం సర్గో నాగానాం మృగపక్షిణామ్
సామాసికస్త్వయా ప్రోక్తో యస్తు స్వాయమ్భువేऽన్తరే

తస్యైవ వ్యాసమిచ్ఛామి జ్ఞాతుం తే భగవన్యథా
అనుసర్గం యయా శక్త్యా ససర్జ భగవాన్పరః

స్వాయంభువ మన్వంతరములో దేవ దానవ సిద్ధ సాధ్యుల సృష్టి జరిగినదని (అనుసర్గ) చెప్పావు. దానిని విస్తారముగా తెలుసుకోవాలనుకుంటున్నాను.

శ్రీసూత ఉవాచ
ఇతి సమ్ప్రశ్నమాకర్ణ్య రాజర్షేర్బాదరాయణిః
ప్రతినన్ద్య మహాయోగీ జగాద మునిసత్తమాః

మంచి ప్రశ్న అడిగావని అభినందించి ఇలా చెప్పాడు శుకుడు

శ్రీశుక ఉవాచ
యదా ప్రచేతసః పుత్రా దశ ప్రాచీనబర్హిషః
అన్తఃసముద్రాదున్మగ్నా దదృశుర్గాం ద్రుమైర్వృతామ్

ప్రాచీన బర్హి పది మంది కుమారులు ప్రాచేతసులు తపస్సు నుంచి బయటకు వచ్చి చూస్తే భూమి కనపడక కేవలం చెట్లతో కప్పబడి ఉనంది

ద్రుమేభ్యః క్రుధ్యమానాస్తే తపోదీపితమన్యవః
ముఖతో వాయుమగ్నిం చ ససృజుస్తద్దిధక్షయా

అది చూసిన వారికి కోపం వచ్చెసింది. తమ తపః ప్రభావముతో నొటి నుండి అగ్నినీ వాయువునూ విడిచిపెట్టారు

తాభ్యాం నిర్దహ్యమానాంస్తానుపలభ్య కురూద్వహ
రాజోవాచ మహాన్సోమో మన్యుం ప్రశమయన్నివ

ఇలా వారు చెట్లను తగలబెడుతూ ఉంటే చంద్రుడు (చెట్లకు అధిపతి) వచ్చి

న ద్రుమేభ్యో మహాభాగా దీనేభ్యో ద్రోగ్ధుమర్హథ
వివర్ధయిషవో యూయం ప్రజానాం పతయః స్మృతాః

దీనములైన చెట్లకు మీరు ద్రోహం చేయకూడదు. మీరు సృష్టిని పెంచాలనుకుంటున్నారు. అలాంటి వారు సృష్టిలో భాగమైన చెట్లను నరకరాదు.

అహో ప్రజాపతిపతిర్భగవాన్హరిరవ్యయః
వనస్పతీనోషధీశ్చ ససర్జోర్జమిషం విభుః

మీరిప్పుడు ప్రజాపతులు. ఇదంతా ప్రజాపతి పతి అయిన శ్రీమన్నారాయణుడు ఈ సకల వృక్ష సంపదను పెంచాడు. పితృదేవతలకిచ్చే ఆహారమైన ఊర్జన్మూ, దేవతలకిచ్చే ఆహారమైన "ఇష"ను కల్పించాడు. (ఈ రెండూ చంద్రుడు ఇస్తాడు. అందుకే అమా అనే సూర్యుని కిరణం వచ్చినప్పుడు, ఆ రోజు చంద్రుడు అమా అనే కిరణము కింద ఉంటాడు. ఆ అమా అనే కిరణములో ఉన్న చంద్రుడు వృక్షాలను పోషిస్తాడు. అందుకే అమావాస్యనాడు చెట్లను ముట్టరాదు, పగలైనా రాత్రైనా. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు చెట్లను పోషిస్తూ ఉంటాడు)

అన్నం చరాణామచరా హ్యపదః పాదచారిణామ్
అహస్తా హస్తయుక్తానాం ద్విపదాం చ చతుష్పదః

కదలకుండా ఉండేవి కదిలేవాటికీ కాళ్ళు లేనివి కాళ్ళు ఉన్నవాటికీ చేతులు లేనివి చేతులు ఉన్నవాటికీ నాలుగు కాళ్ళు ఉన్నవి రెండు కాళ్ళు ఉన్నవాటికీ ఆహారం.

యూయం చ పిత్రాన్వాదిష్టా దేవదేవేన చానఘాః
ప్రజాసర్గాయ హి కథం వృక్షాన్నిర్దగ్ధుమర్హథ

మీరు తండ్రి చేత ఆజ్ఞ్యాపించబడీ, దేవ దేవుడైన విష్ణువుచేతా చెప్పబడి సృష్టిని పెంచడానికి వచ్చిన మీరు ఇలా వృక్షాలను దహించవేయరాదు

ఆతిష్ఠత సతాం మార్గం కోపం యచ్ఛత దీపితమ్
పిత్రా పితామహేనాపి జుష్టం వః ప్రపితామహైః

సజ్జనుల మార్గాన్ని అనుసరించి మండుతున్న కోపాన్ని చల్లార్చండి. తాతలూ తండ్రులూ ముత్తాతలూ ఒక ధర్మాన్ని ఏర్పరచారు. ఎవరికెవరెవరు రక్షకులో చెప్పారు

తోకానాం పితరౌ బన్ధూ దృశః పక్ష్మ స్త్రియాః పతిః
పతిః ప్రజానాం భిక్షూణాం గృహ్యజ్ఞానాం బుధః సుహృత్

పిల్లలకు తల్లి తండ్రులూ
కంటికి రెప్ప
స్త్రీలకు భర్తలు
ప్రజలకు రాజు
బిక్షకులకు దాత
రహస్యం తెలియాలనుకున్నవాడికి పండితుడు రక్షకులు

అన్తర్దేహేషు భూతానామాత్మాస్తే హరిరీశ్వరః
సర్వం తద్ధిష్ణ్యమీక్షధ్వమేవం వస్తోషితో హ్యసౌ

శరీరములో లోపల దాగి ఉన్న ఆత్మకు అంతర్యామి అయిన పరమాత్మ రక్షకుడు.
ప్రపంచం మొత్తం అతని ఇల్లే. అలాంటి పరమాత్మను మీరు సంతోషిమప్చేసారు. భగవంతుని అనుగ్రహాన్ని పొందిన మీరే ప్రపంచాన్ని భగవదాలయముగా తెలియలేకుంటే ఇంకెవరికి తెలుస్తుంది

యః సముత్పతితం దేహ ఆకాశాన్మన్యుముల్బణమ్
ఆత్మజిజ్ఞాసయా యచ్ఛేత్స గుణానతివర్తతే

ఆకాశం నుండి వాయువు వచ్చినట్లుగా మనశారీరం నుండి వచ్చే కోపాన్ని గెలవ గలిగిన వాడే ప్రకృతిని గెలిచి గుణములను దాటగలుగుతాడు

అలం దగ్ధైర్ద్రుమైర్దీనైః ఖిలానాం శివమస్తు వః
వార్క్షీ హ్యేషా వరా కన్యా పత్నీత్వే ప్రతిగృహ్యతామ్

ఇంతవరకూ కాల్చినవి చాలు. మిగిలినవాటిని క్షేమముగా ఉంచండి. వారి అమ్మాయిని మీకు ఇస్తున్నాము. ఈమెను భార్య్గా స్వీకరించండి

ఇత్యామన్త్ర్య వరారోహాం కన్యామాప్సరసీం నృప
సోమో రాజా యయౌ దత్త్వా తే ధర్మేణోపయేమిరే

ఇలా పలికి చంద్రుడు మారిషను వారికిచ్చి వెళ్ళిపోయాడు. వారు ఆమెను యధావిధిగా వివాహం చేసుకున్నారు

తేభ్యస్తస్యాం సమభవద్దక్షః ప్రాచేతసః కిల
యస్య ప్రజావిసర్గేణ లోకా ఆపూరితాస్త్రయః

వారి నుండి ఆమెకు దక్షుడు పుట్టాడు. అతనిచేత మూడు లోకాలు నిండిపోయేంత సృష్టి పెరిగింది.

యథా ససర్జ భూతాని దక్షో దుహితృవత్సలః
రేతసా మనసా చైవ తన్మమావహితః శృణు

దక్షునికి పుత్రికలంటే ప్రేమ ఎక్కువ. అతను మనసుతో కొందరిని రేతస్సుతో కొందరినీ సృష్టించాడు. అది విను

మనసైవాసృజత్పూర్వం ప్రజాపతిరిమాః ప్రజాః
దేవాసురమనుష్యాదీన్నభఃస్థలజలౌకసః

బ్రహ్మ కూడా మొదట అందరినీ మనస్సుతోటే సృష్టించాడు. దేవ రాక్షస ఆకాశ చారులు జలచరులు భూచరులను మనసుతో సృష్టించాడు

తమబృంహితమాలోక్య ప్రజాసర్గం ప్రజాపతిః
విన్ధ్యపాదానుపవ్రజ్య సోऽచరద్దుష్కరం తపః

ఈ సృష్టిని ఏమి చేయాలో తెలియక వింధ్యపాదము వద్దకు వెళ్ళి

తత్రాఘమర్షణం నామ తీర్థం పాపహరం పరమ్
ఉపస్పృశ్యానుసవనం తపసాతోషయద్ధరిమ్

అఘమర్షణ తీర్థం వద్ద తపస్సు చేసాడు.

అస్తౌషీద్ధంసగుహ్యేన భగవన్తమధోక్షజమ్
తుభ్యం తదభిధాస్యామి కస్యాతుష్యద్యథా హరిః

పరమాత్మను హంస గుహ్య స్తోత్రముతో తపస్సు చేసాడు. ఆ ప్రజాపతి (దక్షుడు) ఈ స్తోత్రం చేసాడు. ఆ స్తోత్రాన్ని నీకు నేను చెబుతాను. ఈ స్తోత్రానికి మెచ్చే పరమాత్మ దక్ష ప్రజాపతికి వరమిచ్చాడు.

శ్రీప్రజాపతిరువాచ
నమః పరాయావితథానుభూతయే గుణత్రయాభాసనిమిత్తబన్ధవే
అదృష్టధామ్నే గుణతత్త్వబుద్ధిభిర్నివృత్తమానాయ దధే స్వయమ్భువే

నీవు అన్నిటికంటే (ప్రకృతి జీవులకంటే) విలక్షణమైనవాడవు. నీ అనుభూతి వాస్తవమైనది సత్యమైంది. మనము లోకములో దేన్ని హాయి అంటున్నామో అదే బాధగా మారుతుంది. ఏది బాధ అనుకుంటామో అదే కొద్ది సేపట్లో ఆనందముగా మారుతుంది. మానవులు దు@ఖాన్నే సుఖమని అనుకుంటారు. పరమాత్మ మాత్రం నిత్యం సత్యమైన అనుభూతి కలవాడు. గుణ త్రయం భాసించడానికి నీవే నిమిత్తం. నీ నివాసం ఎవరికీ (ప్రకృతితో సంబంధం ఉన్నవారికి) కనపడదు. ఇంతటి వాడని కొలవలేము. అటువంటి పరమాత్మకు నమస్కారం.

న యస్య సఖ్యం పురుషోऽవైతి సఖ్యుః సఖా వసన్సంవసతః పురేऽస్మిన్
గుణో యథా గుణినో వ్యక్తదృష్టేస్తస్మై మహేశాయ నమస్కరోమి

ఒకే పురములో (శరీరము) ఇద్దరున్నారు. దహరాకాశములో జీవుడున్నాడు, ఏ మిత్రుని మత్రి జీవుడు తెలుసుకోలేడో అటువంటి పరమాత్మకి నమస్కారం. తనతో ఉంటున్న రంగు తనలో ఉన్న గుణము తనకు ఎలా తెలీదు, మనకు మనలో ఉన్న పరమాత్మ తెలీడు.

దేహోऽసవోऽక్షా మనవో భూతమాత్రామాత్మానమన్యం చ విదుః పరం యత్
సర్వం పుమాన్వేద గుణాంశ్చ తజ్జ్ఞో న వేద సర్వజ్ఞమనన్తమీడే

పంచ భూతములూ శరీరమూ, ఇదంతా ఒక రధమైతే, శరీరం ఒక ఇరుసు వంటిది, పంచభూతాలు చతుర్దశ ఇంద్రియాలు దానికి అవయవాలు. మన గురించీ మనం తెలుసుకోలేము, పరమాత్మ గురించీ తెలుసుకోలేము. శరీరముతో సంబంధం ఏర్పడేంత వరకూ జీవుడికీ ఇందిర్యాలూ శరీరాలూ వేరూ తాను వేరనీ తెలుసు. తెలిసి కూడా ఆ విషయాన్ని తెలియకుండా అవుతున్నాడు. శరీర సంబంధం ఏర్పడ్డాక విడిగా ఉన్న దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, సర్వజ్ఞ్యుడైన పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాడు. అటువంటి పరమాత్మకు నమస్కారం.

యదోపరామో మనసో నామరూప రూపస్య దృష్టస్మృతిసమ్ప్రమోషాత్
య ఈయతే కేవలయా స్వసంస్థయా హంసాయ తస్మై శుచిసద్మనే నమః

అక్కడ సూర్యుడూ నక్షత్రాలూ చంద్రుడూ తారకలూ పరమాత్మ తేజస్సు వెనక ఉండేవే. అలాంటి చోటుని శుచి సద్మ అంటారు. పరిశుద్ధమైన నివాసం, పరంధామం, పరమపదం. పరమాత్మ మనకు తెలియబడాలంటే మనకు తెలిసినవన్నీ తెలియకుండా పోవాలి. చూచినదీ తలచినదీ పూర్తిగా మూసుకుపోవాలి, వాటి అంశకూడా స్పృశించకూడదు. మనం జగత్తును వేటితో తెలుసుకుంటున్నామో అలాంటి వాటితో పరమాత్మ తెలియబడడు. ప్రత్యక్ష అనుమాన ఉపమానముల వలన తెలియబడడు. శబ్దము కూడా పరమాత్మ ఇలా ఉండవచ్చు అని మాత్రమే చెబుతుంది. మనం చూసినదీ తెలిసినదీ అంతరించినప్పుడే తనకు తాను తన సంకల్పముతో తెలియబడుతున్నాడో అటువంటి పరమాత్మకు నమస్కారం. పరమాత్మ ఎవరికి తెలియబడాలి అని సంకల్పిస్తాడో వాడికి తెలియబడతాడు.

మనీషిణోऽన్తర్హృది సన్నివేశితం స్వశక్తిభిర్నవభిశ్చ త్రివృద్భిః
వహ్నిం యథా దారుణి పాఞ్చదశ్యం మనీషయా నిష్కర్షన్తి గూఢమ్

అన్నిటికంటే ముందుంటాండు, స్పష్టముగా ఉంటాడు ప్రకాశమానముగా ఉంటాడు కానీ ఆయన కనపడడు. ప్రత్యక్షముగా ఇంద్రియ గోచరం కాడు. అంతర్యామిగా హృదయములో ఉంటాడు. పరమాత్మ యొక్క శక్తులు (పర వ్యూహ విభవ అంతర్యామి అరచ, హృదయమూ కంఠమూ శిరస్సు, అకార ఉకార మకారం, త్రివృత్ అంటే ఓంకారం). ఎవరికీ తెలియని కనపడని వాడిని ఎలా గుర్తుపట్టాలి? కట్టెలో నిప్పు కనపడదు. కానీ అందులో నిప్పు ఉంటుంది. అరణిని మధించినట్లు పరమాత్మను తెలుసుకోగోరేవారు తమను మదించుకుంటారు, ఇంద్రియాలను నియమింపచేసి, శరీర ఇంద్రియాలను మనసునూ శుష్కింపచేసి, ఇంద్రియాల జోలికి వెళ్ళకుండా విషయాలకు లోబడకుండా తపస్సు చేస్తే కట్టెలో ఉన్న అగ్ని ఎలా ఐతే బయటకు కనపడుతుందో పరమాత్మ కూడా మన దృష్టికి గోచరమవుతాడు.

స వై మమాశేషవిశేషమాయా నిషేధనిర్వాణసుఖానుభూతిః
స సర్వనామా స చ విశ్వరూపః ప్రసీదతామనిరుక్తాత్మశక్తిః

ఎవరికీ చెప్పడానికి వీలు లేనంత శక్తి గలవాడు పరమాత్మ(ప్రసీదతామనిరుక్తాత్మశక్తిః). ఎన్ని రకాల మాయలున్నాయో వాటిని తొలగించి సత్యమూ నిత్యమైన నుభూతిని ఇచ్చినవాడు. పరమాత్మ సాక్షాత్కారం జరింగిన తరువాత ప్రకృతి బంధములో ఉన్నా అది మనను బాధించదు వామ్యోహింపచేయదు. అన్ని పేర్లూ ఆయనే. అన్ని రూపాలూ ఆయనే. అటువంటి పరమాత్మ నాయందు ప్రసన్నుడగుగాక.ఎన్ని రకముల మాయలు ఉన్నాయో వాటిని తొలగించి సత్యమూ నిత్యమూ అయిన తక సాక్షాత్కారాన్నిచ్చేవాడు 

యద్యన్నిరుక్తం వచసా నిరూపితం ధియాక్షభిర్వా మనసోత యస్య
మా భూత్స్వరూపం గుణరూపం హి తత్తత్స వై గుణాపాయవిసర్గలక్షణః

ఆయన వేటికీ అందడు. వాక్కుతో మనసుతో బుద్ధితో ఇంద్రియములతో గానీ మనం అనుకునే స్వరూపమేదీ సత్యం కాదు. మనం చెప్పే రూపాలన్నీ గుణములతో కూడి ఉన్నది. పరమాత్మ ప్రళయకాల స్వరూపుడు. మనకా స్వరూపము తెలియదు. మనకు తెలిసినది జగత్తులోనిది. 

యస్మిన్యతో యేన చ యస్య యస్మై యద్యో యథా కురుతే కార్యతే చ
పరావరేషాం పరమం ప్రాక్ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్ధేతురనన్యదేకమ్

ఈ ప్రపంచములో ఎన్ని రకముల కార్యములు జరుగుతున్నాయో దేనితో దేనిలో దేని వలన దేనికోసం జరుగుతున్నాయో ఎవరి వలన జరుగుతున్నాయో, ఏది ఏ రకముగా చేయబడుతున్నదో చేయించబడుతున్నదో అందరికంటే ముందువారికంటే ముందువారు తరువాత వారి కంటే తరువాతి వాడు. ఈయన మొదట ఉండేవాడు. ఆయనను మించి ప్రపంచానికి వేరే కారణం లేదు.ఆయనే ఉపాదాన నిమిత్త సహకారీ కారణం. 

యచ్ఛక్తయో వదతాం వాదినాం వై వివాదసంవాదభువో భవన్తి
కుర్వన్తి చైషాం ముహురాత్మమోహం తస్మై నమోऽనన్తగుణాయ భూమ్నే

చెప్పేవారికీ చెప్పినది కాదని వాదించేవారికీ, ఔనని నిరూపించేవారికీ , ఈ మూటికీ కారణం కూడా పరమాత్మే . ఎలాంటి మహా పండితులకు కూడా ఆత్మ మోహాన్ని ఎవరు కలిగిస్తారో ఆ పరమాత్మకు నమస్కారం. యోగమూ సాంఖ్యమూ అంటూ ఒక్కో మతములో ఉంది. కొందరు పరమాత్మలేడని అంటారు. 

అస్తీతి నాస్తీతి చ వస్తునిష్ఠయోరేకస్థయోర్భిన్నవిరుద్ధధర్మణోః
అవేక్షితం కిఞ్చన యోగసాఙ్ఖ్యయోః సమం పరం హ్యనుకూలం బృహత్తత్

యోగ సాంఖ్యములలో వారు చెప్పినవి వారికి నిజమనే అనిపిస్తుంది. 

యోऽనుగ్రహార్థం భజతాం పాదమూలమనామరూపో భగవాననన్తః
నామాని రూపాణి చ జన్మకర్మభిర్భేజే స మహ్యం పరమః ప్రసీదతు

పుట్టవలసిన అవసరం లేని పరమాత్మ, ఆయన భక్తులను అనుగ్రహించడానికి, పేరూ రూపమూ లేని వాడు పేరు పెట్టుకుని ఏ పనులూ చేయవలసిన అవసరం లేని వాడు కర్మలను చేస్తున్నాడు. అటువంటి పరమాత్మ అనుగ్రహిచుగాక

యః ప్రాకృతైర్జ్ఞానపథైర్జనానాం యథాశయం దేహగతో విభాతి
యథానిలః పార్థివమాశ్రితో గుణం స ఈశ్వరో మే కురుతాం మనోరథమ్

ప్రకృతి సంబంధముతో వచ్చిన గుణములు మనను పాడు చేయకుండా మనలో ఆయన కాపలాగా ఉంటాడు. మనసు శరీరములో ఉన్నంతవరకే ప్రకాశిస్తుంది.వాయువు కూడా అగ్నికి తోడైతే అగ్ని బాగా మండుతుంది.శరీరములో ఉన్న మనసు మనకు ఎలా మనస్సు ఉన్నదని తెలియజేస్తుందో, దేహముండగా ఆత్మనీ పరమాత్మనీ తెలుసుకోని వారు ఆయనను తెలుసుకోవడానికి ప్రాకృతమైన బోధనతో అందని పరమాత్మ స్వరూపాన్ని ఆచార్య కృపతో ఎలా తెలియబడుతుందో, ఘటము భిన్నమవగానే కుండలో ఉన్న వాయువు బయట వాయువుతో కలిసినట్లు శరీరము లేనప్పుడు ఆత్మ ఆత్మలో కలుస్తుంది. ఇలాంటి పరమాత్మ నా కోరిక తీర్చాలి

శ్రీశుక ఉవాచ
ఇతి స్తుతః సంస్తువతః స తస్మిన్నఘమర్షణే
ప్రాదురాసీత్కురుశ్రేష్ఠ భగవాన్భక్తవత్సలః

ఇలా అఘమర్షణ క్షేత్రములో స్తోత్రం చేయబడి పరమాత్మ దక్షునికి ప్రత్యక్షమయ్యాడు

కృతపాదః సుపర్ణాంసే ప్రలమ్బాష్టమహాభుజః
చక్రశఙ్ఖాసిచర్మేషు ధనుఃపాశగదాధరః

వైకుంఠములో పరమాత్మ అష్టభుజములతో ఉంటాడు 

పీతవాసా ఘనశ్యామః ప్రసన్నవదనేక్షణః
వనమాలానివీతాఙ్గో లసచ్ఛ్రీవత్సకౌస్తుభః

మహాకిరీటకటకః స్ఫురన్మకరకుణ్డలః
కాఞ్చ్యఙ్గులీయవలయ నూపురాఙ్గదభూషితః

త్రైలోక్యమోహనం రూపం బిభ్రత్త్రిభువనేశ్వరః
వృతో నారదనన్దాద్యైః పార్షదైః సురయూథపైః

గరుత్మంతుని మీద వచ్చి, ఎనిమిది ఆయుధాలతో పీతాంబరధారి నీల మేఘశ్యాముడు ప్రసన్నమైన చూపులు కలవాడై, వనమాల హారముగా కలిగి, శ్రీవత్సం కలవాడై, కుండలములూ అందెలూ అన్ని ధరించి, మూడులోకాలూ మోహింపచ్సే రూపముతో నారదాదులతో స్తోత్రం చేయబడుతూ, కొందరు ఆ స్తోత్రాలను అనువచిస్తూ, 

స్తూయమానోऽనుగాయద్భిః సిద్ధగన్ధర్వచారణైః
రూపం తన్మహదాశ్చర్యం విచక్ష్యాగతసాధ్వసః

దక్షుడు సాష్టాంగపడి శిరస్సుతో పాదాలను సృశించాడు. పరమాత్మను ప్రత్యక్షం చేసుకున్నానన్న పరమానందము కలవాడై 

ననామ దణ్డవద్భూమౌ ప్రహృష్టాత్మా ప్రజాపతిః
న కిఞ్చనోదీరయితుమశకత్తీవ్రయా ముదా
ఆపూరితమనోద్వారైర్హ్రదిన్య ఇవ నిర్ఝరైః

కొండ వాగు మీద నుంచి నీరు వస్తుంటే ఆ ప్రవాహాన్ని అరికట్టడానికి కాలువ చేసినట్లుగా, పరమాత్మ కృప అనే నీరు గుండెనిండా నిండి ఉంది, 

తం తథావనతం భక్తం ప్రజాకామం ప్రజాపతిమ్
చిత్తజ్ఞః సర్వభూతానామిదమాహ జనార్దనః

అందరి మనసులో ఏముందో తెలుసుకునే పరమాత్మ, పరమభక్తుడు సంతానము కోరే ప్రజాపతి అయిన దక్షుని మనసులో ఏముందో తెలుసుకొని ఇలా అన్నాడు. 

శ్రీభగవానువాచ
ప్రాచేతస మహాభాగ సంసిద్ధస్తపసా భవాన్
యచ్ఛ్రద్ధయా మత్పరయా మయి భావం పరం గతః

నీవు తపస్సుతో సిద్ధి పొందావు. పరమ భక్తితో నాయందు నిశ్చల భావాన్ని ఉంచుకున్నావు. నీవింత గొప్ప తపస్సు చేసావు కాబట్టి నేను మెచ్చాను

ప్రీతోऽహం తే ప్రజానాథ యత్తేऽస్యోద్బృంహణం తపః
మమైష కామో భూతానాం యద్భూయాసుర్విభూతయః

నా విభూతులు లోకమంతా విస్తరించాలి, సంసారం విడిచి నన్ను సేవించడానికే అందరి మనసు కలగాలి అని నాకోరిక

బ్రహ్మా భవో భవన్తశ్చ మనవో విబుధేశ్వరాః
విభూతయో మమ హ్యేతా భూతానాం భూతిహేతవః

బ్రహ్మాదులందరూ నా విభూతులే. అవే సకల జగత్తు పుట్టుకకూ కారణమవుతున్నాయి.

తపో మే హృదయం బ్రహ్మంస్తనుర్విద్యా క్రియాకృతిః
అఙ్గాని క్రతవో జాతా ధర్మ ఆత్మాసవః సురాః

తపస్సే నా హృదయం శరీరం క్రియా స్వరూపం అవయవాలు 

అహమేవాసమేవాగ్రే నాన్యత్కిఞ్చాన్తరం బహిః
సంజ్ఞానమాత్రమవ్యక్తం ప్రసుప్తమివ విశ్వతః

అన్నిటికంటే ముందూ తరువాతా మధ్యా నేనే ఉన్నాను. నా కంటే ముందూ ఎవరూ లేరు, నేను లేనిదీ ఏదీ లేదు. మొదలు నేనొక్కడినే ఉన్నాను. 

మయ్యనన్తగుణేऽనన్తే గుణతో గుణవిగ్రహః
యదాసీత్తత ఏవాద్యః స్వయమ్భూః సమభూదజః

ఇలా ఎవరైతే అనంత కళ్యాణ గుణములు కలిగిన నా యందు కొన్ని గుణాలను తీసుకుని ఆ గుణాలు ఉన్నవాడిగా నా విగ్రహాలను కొందరు తయారు చేసి ఆరాధిస్తున్నారు. దాన్ని పోగొట్టడానికే నా నాభి కమలం నుంచి బ్రహ్మను సృష్టించాను. 

స వై యదా మహాదేవో మమ వీర్యోపబృంహితః
మేనే ఖిలమివాత్మానముద్యతః స్వర్గకర్మణి

తనను సృష్టించింది సృష్టిని పెంచడానికే అని తెలుసుకుని సృష్టి కర్మలో నిమగ్నమయ్యాడు. ఆయన కూడా ఘోరమైన తపస్సు చేసాడు

అథ మేऽభిహితో దేవస్తపోऽతప్యత దారుణమ్
నవ విశ్వసృజో యుష్మాన్యేనాదావసృజద్విభుః

ఆ తపః ప్రభావముగానే నవ ప్రజాపతులను సృష్టించాడు. 

ఏషా పఞ్చజనస్యాఙ్గ దుహితా వై ప్రజాపతేః
అసిక్నీ నామ పత్నీత్వే ప్రజేశ ప్రతిగృహ్యతామ్

ఈమే పంచజనుని యొక్క పుత్రిక అసిక్ని. ఈమెను నీవు భార్యగా స్వీకరించు. 

మిథునవ్యవాయధర్మస్త్వం ప్రజాసర్గమిమం పునః
మిథునవ్యవాయధర్మిణ్యాం భూరిశో భావయిష్యసి

త్వత్తోऽధస్తాత్ప్రజాః సర్వా మిథునీభూయ మాయయా
మదీయయా భవిష్యన్తి హరిష్యన్తి చ మే బలిమ్

మీరిద్దరూ అన్నోన్యముగా కాపురం చేసినందు వలన కొందరు మానసికముగా కాపురం చేఇన్సందు వలన కొంతమందీ, ఇలా చాలా మంది సంతానం కలుగుతారు
మానసిక వ్యాపారముతో సంతానం కలుగుతుంది ఇదంతా నా మాయతో, అన్న నియమం కేవలం నీకు మాత్రమే. మిగతా వారందరికీ మిధునముతోనే సంతానం కలుగుతుంది. 

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్త్వా మిషతస్తస్య భగవాన్విశ్వభావనః
స్వప్నోపలబ్ధార్థ ఇవ తత్రైవాన్తర్దధే హరిః

ఇలా చెప్పి దక్షుడు చూస్తుండగా స్వప్నములో దొరికిన వస్తువులాగ అంతర్ధానమయ్యాడు

Popular Posts