Followers

Friday 7 February 2014

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 10


1. పూర్వం విత్తనం వేయటానికి ఊరిబయటకు వెళ్ళీ భూమినీ నాగలినీ దేవతలనీ బ్రాహ్మణులనీ ఎద్దులనీ వరుణున్నీ పూజించి ప్రారంభించేవారు. పంట పండించడమే కాదు భోజనం చేయడం కూడా వ్రతం. బ్రతికేదీ పుట్టేదీ అన్నముతో. భోజనవ్రతం. కాళ్ళూ చేతులూ కడుకున్ని ఆచమనం చేసి హృదయములో స్వామిని ఆరాధించి, భోజనానికి అనుమతి తీసుకోవాలి, పాత్రను మూడు సార్లు ప్రోక్షించాలి, పదహారు సార్లు ఆచమనం చేయాలి భోజనం చేసే ముందు, చేసిన తరువాత ఇరవై నాలుగు సార్లు ఆచమనం చేయాలి, దాని వలన చిగుళ్ళమధ్య ఇరుక్కున్నవి పోతాయి, చేతిని పదహారు సార్లు కడుక్కోవాలి.
కోపముతోనూ ఏడుస్తూ అరుస్తూ కలహిస్తూ నిందిస్తూ కాళ్ళూ చేతులూ ఒళ్ళూ ఊపుతూ, సంగీతం వింటూ భోజనం చేయకూడదు. ఆచమనం చేసి తినడం వలన అన్న నాళములో ఏమీ అడ్డురాకుండా ఉంటుంది. అన్నము సరిగ్గా లోపలకి వెళుతుంది

2. సమాం చ కురు మాం రాజన్దేవవృష్టం యథా పయః
అపర్తావపి భద్రం తే ఉపావర్తేత మే విభో

ఎత్తువంపులుగా ఉన్న నన్ను సమానము చేయి. కురిసిన నీరు అన్ని ప్రాంతాలలోకీ సమానముగా వెళుతుంది. ఇంకిన తరువాత కొంత నీరు నిలువ ఉండేట్లు చేయి. వర్షాకలం కాని సమయములో కూడా భూమి మీద నీరు నిలువ ఉండేలా చేయి. భగవంతుని చేత వర్షించిన నీరు వర్షాకాలం కాని సమయములో కూడా మీకందరికీ అందాలి 
3. యద్ధ్యాయతో దైవహతం ను కర్తుం మనోऽతిరుష్టం విశతే తమోऽన్ధమ్
భగవంతుడు చెడగొట్టిన దాన్ని చేయాలి అనుకున్నవారికి కోపం వస్తుంది ఆవేశం వస్తుంది బుద్ధి పాడవౌతుంది జ్ఞ్యానం నశిస్తుంది. ఆ పని కాలేదంటే "ఇది పరమాత్మకు ఇష్టం లేదేమో" అని పరమాత్మకు నమస్కరించాలి.
పరమాత్మ చెడగొట్టిన దాన్ని గురించి చేయడానికి ఆలోచించేవాడికి మనసు కోపాక్రాంతమవుతుంది. అజ్ఞ్యానములో చేరుతుంది. భగవంతుడు చెడగొట్టిన పని గురించి ఆలోచించవద్దు

4. శరీరం ఉన్న వాడు తింటే శరీరము లేని వాడి కడుపు నిండుతుంది. పాంచభౌతిక శరీరం లేని వాడికి శరీరం ఉన్నవాడు తింటే కడుపు నిండుతుంది. అగ్ని జలము వలన పుడుతుంది (విద్యుత్ శక్తి). సజాతీయములతో పుట్టుక జరుగదు. విద్యుత్తు నీటి నుండి పుడుతుంది. వేడికి సంబంధించిన దానితో వేడి పుట్టదు. విజాతీయం ( విరుద్ధమైన ధర్మం) ఉన్న వాటితోనే పుడుతుంది. అలాగే శరీరం లేని వాడికి కడుపు నిండాలంటే శరీరం ఉన్నవాడు తినాలి. మరి శరీరం లేని వాడికి కడుపుంటుందా? ఉండదు. కానీ మనసు ఉంటుంది. అది నిండితే చాలు. ఎక్కడో ఉన్న కొడుకుకు మేలు జరిగితే (ఉదా: మనవడు పుడితే) ఇక్కడే ఉన్న తండ్రి మనసు నిండుతుంది. అంటే తృప్తి అనేది ఎక్కడ ఉన్నా పుడుతుంది. అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. పరలోకములోకి నిండేది కడుపు కాదు తృప్తి. ఈ లోకములో పూజిస్తే పైలోకములో ఉన్నవాడు తృప్తిపడతాడు.

5. గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేऽను సమ్పదః
ప్రసీదతాం బ్రహ్మకులం గవాం చ జనార్దనః సానుచరశ్చ మహ్యమ్

సంపదలు ఎవరి దగ్గరకు వస్తాయి? అన్ని మంచి గుణములూ కలవాడికి, ఉత్తం శీలము కలవాడికి, చేసిన ఉపకారం మరచిపోని వాడికీ, పెద్దవారిని ఆశ్రయించి ఉన్నవాడికీ అన్ని సంపదలూ స్వయముగా వచ్చి వరిస్తాయి. కాబట్టి అలాంటి బ్రాహ్మణోత్తములు గోవులూ దేవతలూ పరమాత్మ నా విషయములో ప్రసన్నమవుదురు గాక.

6. సప్తర్షులు యజ్ఞ్యం నిర్వహించినపుడు ఋషులు వారి భార్యలతో ప్రదక్షిణం చేసినపుడు అగ్నిహోత్రుడు వారిమీద వ్యామోహపడ్డాడు. ఆ వేదనతో అగ్నిహోత్రుడు చిక్కిపోయి, హవిస్సులను కూడా తీసుకోవట్లేదు. అది గమనించిన భార్య ఆయా భార్యల రూపములో వ్యవహరించింది. అగ్నిహోత్రుడు తృప్తి పడ్డాడు. ఋషులు ఆ విషయం తెలియక తమ భార్యలనూ అగ్నిహోత్రునీ శపించాడు. అగ్నిహోత్రుని భార్య నచ్చజెప్పడం వలన ఋషులు శాపాన్ని ఉపసంహరించారు. అప్పటినుంచీ భార్యాభర్తలు ప్రదక్షిణం చేస్తుంటే అగ్నిహోత్రునికి కళ్ళు కనపడకుండా ఉండాలన్న శాపమిచ్చారు. ఈ విషయం శంకరుడు స్కాంధ పురాణములో చెప్పాడు. అగ్నీ వాయువూ శంకరుని అంశలే. అందుకే కుమారస్వామి ఆరుగురి నుంచి జన్మించాడు: భూమి, భూమి భరించలేకపోతే అగ్ని, వాయువు, నీరు, శంకరుడు ఇలా ఆరుగురినుంచి షడ్యః అని కుమారస్వామి పుట్టాడు. అందుకే కృత్తికలు ఆరుగురు వచ్చారు. కుమారస్వామి అగ్ని పుత్రుడయ్యాడు. అలాగే హనుమంతుడు వాయు పుత్రుడు. అగ్నీ వాయువూ శంకరుడూ ఒకరే.

7. మశకా మత్కుణా రాత్రౌ మక్షికా భిక్షుకా దివా
పిపీలికా చ భార్యా చ దివారాత్రం ప్రబాధతే

8. న అతంత్రీ వాద్యతే వీణా న అచక్రః వర్తతే రథః |
న అపతిః సుఖం ఏధతే యా స్యాత్ అపి శత ఆత్మజా |౨-౩౯-౨౯|

మితం దదాతి హి పితా మితం మాతా మితం సుతః |
అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేత్ |౨-౩౯-౩౦|

హద్దు లేని ప్రేమనిచ్చేవాడు భర్త మాత్రమే. తల్లీ తండ్రీ అంత ప్రేమను ఇవ్వలేరు. అందుకు భర్తను అవమననించవద్దు. అయోధ్యాకాండము_-_సర్గము_39

9. గుణేషు క్రియతాం యత్నః కిమాటోపైః భయంకరైః
విక్రీయంతే న ఘంటాభిః గావః క్షీర వివర్జితాః

పాలియ్యని ఆవుల మెడలో గంటలు పెడితే కొంటారా.  మానవుడు గుణములచే గౌరవము పొందును గానీ,
ఆడంబరముచే కాదు. 

10. తత్కర్మ హరితోషం యత్సా విద్యా తన్మతిర్యయా - పరమాత్మకు సంతోషం కలిగింపచేసేదే పని, పరమాత్మయందు బుద్ధి నిలిపేదే చదువు 

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం


మైత్రేయ ఉవాచ
ఇత్థం పృథుమభిష్టూయ రుషా ప్రస్ఫురితాధరమ్
పునరాహావనిర్భీతా సంస్తభ్యాత్మానమాత్మనా

ఇలా చెప్పి భూమి మళ్ళీ మాట్లాడుతోంది

సన్నియచ్ఛాభిభో మన్యుం నిబోధ శ్రావితం చ మే
సర్వతః సారమాదత్తే యథా మధుకరో బుధః

నీ కోపాన్ని కొంత శాంతింపచేయి. తెలియని వారికీ తెలిసిన వారికీ తేడా, జ్ఞ్యాని చేడులో కూడా మంచిని చూస్తాడు, చేడు వారిలో చెడును పోగొడతారు. ఉదాహరణకు తేనెటీగ ప్రతీ పూవు మీదా వాలి, మకరందాన్ని తీసుకుంటుంది గానీ పూవును పాడు చేయదు. చేడ్డ పూవూ మంచి పూవూ అని చూడకుండా అన్ని పుష్పాల మీదా వాలుతుంది. పండితుడు కూడా మంచిని మాత్రమే స్వీకరిస్తాడు. మీరు కూడా నాలో ఉన్న మంచినే స్వీకరించాలి

అస్మిన్లోకేऽథవాముష్మిన్మునిభిస్తత్త్వదర్శిభిః
దృష్టా యోగాః ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయఃప్రసిద్ధయే
తానాతిష్ఠతి యః సమ్యగుపాయాన్పూర్వదర్శితాన్
అవరః శ్రద్ధయోపేత ఉపేయాన్విన్దతేऽఞ్జసా

లోకములో జీవులకు శ్రేయస్సు కలగడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో వాటిని ఋషులు దర్శించారు. శ్రేయస్సు కలగడానికి ఎన్నో మార్గాలను మునులు చూచారూ ప్రయోగించారు కూడా. ఇది మానవులకు శ్రేయస్సు కలగడానికి చేసారు. అలా ప్రయోగించి సఫలమయ్యారు. నీవు ఆ మార్గాన్ని అవలంబిస్తే చాలు. 

తాననాదృత్య యోऽవిద్వానర్థానారభతే స్వయమ్
తస్య వ్యభిచరన్త్యర్థా ఆరబ్ధాశ్చ పునః పునః

పెద్దలు ఏర్పరచిన మార్గము కాక తెలివైన వారెవరైనా కొత్త మార్గాన్ని చూపడానికి ప్రయత్నిస్తే అనుకున్న ఫలితం రాక అప్రదిష్టపాలవుతారు. ఆలోచించగల తెలివి తప్ప ప్రయోగించగల ఓర్పుండదు వీఎరికి. ప్రజలబాగు కోసం మీ పూర్వీకులు ఏర్పరచిన మార్గాన్ని అవలంబించండి

పురా సృష్టా హ్యోషధయో బ్రహ్మణా యా విశామ్పతే
భుజ్యమానా మయా దృష్టా అసద్భిరధృతవ్రతైః

నేను పంటనివ్వలేదూ విత్తనాలని తీసుకుంటున్నానూ అని నా మీద కోప్పడుతున్నావు గానీ నీవే నాలో అనేక ఔషధులు నిక్షిప్తం చేసావు. ఎవరు ఉపయోగించడానికి నీవేర్పాటు చేసావో, వారికి కాక దుర్మార్గులకీ హింసాపరాయణులకి అందుతున్నాయి. వ్రతము లేని వారికి అందుతున్నాయి. భూమి మీద విత్తనం వేయటానికీ అన్నం తినటానికీ వ్రతం కావాలి. (పూర్వం విత్తనం వేయటానికి ఊరిబయటకు వెళ్ళీ భూమినీ నాగలినీ దేవతలనీ బ్రాహ్మణులనీ ఎద్దులనీ వరుణున్నీ పూజించి ప్రారంభించేవారు. పంట పండించడమే కాదు భోజనం చేయడం కూడా వ్రతం. బ్రతికేదీ పుట్టేదీ అన్నముతో. భోజనవ్రతం. కాళ్ళూ చేతులూ కడుకున్ని ఆచమనం చేసి హృదయములో స్వామిని ఆరాధించి, భోజనానికి అనుమతి తీసుకోవాలి, పాత్రను మూడు సార్లు ప్రోక్షించాలి, పదహారు సార్లు ఆచమనం చేయాలి భోజనం చేసే ముందు, చేసిన తరువాత ఇరవై నాలుగు సార్లు ఆచమనం చేయాలి, దాని వలన చిగుళ్ళమధ్య ఇరుక్కున్నవి పోతాయి, చేతిని పదహారు సార్లు కడుక్కోవాలి. కోపముతోనూ ఏడుస్తూ అరుస్తూ కలహిస్తూ నిందిస్తూ కాళ్ళూ చేతులూ ఒళ్ళూ ఊపుతూ, సంగీతం వింటూ భోజనం చేయకూడదు. ఆచమనం చేసి తినడం వలన అన్న నాళములో ఏమీ అడ్డురాకుండా ఉంటుంది. అన్నము సరిగ్గా లోపలకి వెళుతుంది . పొరమారకుండా ఉంటుంది. )
ఇలా వ్రతము లేకుండా తినేవారికి నేనేందుకు ఇవ్వాలి. దుర్మార్గులు భుజిస్తున్నారు. మంచి వారిగా చెప్పుకునే వారు వ్రతము లేకుండా భుజిస్తున్నారు. ధాన్యం పండిచే ముందూ, అన్నం తినే ముందూ వ్రతము లేదు. అలాంటి దుర్మార్గులు అనుభవిస్తుంటే నేను వెనక్కు లాక్కున్నాను. 

అపాలితానాదృతా చ భవద్భిర్లోకపాలకైః
చోరీభూతేऽథ లోకేऽహం యజ్ఞార్థేऽగ్రసమోషధీః

భూలోకములో ఇంత దారుణం జరుగుతూ ఉంటే, నన్ను నిరాదరణ చేస్తుంటే ఈ లోకపాలకులంతా ఏమి చేస్తున్నారు? ఇలా దురుపయోగం చేసే వారికి సహకరిస్తే తరువాత తరువాత ఎవరిన భక్తులకు సదుపయోగం చేయడానికి ఏదీ ఉండదు. ఆకలి ఉన్నా లేకున్నా "తినడం నా హక్కు" అని తినడం మొదలుపెడితే నిజముగా ఆకలైనపుడు తినడానికేమీ ఉండదు. 
నేను వాళ్ళ చేతా నీ చేతా ఉపేక్షించబడ్డాను. లోకములో వారంతా దొంగలయ్యారు. తరువాత మంచి వారు వచ్చి యజ్ఞ్యం చేస్తే ఉండాలని దాచిపెట్టాను. 

నూనం తా వీరుధః క్షీణా మయి కాలేన భూయసా
తత్ర యోగేన దృష్టేన భవానాదాతుమర్హతి

కానీ అది కూడా ప్రమాదమే. ఒక వస్తువును చాలా కాలం దాచిపెడితే మళ్ళీ ఆ వస్తువు దాచిపెట్టిన వాడికి కూడా (ఆ రూపములో) దొరకదు. తరువాత తీసుకోదలచిన వాడు దానిని సారవంతం చేసి మరీ తీసుకోవాలి. నా విత్తనములన్నీ క్షీణించి పోయాయి, నిర్వీర్యములైపోయాయి. ఇపుడు వాటిని వీర్యవంతములు చేయాలంటే నీ యోగముతో నీవే చేయాలి.

వత్సం కల్పయ మే వీర యేనాహం వత్సలా తవ
ధోక్ష్యే క్షీరమయాన్కామాననురూపం చ దోహనమ్

నేనెట్లాగూ గోరూపములో ఉన్నాను కాబట్టి నా నుండి ఔషధులు కావాలంటే నేను పాల రూపములో ఇస్తాను. దానికి ఒక దూడ కావాలి. పాల రూపములో అన్ని కోరికలనూ స్రవింపచేస్తానూ. దానికి దూడా కావాలీ, యోగ్యుడైన పాలు పితికేవాడూ కావాలి.

దోగ్ధారం చ మహాబాహో భూతానాం భూతభావన
అన్నమీప్సితమూర్జస్వద్భగవాన్వాఞ్ఛతే యది

ఆయా ప్రాణులలో ఉత్తమైన పాలు పితికేవాడిని ఏర్పాటు చేయి. ఇష్టమున్నా, తేజోవంతమైన అన్నాన్ని కోరాలి. భోజనం చేస్తే ఓజః సహః బలం రావాలి. అలాంటి శక్తి గల అన్నాన్ని ఇస్తాను

సమాం చ కురు మాం రాజన్దేవవృష్టం యథా పయః
అపర్తావపి భద్రం తే ఉపావర్తేత మే విభో

ఎత్తువంపులుగా ఉన్న నన్ను సమానము చేయి. కురిసిన నీరు అన్ని ప్రాంతాలలోకీ సమానముగా వెళుతుంది. ఇంకిన తరువాత కొంత నీరు నిలువ ఉండేట్లు చేయి. వర్షాకలం కాని సమయములో కూడా భూమి మీద నీరు నిలువ ఉండేలా చేయి. భగవంతుని చేత వర్షించిన నీరు వర్షాకాలం కాని సమయములో కూడా మీకందరికీ అందాలి 

ఇతి ప్రియం హితం వాక్యం భువ ఆదాయ భూపతిః
వత్సం కృత్వా మనుం పాణావదుహత్సకలౌషధీః

ఈ రీతిగా భూమి ప్రియమునూ హితమునూ (నచ్చేమాటనూ మంచిమాటనూ) చెప్పింది. మనువును దూడగా చేసుకుని మానవులకు కావలసిన సకల ఔషధులనూ మనువు స్వీకరించాడు 

తథాపరే చ సర్వత్ర సారమాదదతే బుధాః
తతోऽన్యే చ యథాకామం దుదుహుః పృథుభావితామ్

ఎవరెవరికి ఏమేమి కావాలో వారి వారిలో ముఖ్యులని దూడగా చేసుకొని వారికి కావల్సిన వాటిని స్వీకరించారు. ఇలా పృధు చక్రవర్తి చేత ప్రసన్నము చేసుకోబడిన గోవు ఎవరెవరికి ఏమేమి కావాలో ఇచ్చింది

ఋషయో దుదుహుర్దేవీమిన్ద్రియేష్వథ సత్తమ
వత్సం బృహస్పతిం కృత్వా పయశ్ఛన్దోమయం శుచి

ఋషులు, ఇంద్రియ నిగ్రహము గల బృహస్పతిని దూడగా చేసుకుని తమకు కావలసిన చందోమయమైన పాలను తీసుకున్నారు

కృత్వా వత్సం సురగణా ఇన్ద్రం సోమమదూదుహన్
హిరణ్మయేన పాత్రేణ వీర్యమోజో బలం పయః

దేవతలు కూడా ఇంద్రున్ని దూడగా చేసుకుని సోమరసాన్ని స్వీకరించారు, బంగారు పాత్రతో వీర్యమూ ఓజస్సునూ బలమునూ పాలుగా తీసుకున్నారు

దైతేయా దానవా వత్సం ప్రహ్లాదమసురర్షభమ్
విధాయాదూదుహన్క్షీరమయఃపాత్రే సురాసవమ్

రాక్షసులూ దైత్యులూ దానవులూ ప్రహ్లాదున్ని దూడగా చేసుకుని ఇనుము పాత్రలో సురను తీసుకున్నారు

గన్ధర్వాప్సరసోऽధుక్షన్పాత్రే పద్మమయే పయః
వత్సం విశ్వావసుం కృత్వా గాన్ధర్వం మధు సౌభగమ్

గంధర్వాదులు పద్మమయమైన పాత్రలో విశ్వావసున్ని దూడగా చేసుకుని సంగీతాన్ని పాలుగా స్వీకరించారు.

వత్సేన పితరోऽర్యమ్ణా కవ్యం క్షీరమధుక్షత
ఆమపాత్రే మహాభాగాః శ్రద్ధయా శ్రాద్ధదేవతాః

పితృదేవతలు అర్య్మున్ని దూడగా చేసుకుని కవ్యాన్ని (శ్రాద్ధ భోజనం) పాలుగా స్వీకరించారు. వీరిని శ్రాద్ధ దేవతలూ అని పేరు. 

ప్రకల్ప్య వత్సం కపిలం సిద్ధాః సఙ్కల్పనామయీమ్
సిద్ధిం నభసి విద్యాం చ యే చ విద్యాధరాదయః

సిద్ధులు కపిలున్ని దూడగా చేసుకుని సిద్ధిని పాలగా తీసుకున్నారు. విద్యాధరులు తమ అధిపతిని దూడగా చేసుకుని విద్యను స్వీకరించారు

అన్యే చ మాయినో మాయామన్తర్ధానాద్భుతాత్మనామ్
మయం ప్రకల్ప్య వత్సం తే దుదుహుర్ధారణామయీమ్

మాయావులు అంతర్ధాన సిద్ధిని బోధించే మాయను మయున్ని దూడగా చేసుకుని ఆ పాలు స్వీకరించారు. 

యక్షరక్షాంసి భూతాని పిశాచాః పిశితాశనాః
భూతేశవత్సా దుదుహుః కపాలే క్షతజాసవమ్

యక్షులూ రాక్షసులూ భూత ప్రేత పిశాచాలు తమ అధిపతిని దూడగా  చేసుకుని వారికి కావల్సినవి స్వీకరించారు

తథాహయో దన్దశూకాః సర్పా నాగాశ్చ తక్షకమ్
విధాయ వత్సం దుదుహుర్బిలపాత్రే విషం పయః

అన్ని రకాల పాములూ (తోకతో కొట్టే పాములూ,, కరిచే పాములూ - దన్దశూకాః , మింగే పాములూ చుట్టే పాములూ - అహయః, కాటేసేవి - నాగాః, పాకేవి - సర్పాః) తక్షకున్ని దూడగా చేసుకుని విషాన్ని స్వీకరించారు. అంటే అమృతాన్ని ఇచ్చే భూమే విషాన్నిస్తుంది. 

పశవో యవసం క్షీరం వత్సం కృత్వా చ గోవృషమ్
అరణ్యపాత్రే చాధుక్షన్మృగేన్ద్రేణ చ దంష్ట్రిణః

పశువులు వృషబాన్ని దూడగా చేసుకుని గడ్డిని తీసుకున్నాయి, సింహాన్ని దూడగా చేసుకుని అరణ్యమనే పాత్రలో 

క్రవ్యాదాః ప్రాణినః క్రవ్యం దుదుహుః స్వే కలేవరే
సుపర్ణవత్సా విహగాశ్చరం చాచరమేవ చ

మృగాలన్నీ తమకు కావలసిన ఆహారాన్ని తీసుకున్నారు. 

వటవత్సా వనస్పతయః పృథగ్రసమయం పయః
గిరయో హిమవద్వత్సా నానాధాతూన్స్వసానుషు

మర్రి చెట్టును దూడగా చేసుకుని వనస్పతులన్నీ రసమును పాలుగా స్వీకరించాయి. పర్వతాలన్నీ హిమవంతున్ని దూడగా చేసుకుని గైరికాధి ధాతువులని తీసుకున్నాయి.

సర్వే స్వముఖ్యవత్సేన స్వే స్వే పాత్రే పృథక్పయః
సర్వకామదుఘాం పృథ్వీం దుదుహుః పృథుభావితామ్

అందరూ తమలో ఎవరు ముఖ్యమో వారిని దూడగ చేసుకుని ఆ పాలను వారు తీసుకున్నారు. పృధు చక్రవర్తి చేత ప్రసన్నం చేసుకోబడిన భూమినుండి తమకు కావలసిన దాన్ని అన్ని ప్రాణులూ తీసుకున్నారు 

ఏవం పృథ్వాదయః పృథ్వీమన్నాదాః స్వన్నమాత్మనః
దోహవత్సాదిభేదేన క్షీరభేదం కురూద్వహ

తినబడేదంతా అన్నమే.  తమ తమకు కావలసిన అన్నమును వారు స్వీకరించారు. పితికేవారు వేరు దూడ వేరు, దూడ మారితే పాలు మారుతున్నాయి. పితికేవారి భేధముతో దూడ భేధముతో పాలలో భేదమేర్పడింది

తతో మహీపతిః ప్రీతః సర్వకామదుఘాం పృథుః
దుహితృత్వే చకారేమాం ప్రేమ్ణా దుహితృవత్సలః

ఎవరికి కావలసినవి వారికిచ్చినందుకు పృధు చక్రవర్తికి భూమి మీద ప్రేమ కలిగింది. ఈ నాటి నుండి నిన్ను నా పుత్రికగా స్వీకరిస్తున్నాను. ఆ నాటినుండీ భూమి పృధ్వి అయ్యింది

చూర్ణయన్స్వధనుష్కోట్యా గిరికూటాని రాజరాట్
భూమణ్డలమిదం వైన్యః ప్రాయశ్చక్రే సమం విభుః

తన ధనువు యొక్క కొనతో అడ్డుగా ఉన్న పర్వతాలనూ పర్వత సమూహాలనూ చూర్ణం చేసాడు. భూమిని సమం చేసాడు

అథాస్మిన్భగవాన్వైన్యః ప్రజానాం వృత్తిదః పితా
నివాసాన్కల్పయాం చక్రే తత్ర తత్ర యథార్హతః

గ్రామాన్పురః పత్తనాని దుర్గాణి వివిధాని చ
ఘోషాన్వ్రజాన్సశిబిరానాకరాన్ఖేటఖర్వటాన్

గ్రామములూ పట్టణాలు దుర్గాలు పల్లెలూ ఏర్పాటు చేసాడు. పొలములూ వ్యవసాయ క్షేత్రములూ దున్నేవారూ కోసేవారూ

ప్రాక్పృథోరిహ నైవైషా పురగ్రామాదికల్పనా
యథాసుఖం వసన్తి స్మ తత్ర తత్రాకుతోభయాః

పృధు చక్రవర్తి కంటే ముందు ఈ వ్యవస్థ లేదు. వేరే భయమేదీ లేదు కాబట్టి ఎవరికెక్కడ నచ్చితే అక్కడ ఉండేవారు అక్కడి వనరులు ఉన్నదాకా

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదహేడవ అధ్యాయం


మైత్రేయ ఉవాచ
ఏవం స భగవాన్వైన్యః ఖ్యాపితో గుణకర్మభిః
ఛన్దయామాస తాన్కామైః ప్రతిపూజ్యాభినన్ద్య చ

ఈ రీతిలో వేన పుత్రుడైన పృధు చక్రవర్తి చేయబోయె పనులేమిటో వంది మాగధులు స్తోత్రం చేసారు.

బ్రాహ్మణప్రముఖాన్వర్ణాన్భృత్యామాత్యపురోధసః
పౌరాన్జానపదాన్శ్రేణీః ప్రకృతీః సమపూజయత్

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా, మంత్రులూ (రాజ్య ప్రాంతములో నగరాలకు అధినాయకులు) ఆమాత్యులూ (రాజు తరువాతి వారు) సచివులూ (రాజు తరువాత నాలగవ వారు) ఈ విధముగా విభజించాడు.
పురవాసులూ జనపదవాసులూ పల్లెటూరిలో ఉండేవారు (శ్రేణీ) ప్రజలూ అందరినీ ఆదరించాడు
(శ్రేణులంటే ఉండటానికి లేక ఒక చోట గుడారాలలో ఉండేవారు. రాజు కూడా సైన్యములో కొంత మందిని శ్రేణుల్లా పంపుతారు. దాని వలన ప్రజలకు వాస్తవముగా ఉన్న ఇబ్బందులు తెలుస్తాయి)

విదుర ఉవాచ
కస్మాద్దధార గోరూపం ధరిత్రీ బహురూపిణీ
యాం దుదోహ పృథుస్తత్ర కో వత్సో దోహనం చ కిమ్

మరి భూమి గోరూపం ధరిస్తే ఈయన పాలు పితికాడన్నారు. భూమి గోరూపం ఎందుకు ధరించింది. పాలు పితకాలంటే దూడ కావాలి కదా? ఆ దూడ ఎవరు? ఆ వచ్చిన పాలు ఏమిటి? ఒకే దూడతో అన్ని పాలు పిండారా? లేక వేరు వేరుగా ఉన్న దూడలు వచ్చాయా?

ప్రకృత్యా విషమా దేవీ కృతా తేన సమా కథమ్
తస్య మేధ్యం హయం దేవః కస్య హేతోరపాహరత్

పృధు చక్రవర్తి అశ్వమేధము చేస్తే అశ్వాన్నెందుకు ఇంద్రుడు అపహరించాడు

సనత్కుమారాద్భగవతో బ్రహ్మన్బ్రహ్మవిదుత్తమాత్
లబ్ధ్వా జ్ఞానం సవిజ్ఞానం రాజర్షిః కాం గతిం గతః

సనత్కుమారుని వలన జ్ఞ్యానం పొందిన ఈయన ఏ లోకాలకు వెళ్ళాడు

యచ్చాన్యదపి కృష్ణస్య భవాన్భగవతః ప్రభోః
శ్రవః సుశ్రవసః పుణ్యం పూర్వదేహకథాశ్రయమ్

నేను అడిగినవే కాకుండా అడగనివాటిని కూడా పరమ పవిత్రమైన స్వామి యొక్క కథను

భక్తాయ మేऽనురక్తాయ తవ చాధోక్షజస్య చ
వక్తుమర్హసి యోऽదుహ్యద్వైన్యరూపేణ గామిమామ్

నీకూ స్వామికీ ఇద్దరికీ భక్తుడనైనా, అనురక్తుడనైన నాకు చెప్పవలసింది. పృధు చక్రవర్తి ఆవునుండి అన్ని ఔషధులనూ తీసుకున్న చరిత్ర చెప్పవలసినది.

సూత ఉవాచ
చోదితో విదురేణైవం వాసుదేవకథాం ప్రతి
ప్రశస్య తం ప్రీతమనా మైత్రేయః ప్రత్యభాషత

కృష్ణ కథను బాగా అడిగావు. అని ప్రీతితో ఇలా అన్నాడు

మైత్రేయ ఉవాచ
యదాభిషిక్తః పృథురఙ్గ విప్రైరామన్త్రితో జనతాయాశ్చ పాలః
ప్రజా నిరన్నే క్షితిపృష్ఠ ఏత్య క్షుత్క్షామదేహాః పతిమభ్యవోచన్

బ్రాహ్మణులందరూ ఈయనని ప్రజాపాలకునిగా అభిషేకం చేసారు . ఆకలితో బక్క చిక్కిన దేహముతో ఉన్న ప్రజలు పరిగెత్తుకోచ్చారు ఈ విషయం తెలిసి.

వయం రాజఞ్జాఠరేణాభితప్తా యథాగ్నినా కోటరస్థేన వృక్షాః
త్వామద్య యాతాః శరణం శరణ్యం యః సాధితో వృత్తికరః పతిర్నః

మహారాజా, మేము జఠరాగ్నితో బాధపడుతున్నాము, తొర్రలో ఉన్న అగ్నితో చెట్టు బాధపడినట్లు. ఇలా ఆకలితో అలమటిస్తున్న మేము రక్షణ కోసం నిన్ను శరణు వేడాము. బ్రతుకు తెరువును నీవే చూపాలి.

తన్నో భవానీహతు రాతవేऽన్నం క్షుధార్దితానాం నరదేవదేవ
యావన్న నఙ్క్ష్యామహ ఉజ్ఝితోర్జా వార్తాపతిస్త్వం కిల లోకపాలః

అడుగుతున్న మా అందరికీ మీరు అన్నాన్ని పెట్టండి. ఉన్న బలం మొత్తం తొలగిపోయి మేము ప్రాణాలు విడువక ముందే భుక్తిని ఏర్పాటు చేయి

మైత్రేయ ఉవాచ
పృథుః ప్రజానాం కరుణం నిశమ్య పరిదేవితమ్
దీర్ఘం దధ్యౌ కురుశ్రేష్ఠ నిమిత్తం సోऽన్వపద్యత

ఇలా దయతో వారడిగిన మాట విని, ఎందుకిలా జరిగిందీ అని ఆలోచించి, కారణాన్ని అర్థం చేసుకున్నాడు

ఇతి వ్యవసితో బుద్ధ్యా ప్రగృహీతశరాసనః
సన్దధే విశిఖం భూమేః క్రుద్ధస్త్రిపురహా యథా

భూమి పంటనివ్వటం లేదు అని తెలుసుకున్నాడు. వేసిన ధాన్యం తీసుకుంటోంది గానీ పంట ఇవ్వట్లేదు. కోపించిన త్రిపురాంతకునిలా ధనస్సుని ధరించి వెంటపడ్డాడు.

ప్రవేపమానా ధరణీ నిశామ్యోదాయుధం చ తమ్
గౌః సత్యపాద్రవద్భీతా మృగీవ మృగయుద్రుతా

ఇలా తన మీదకు వస్తున్నాడని గ్రహించి వేటగాడు వెంటబడితే లేడి పారిపోతున్నట్లుగా భూమి గోరూపం ధరించి పారిపోయింది.

తామన్వధావత్తద్వైన్యః కుపితోऽత్యరుణేక్షణః
శరం ధనుషి సన్ధాయ యత్ర యత్ర పలాయతే

ఎర్రబడిన కనులతో పృధు మహారాజు బాణం ఎక్కుపెట్టి వెంటబడ్డాడు

సా దిశో విదిశో దేవీ రోదసీ చాన్తరం తయోః
ధావన్తీ తత్ర తత్రైనం దదర్శానూద్యతాయుధమ్

భూ భువర్ సువర్లోకములూ అన్ని దిక్కులూ పరిగెట్టింది

లోకే నావిన్దత త్రాణం వైన్యాన్మృత్యోరివ ప్రజాః
త్రస్తా తదా నివవృతే హృదయేన విదూయతా

ఎక్కడికి పరిగెత్తినా తన కంటే ముందే బాణం ఎక్కుపెట్టి ఉన్నాడు. ఎలా ఐతే ప్రజలు మృత్యువును తప్పించుకోలేరో తాను పృధు చక్రవర్తిని తప్పించుకోలేకపోఇంది. భయపడుతూ ఉంది. పరిగెత్తడం మానేసింది. అక్కడే నిలబడి...

ఉవాచ చ మహాభాగం ధర్మజ్ఞాపన్నవత్సల
త్రాహి మామపి భూతానాం పాలనేऽవస్థితో భవాన్

రక్షించవలసిన వాడు శిక్షించడానికి వస్తే అతని నుండి ఎక్కడికి పారిపోగలదు. ఈ విషయం తెలుసుకుని ఇలా అంది " నీకు అన్ని ధర్మములూ తెలుసు, ఆపదలు పొందినవారంటే ఎక్కువ జాలి చూపుతావు. సకల ప్రాణులనూ కాపాడతానని పట్టాభిషేకం చేసుకున్నావు"

స త్వం జిఘాంససే కస్మాద్దీనామకృతకిల్బిషామ్
అహనిష్యత్కథం యోషాం ధర్మజ్ఞ ఇతి యో మతః

నీ పరిపాలనలో ఉన్న అందరిలాగ కాపాడవలసిన దీనురాలైన ఏ తప్పు చేయని నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు. లోకములో ధర్మజ్ఞ్యుడని పేరు పొందిన నీవు స్త్రీని చంపుతావా

ప్రహరన్తి న వై స్త్రీషు కృతాగఃస్వపి జన్తవః
కిముత త్వద్విధా రాజన్కరుణా దీనవత్సలాః

ఒక వేళ తప్పు చేసినా, ధర్మం తెలిసిన వారు స్త్రీని చంపరు. సామాన్యులే తప్పు చేసినా స్త్రీలను చంపకుండా వదిలిపెడతారే నీవంటి దీన వత్సలుర గురించి వేరే చెప్పాలా.

మాం విపాట్యాజరాం నావం యత్ర విశ్వం ప్రతిష్ఠితమ్
ఆత్మానం చ ప్రజాశ్చేమాః కథమమ్భసి ధాస్యసి

కోపముతో ఆవేశములో ఏమి చేస్తున్నావో అర్థం కావట్లేదా? నీ యోగ బలముతో నన్ను చంపితే, నీ ప్రజలూ నీవూ ఎక్కడ ఉంటారు? ఆధారం లేని వారిని నీవేమి చేస్తావు? భూమి అంటే పడవ. దాని మీదే ప్రపంచమంతా ఉంది. మరి నన్ను చంపి, నీటిలో ఉన్న వీరిని ఎలా వీరందరినీ కాపాడతావు.

పృథురువాచ
వసుధే త్వాం వధిష్యామి మచ్ఛాసనపరాఙ్ముఖీమ్
భాగం బర్హిషి యా వృఙ్క్తే న తనోతి చ నో వసు

నా ఆజ్ఞ్యను దిక్కరించావు. అదే నీవు చేసిన తప్పు. నీవు ప్రజల నుండి నీకు రావల్సిన భాగమును తీసుకుని ఊరుకుంటున్నావు. నీకు భాగమిచ్చిన వారికి నీవు భాగమిస్తున్నావా?

యవసం జగ్ధ్యనుదినం నైవ దోగ్ధ్యౌధసం పయః
తస్యామేవం హి దుష్టాయాం దణ్డో నాత్ర న శస్యతే

రోజు గడ్డైతే బాగా తింటున్నావు కానీ దూడలకి పాలివ్వటం లేదు. ఎదుటి వారి దగ్గర తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియకపోవడం తప్పు. అందుకే ఇలాంటి దుర్మార్గులను దండిస్తే అది నింద్యమైన పని కాదు.

త్వం ఖల్వోషధిబీజాని ప్రాక్సృష్టాని స్వయమ్భువా
న ముఞ్చస్యాత్మరుద్ధాని మామవజ్ఞాయ మన్దధీః

నీవు స్వయముగా పళ్ళను పండిస్తున్నావా లేదా ఇంకొకరు వేస్తే పండిస్తున్నావా. బ్రహ్మ మొదట నీయందు అన్ని ఔషధులనూ నాటాడు. వాటిని బయట్కి తేవాలి. బ్రహ్మ నీకిచ్చిన అన్ని ఔషధులనూ ప్రజలకివ్వాలి. మంద బుద్ధి గల నీవు అది నీవివ్వడం లేదు. ఇపుడు నేను రాజును.

అమూషాం క్షుత్పరీతానామార్తానాం పరిదేవితమ్
శమయిష్యామి మద్బాణైర్భిన్నాయాస్తవ మేదసా

ఆకలీ దప్పులల్తో అలమటిస్తున్న ఆర్తులైన వీరి రోదనలు విని నా బాణాలతో నిన్ను చేధించి నీ మేదస్సుతో (కొవ్వుతో) నా ప్రజలందరికీ ఆకలి తీరుస్తాను

పుమాన్యోషిదుత క్లీబ ఆత్మసమ్భావనోऽధమః
భూతేషు నిరనుక్రోశో నృపాణాం తద్వధోऽవధః

నీకు ఆడవారిని చంపకూడదని తెలుసుగానీ, నీవెలా ఉండాలో తెలియదా. స్త్రీ పురుష నపుంసకులని ఎవరి గురించి వారు చెప్పుకునే వారు అధములు. తోటి ప్రాణుల మీద జాలి లేకుండా ఉన్న వారిని చంపుట తప్పు కాదు.

త్వాం స్తబ్ధాం దుర్మదాం నీత్వా మాయాగాం తిలశః శరైః
ఆత్మయోగబలేనేమా ధారయిష్యామ్యహం ప్రజాః

నీవు స్తబ్ధముగా ఉన్నావు (ఇంత మంది విత్తనాలు వేస్తున్నా స్పందన లేదు), ఇలా మాయతో ఉన్న నిన్ను బాణముతో చంపుతాను. నీవు లేకపోయినా ఈ ప్రజలు ఉంటారు. ఈ ప్రజలందరినీ నేను భరిస్తాను. నిన్ను మోస్తున్నది కూడా నేనే. అది నా యోగ ప్రభావం.

ఏవం మన్యుమయీం మూర్తిం కృతాన్తమివ బిభ్రతమ్
ప్రణతా ప్రాఞ్జలిః ప్రాహ మహీ సఞ్జాతవేపథుః

కోపమే ఆధారమా అన్నట్లు ఉన్న మూర్తిని, యముడిలా ఉన్న స్వామిని చూచి, వంగి చేతులు జోడించినదై ఒళ్ళంతా వెతుకూ మాట్లాడుతోంది

ధరోవాచ
నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్తనానాతనవే గుణాత్మనే
నమః స్వరూపానుభవేన నిర్ధుత ద్రవ్యక్రియాకారకవిభ్రమోర్మయే

పరమ పురుషునికి నమస్కారము. యోగమాయతో అనేకమైన శరీరములను ధరించే మహానుభావుడా, వాత్సల్యాది గుణములు కలవాడా, నీ ప్రభావముతోటే ద్రవ్య క్రియ కర్మ (ఉపకరణం ద్రవ్యమూ కర్త, కర్త యొక్క క్రియా కావాలి. వీటిలో ఏమి లేకున్నా పని కాదు ) జరుగుతాయి. నీవే ఇచ్చేవాడివి.  ఇదంతా ఒక నాటకం, విభ్రమం. అలాంటి నీకు నమస్కారము. 

యేనాహమాత్మాయతనం వినిర్మితా ధాత్రా యతోऽయం గుణసర్గసఙ్గ్రహః
స ఏవ మాం హన్తుముదాయుధః స్వరాడుపస్థితోऽన్యం శరణం కమాశ్రయే

నన్ను బ్రహ్మ సృష్టించాడు, అన్ని గుణముల సృష్టి ఇక్కడినుంచి కలగాలని. ఇక్కడే ఉన్న వారు ఇక్కడే అన్నీ తీసుకుని బ్రతుకుతున్నారు. మరి నా బ్రతుకుకు ఆధారమేది? బ్రహ్మతో సకల జీవులకూ ఆధారముగా నిర్మించబడ్డాను. ఎవరు సృష్టించారో ఆ పరమాత్మే ధనుర్బాణాలతో ముందుకొచ్చాడు. ఇంకెవరిని శరణు వేడాలి? నాకు ఇంకో రక్షకుడు లేడు (అనన్య శరణత్వము) 

య ఏతదాదావసృజచ్చరాచరం స్వమాయయాత్మాశ్రయయావితర్క్యయా
తయైవ సోऽయం కిల గోప్తుముద్యతః కథం ను మాం ధర్మపరో జిఘాంసతి

ఇతరులెవ్వరూ ఊహించరాని రీతిలో ఈ ప్రపంచాన్ని సృష్టించావు. ఇంత కాలమూ సృష్టించిన నీవే సంహరించాలనుకుంటున్నావు. నీవు సంకల్పించిన పనిని ఎవరు వారించగలరు. నీవేమనుకుంటున్నావో ఎవరికి తెలుసు. నీకంటే వేరుగా నన్ను కాపాడే వారు ఉన్నారా? 

నూనం బతేశస్య సమీహితం జనైస్తన్మాయయా దుర్జయయాకృతాత్మభిః
న లక్ష్యతే యస్త్వకరోదకారయద్యోऽనేక ఏకః పరతశ్చ ఈశ్వరః

ఎవరు చేస్తున్నారో, ఎవరు చేయిస్తున్నారో, ఎవరు చాలారూపాలలో ఉండి, ఏకరూపములో కూడా ఉన్నారో, అవతల వైకుంఠములో ఏ మహానుభావుడిగా వేంచేసి ఉంటాడో, నీ చేత నీవే స్వయముగా ఏర్పరచుకున్న జగత్తు (ఇంద్రియాలు మనసు మొదలైన వాటితో ఉన్న జగత్తు)

సర్గాది యోऽస్యానురుణద్ధి శక్తిభిర్ద్రవ్యక్రియాకారకచేతనాత్మభిః
తస్మై సమున్నద్ధనిరుద్ధశక్తయే నమః పరస్మై పురుషాయ వేధసే
స వై భవానాత్మవినిర్మితం జగద్భూతేన్ద్రియాన్తఃకరణాత్మకం విభో
సంస్థాపయిష్యన్నజ మాం రసాతలాదభ్యుజ్జహారామ్భస ఆదిసూకరః
అపాముపస్థే మయి నావ్యవస్థితాః ప్రజా భవానద్య రిరక్షిషుః కిల
స వీరమూర్తిః సమభూద్ధరాధరో యో మాం పయస్యుగ్రశరో జిఘాంససి

తాను సృష్టించినదానికాధారం కావలని బ్రహ్మ నన్ను తీసుకొచ్చాడు. ఆది వరాహముగా నన్ను సముద్రపడుగు నుండి బయటకు తెచ్చింది ఎవరు? ఇపుడు చంపుతా అన్నది ఎవరు? అంతా నీరే ఉన్నప్పుడు ప్రళయకాలములో ఒక నావను ఏర్పరచావు, అందులో ప్రజాపతులని కూర్చావు. 
ఈనాడు ఆ మహానుభావుడే తీస్ఖణమైన బాణములతో సంహరించబోతున్నాడు

నూనం జనైరీహితమీశ్వరాణామస్మద్విధైస్తద్గుణసర్గమాయయా
న జ్ఞాయతే మోహితచిత్తవర్త్మభిస్తేభ్యో నమో వీరయశస్కరేభ్యః

రాజైన వాడు తప్పు చేసిన వారిని శిక్షించాలి. కానీ ప్రజలకు బాగా ఉపకరించేవారిని శిక్షిస్తే ఏమొస్తుంది? ప్రజలకు ఏమేమి కావాలో మాతో చెప్పి, ఎక్కడ లోపముందో అడిగి చేయించుకోవాలి. చేయగలవారు పని చేయనపుడు దండించుట కాదు, ప్రభువైన వాడు వారితో ఆ పని చేయించుకోవాలి.
మనసు బుద్ధీ అంతా మోహించబడి, నీవాచరించే మాయా సృష్టి ఎవరికి తెలుస్తుందోవారికి నమస్కారం.

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదహారవ అధ్యాయం



మైత్రేయ ఉవాచ
ఇతి బ్రువాణం నృపతిం గాయకా మునిచోదితాః
తుష్టువుస్తుష్టమనసస్తద్వాగమృతసేవయా

ముని చేత ప్రేరేపించబడిన గాయకులు రాజు మాట్లాడిన మాటలతో సంతోషించారు. 

నాలం వయం తే మహిమానువర్ణనే యో దేవవర్యోऽవతతార మాయయా
వేనాఙ్గజాతస్య చ పౌరుషాణి తే వాచస్పతీనామపి బభ్రముర్ధియః

మాయతో ఈ రూపముగా అవతరించావు. నీ మహిమ వర్ణించుటకు మేము సరిపోము. వేనుని వలన పుట్టిన నీ పురుష కార్యములు వర్ణించాలంటే వాక్పతుల బుద్ధులు కూడా భ్రమిస్తాయి 

అథాప్యుదారశ్రవసః పృథోర్హరేః కలావతారస్య కథామృతాదృతాః
యథోపదేశం మునిభిః ప్రచోదితాః శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి

అలా అని నీ స్తోత్రం చేయకుండా ఉండలేము. అమృతం మొత్తం ప్రవహిస్తోంది అమృతం మొత్తం తాగలేమని చూస్తూ ఊరుకుంటామా. ఎంతో కొంతైనా నోట్లో వేసుకుందామని చూస్తాము. అలాగే నీ గుణాలు మొత్తం చెప్పాలన్న నియమం లేదు. నీవు ఔదార్యము కలిగిన చరిత్ర కల వాడివి
మాకు మా మునులు చెప్పినట్లుగా నీ ఉత్తమ కర్మలను మేము వివరిస్తాము.నీవు ముందు ఏమి చేయబోతున్నావో చెబుతాము. నీవు పరమాత్మ అని తెలుసు కాబట్టి నీవు చేసే పనులు పెద్దల వలన విని ఉన్నాము కాబట్టి వాటినే కీర్తన చేస్తాము

ఏష ధర్మభృతాం శ్రేష్ఠో లోకం ధర్మేऽనువర్తయన్
గోప్తా చ ధర్మసేతూనాం శాస్తా తత్పరిపన్థినామ్

ధర్మము ఆచరించే వారిలో ఉత్తముడు ఈ మహానుభావుడు. లోకాన్ని ధర్మములో అనువర్తింపచేస్తాడు. ఎవరు ధర్మాన్ని తప్పకుండా కాపాడతాడు. ధర్మాన్ని అతిక్రమించే వారిని శాసిస్తాడు

ఏష వై లోకపాలానాం బిభర్త్యేకస్తనౌ తనూః
కాలే కాలే యథాభాగం లోకయోరుభయోర్హితమ్

అటు రాజుగా ఉన్న వాడే సకల లోకపాలకుల అంశలను తనలో నిలుపుకుంటాడు. ఇహ పర లోకముల హితమును (ఏ ఏ కాలములో ఏ ఏ లోకాలకి ఎలాంటి హితమును కావాలో దానిని) కూరుస్తాడు. లోకపాలురకు కూడా శక్తినీ సామర్ధ్యాన్నీ ప్రసాదిస్తాడు. ఇహ పర లోకముల ధర్మాన్ని కాపాడతాడు. 

వసు కాల ఉపాదత్తే కాలే చాయం విముఞ్చతి
సమః సర్వేషు భూతేషు ప్రతపన్సూర్యవద్విభుః

సమయమొచ్చినప్పుడు పన్ను రూపములో ద్రవ్యాన్ని తీసుకోవడం. ఈతి బాధలతో బాధపడుతున్నప్పుడు ఇవ్వడం, వరద వచ్చినప్పుడు ఎత్తైన ప్రాంతములో ప్రజలను క్షేమముగా ఉంచి, వారికి ఆహారం అందించి, వరద తగ్గాక దింపి, కొన్ని రోజులు పోషించి, నష్టపరిహారం ఇవ్వాలి. సుర్ర్య కిరణాలకు వలె అందరి యందూ సమత్వాన్ని ప్రకటించాలి

తితిక్షత్యక్రమం వైన్య ఉపర్యాక్రమతామపి
భూతానాం కరుణః శశ్వదార్తానాం క్షితివృత్తిమాన్

ఆక్రమించే వారి స్వభావన్ని కొంతకాలం క్షమించాలి. భూతముల మీద కరుణ చూపుతాడు. రోగ గ్రస్తులూ ఆర్తులు ఉండటానికి భూమి ఇస్తాడు

దేవేऽవర్షత్యసౌ దేవో నరదేవవపుర్హరిః
కృచ్ఛ్రప్రాణాః ప్రజా హ్యేష రక్షిష్యత్యఞ్జసేన్ద్రవత్

ఈయన బలపరాక్రములను పరీక్షించడానికి వరుణ ఇంద్రాదులు వర్షించడం మానేస్తే పృధువు తన శక్తితో వర్షాన్ని కురిపిస్తాడు. తన దివ్య ముఖ శోభతో లోకాన్ని ఆనందింపచేస్తాడు. 

ఆప్యాయయత్యసౌ లోకం వదనామృతమూర్తినా
సానురాగావలోకేన విశదస్మితచారుణా

స్వచ్చమైన నవ్వుతో ప్రకాశించే ముఖమండలములో ప్రేమను చూపడముతో 

అవ్యక్తవర్త్మైష నిగూఢకార్యో గమ్భీరవేధా ఉపగుప్తవిత్తః
అనన్తమాహాత్మ్యగుణైకధామా పృథుః ప్రచేతా ఇవ సంవృతాత్మా

ఈయన ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారో ప్రజలకు అవి ఫలితమిచ్చినప్పుడు అర్థమవుతుంది (చేసే ముందు చాటింపు ఉండదు). ఏమి చేస్తున్నాడో అది అతి రహస్యముగా ఉంచుతాడు. గంభీరమైన బుద్ధి కలవాడు. తానేరీతిలో ప్రవర్తిస్తాడో కూడా రహస్యముగా ఉంచుతాడు. ఇతను అనేకమైన గొప్ప గుణాలకు ఒకే నివాసమైన వాడు. వరుణుడి లాగ తన స్వరూపాన్ని తాను దాచుకొని ఉంటాడు

దురాసదో దుర్విషహ ఆసన్నోऽపి విదూరవత్
నైవాభిభవితుం శక్యో వేనారణ్యుత్థితోऽనలః

అందరికీ దగ్గరలో ఉంటాడు. ఇతన్ని ఎవరూ చేరలేరూ, సహించలేరు. దగ్గరలో ఉన్నా దూరముగా ఉన్నవాడిలా ప్రవర్తిస్తాడు. వేనుడనే అరణిలో పుట్టిన అగ్నిహోత్రము ఇతడు. 

అన్తర్బహిశ్చ భూతానాం పశ్యన్కర్మాణి చారణైః
ఉదాసీన ఇవాధ్యక్షో వాయురాత్మేవ దేహినామ్

ఇతను పరమాత్మ కాబట్టి అన్ని చోట్లా ఉంటాడు. అయినా ఉదాసీనుడిలా ఉంటాడు. ఈయన అధ్యక్షుడు. గూఢచారులను నియమిచి రాజ్యములో విషయాలను కనుక్కుంటూ ఉంటాడు. శరీర ధారులకు వాయువు ఎలా ఐతే లోపలా బయటా ఉంటుందో ఈయన కూడా అలాగే ఉంటాడు. 

నాదణ్డ్యం దణ్డయత్యేష సుతమాత్మద్విషామపి
దణ్డయత్యాత్మజమపి దణ్డ్యం ధర్మపథే స్థితః

తనను ద్వేషించేవాడైనా సరే దండించడానికి కావలసిన తప్పు చేయనప్పుడు వాడిని దండించడు

అస్యాప్రతిహతం చక్రం పృథోరామానసాచలాత్
వర్తతే భగవానర్కో యావత్తపతి గోగణైః

మానస సరోవరమునుంచీ సూర్యభగవానుడు తన కిరణములను ఎంతవర్కూ ప్రసరింపచేస్తున్నాడో ఆ ప్రాంతమంతా ఈయన రాజ్యమే 

రఞ్జయిష్యతి యల్లోకమయమాత్మవిచేష్టితైః
అథాముమాహూ రాజానం మనోరఞ్జనకైః ప్రజాః

ఈ లోకాన్ని రంజింపచేస్తాడు. ప్రజలు ఇతన్ని స్తోత్రం చేస్తారు

దృఢవ్రతః సత్యసన్ధో బ్రహ్మణ్యో వృద్ధసేవకః
శరణ్యః సర్వభూతానాం మానదో దీనవత్సలః

ఈయన దృఢవ్రతుడు (చెప్పిన పని చేసేవాడు), అసత్యమనేది పలకని వాడు. బ్రాహ్మణుల భక్తుడు వృద్ధ సేవకుడు. అన్ని ప్రాణులకూ అభయమిచ్చిన మహనుభావుడు. అందరి గౌరవాన్నీ కాపాడే వాడు (మానద) 

మాతృభక్తిః పరస్త్రీషు పత్న్యామర్ధ ఇవాత్మనః
ప్రజాసు పితృవత్స్నిగ్ధః కిఙ్కరో బ్రహ్మవాదినామ్

పరస్త్రీలను తల్లిలాగ, తన భార్యను తనలో సగముగా, ప్రజలకు తండ్రిలాగా, బ్రాహ్మణోత్తములకు దాసునిలాగ, 

దేహినామాత్మవత్ప్రేష్ఠః సుహృదాం నన్దివర్ధనః
ముక్తసఙ్గప్రసఙ్గోऽయం దణ్డపాణిరసాధుషు

మామూలు మానవులకు ఆత్మ అంటే ఎంత ఇష్టమో ఈ రాజంటే అంతే ఇష్టమూ, మిత్రులలో ఆనందము పెంచేవాడు. సంసారములో బద్ధులైన వారి విషయాలు గానీ సంసారములో విషయాలు కానీ పూర్తిగా విడిచీపెట్టినవాడు. అసాధువులను దండించేవాడు

అయం తు సాక్షాద్భగవాంస్త్ర్యధీశః కూటస్థ ఆత్మా కలయావతీర్ణః
యస్మిన్నవిద్యారచితం నిరర్థకం పశ్యన్తి నానాత్వమపి ప్రతీతమ్

ఈయనే మూడులోకాలకు అధిపతి. రక్షకుడు. ఈయన పరమాత్మ. కూటస్థుడు (కదలిక లేనివాడు). పరమాత్మ కల (అంశ)తో అవతరించాడు. చాలా మంది అజ్ఞ్యాన ప్రభావముతో ఈ ప్రపంచమంతా నానాత్వం వహించి ఉంటారు. 

అయం భువో మణ్డలమోదయాద్రేర్గోప్తైకవీరో నరదేవనాథః
ఆస్థాయ జైత్రం రథమాత్తచాపః పర్యస్యతే దక్షిణతో యథార్కః

కానీ ఈయన ఉదయ పర్వతం నుండి అస్థా చలం వరకూ ఉన్న భూమండలాన్ని పరిపాలిస్తాడు. ఈయన రథం పేరు జైత్రం. ఆ రథానికి జయించడం మాత్రమే తెలుసు. ధనువును ధరించి భూమండలమంతా తిరుగుతాడు సూర్యభగవానునిలాగ. 

అస్మై నృపాలాః కిల తత్ర తత్ర బలిం హరిష్యన్తి సలోకపాలాః
మంస్యన్త ఏషాం స్త్రియ ఆదిరాజం చక్రాయుధం తద్యశ ఉద్ధరన్త్యః

ఈయన కోసం ఆయా రాజులు (సామంతులు), లోకపాలకులూ ఎదురుగా వచ్చి కానుకలు ఇచ్చి ఆరాధిస్తారు. మహారాణులు కూడా ఈయనని ఆదిరాజుగా స్తోత్రం చేస్తారు. 

అయం మహీం గాం దుదుహేऽధిరాజః ప్రజాపతిర్వృత్తికరః ప్రజానామ్
యో లీలయాద్రీన్స్వశరాసకోట్యా భిన్దన్సమాం గామకరోద్యథేన్ద్రః

భూమి గోరూపముగా ఉన్నప్పుడు ఆమెయందు అన్ని ఔషధులనూ పాలలా పితుకుతాడు. ప్రజలకు వృత్తి కలిగిస్తాడు. తన ధనువు యొక్క కొనతో భూమిని సమానము చేస్తాడు (ఎలా ఐతే ఇంద్రుడు పర్వతాలను వజ్రాయుధముతో నరికాడో)

విస్ఫూర్జయన్నాజగవం ధనుః స్వయం యదాచరత్క్ష్మామవిషహ్యమాజౌ
తదా నిలిల్యుర్దిశి దిశ్యసన్తో లాఙ్గూలముద్యమ్య యథా మృగేన్ద్రః

ధనువు ఎక్కుపెట్టి ఈయన బయలుదేరితే సింహాన్ని చూచి ఎలా మిగతా మృగాలు దాక్కుంటాయో అలా మిగిలిన రాజులు దాక్కుంటారు 

ఏషోऽశ్వమేధాఞ్శతమాజహార సరస్వతీ ప్రాదురభావి యత్ర
అహార్షీద్యస్య హయం పురన్దరః శతక్రతుశ్చరమే వర్తమానే

ఈయన నూరు అశ్వమేధ యాగాలు చేస్తాడు. ఈయన దగ్గరే సరస్వతి కూడా ఆవిర్భవించింది. నూరవ అశ్వమేధం వచ్చేసరికి ఇంద్రుడు అశ్వాన్ని అపహరిస్తాడు

ఏష స్వసద్మోపవనే సమేత్య సనత్కుమారం భగవన్తమేకమ్
ఆరాధ్య భక్త్యాలభతామలం తజ్జ్ఞానం యతో బ్రహ్మ పరం విదన్తి

తన రాజ్యములో సభామంటపములోకి వేంచేసిన సనత్కుమారున్ని భక్తితో ఆరాధించి పరమాత్మ స్వరూపాన్ని చెప్పే ఉత్తమ జ్ఞ్యానన్ని పొందుతాడు. 

తత్ర తత్ర గిరస్తాస్తా ఇతి విశ్రుతవిక్రమః
శ్రోష్యత్యాత్మాశ్రితా గాథాః పృథుః పృథుపరాక్రమః

ఈయన తన యొక్క, తన పనుల యొక్కా, కీర్తిని గానము చేసే వాక్యములను ఆయా ప్రాంతములలో వింటూ ఉంటాడు. 

దిశో విజిత్యాప్రతిరుద్ధచక్రః స్వతేజసోత్పాటితలోకశల్యః
సురాసురేన్ద్రైరుపగీయమాన మహానుభావో భవితా పతిర్భువః

తన రథమునకు అడ్డు లేకుండా అన్ని ప్రాంతములనూ గెలిచి తన దివ్యమైన తేజస్సుతో లోకుల బాధలు తొలగించీ, దేవదానవులందరిచేత గానము చేయబడతాడు. భూపతి అవుతాడు, మహానుభావుడు అవుతాడు. అందరినీ కాపాడుతాడు 

Popular Posts