Followers

Wednesday 5 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం మూడవ అధ్యాయం

ఉద్ధవ ఉవాచ
తతః స ఆగత్య పురం స్వపిత్రోశ్చికీర్షయా శం బలదేవసంయుతః
నిపాత్య తుఙ్గాద్రిపుయూథనాథం హతం వ్యకర్షద్వ్యసుమోజసోర్వ్యామ్

రాసలీల తరువాత తన తల్లి తండ్రులకు శుభమూ మంగళమూ కలిగించాలన్న కోరికతో మధురా పురానికి వచ్చాడు. వచ్చినవాడు అప్పటికే చైంపోయిన వాడైన కంసుని లాగాడు.

సాన్దీపనేః సకృత్ప్రోక్తం బ్రహ్మాధీత్య సవిస్తరమ్
తస్మై ప్రాదాద్వరం పుత్రం మృతం పఞ్చజనోదరాత్

సాందీపని నుండి ఒక సారి చెప్పిన వేదాన్ని నేర్చున్నాడు. ఆ గురువుగారికి పంచజన్యుని ఉదరాన్నుంచి పాంచజన్యం సాధించి, వారి గురువుగారి కుమారున్ని కూడా తెచ్చాడు

సమాహుతా భీష్మకకన్యయా యే శ్రియః సవర్ణేన బుభూషయైషామ్
గాన్ధర్వవృత్త్యా మిషతాం స్వభాగం జహ్రే పదం మూర్ధ్ని దధత్సుపర్ణః

రుక్మిణిని పొందాలని వచ్చిన చాలా మంది రాజులందరూ చూస్తూ ఉండగా శత్రువుల శిరస్సు మీద పాదం ఉంచి ఆమెను గాంధర్వ విధిగా వివాహం చేసుకున్నాడు (వధువూ వరుడూ యొక్క సమ్మతంతో పంచభూతాల సాక్షిగా చేసుకునేది గాంధర్వం). ఆ విధంగా తన భాగం తాను తీసుకున్నాడు

కకుద్మినోऽవిద్ధనసో దమిత్వా స్వయంవరే నాగ్నజితీమువాహ
తద్భగ్నమానానపి గృధ్యతోऽజ్ఞాఞ్జఘ్నేऽక్షతః శస్త్రభృతః స్వశస్త్రైః

నాగ్నజితిని (నగ్నజిత్ కుమార్తే) కూడా వివాహం చేసుకున్నాడు, బలమైన ముకుతాడు వేయని కోడెలను జయించి స్వయంవరంలో వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకునాదమని చాలమంది వచ్చారు.ఆ ఆశతో అందరూ కలిసి కృష్ణుడి మీదకు దండెత్తి వచ్చారు. అస్త్రాలతో వచ్చిన వారిని తన ఆయుధములతో తాను కొట్టబడకుండా వారందరినీ సంహరించాడు.

ప్రియం ప్రభుర్గ్రామ్య ఇవ ప్రియాయా విధిత్సురార్చ్ఛద్ద్యుతరుం యదర్థే
వజ్ర్యాద్రవత్తం సగణో రుషాన్ధః క్రీడామృగో నూనమయం వధూనామ్

ఎలా అయితే పామరుడు ప్రియురాలికి విధేయుడై ఆమె చెప్పిన పనులు చేస్తాడో సత్యభామ కోసం స్వర్గంలో ఉన్న పారిజాత వృక్షాన్ని తీసుకున్నాడు. ఇంద్రుడు కోపముతో గుడ్డివాడై తన సైన్యంతో కలిసి యుద్ధానికి వచ్చాడు. త్రైలోక్యనాధుడైన ఇంద్రుడు కూడా తన భార్యకు వశుడే అని చూపడానికి స్వామి ఈ లీల చేసాడు. స్వామి ఏ పని చేసినా మనకి పాపం రాకుండా చేస్తాడు. పెద్దలు ఇంటికి వచ్చినపుడు వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవచేసి సత్కారం చేయాల్సిన బాధ్యత గృహస్తుది. అలా చేయని పాపం తప్పించడానికి స్వామి ఈ పని చేసాడని పెద్దల వ్యాఖ్యానం. ఈ లోకమంతా ఏరు దాటాక తెప్ప తగలేసే వారే అని చెప్పేందుకు కూడా ఈ లీల చేసి ఉండవచ్చు. లేక అందరూ భార్యా దాసులే అని చెప్పేందుకు కూడా ఈ లీలను అన్వయించుకోవచ్చు.

సుతం మృధే ఖం వపుషా గ్రసన్తం దృష్ట్వా సునాభోన్మథితం ధరిత్ర్యా
ఆమన్త్రితస్తత్తనయాయ శేషం దత్త్వా తదన్తఃపురమావివేశ

భూమి తన కుమారుడిని, ఆకాశాన్ని ఆవరించి "నేను ఇంత బాలాడ్యున్ని" అని గర్విస్తున్న నరకున్ని సంహరించినందుకు (నరకునికి కుజ అని పేరు. కు అంటే భూమి) ఆ నరకుని కొడుకుకు రాజ్యం ఇవ్వవలసిందని యాచిస్తే, అతని కుమారునికి మిగిలి ఉన్న రాజ్యం ఇచ్చి, తన మనువడి అభ్యర్థన మేరకు అంతఃపురానికి వేంచేసిన శ్రీకృష్ణుడు అక్కడ బంధించబడి ఉన్న పదుహారువేలమందీ

తత్రాహృతాస్తా నరదేవకన్యాః కుజేన దృష్ట్వా హరిమార్తబన్ధుమ్
ఉత్థాయ సద్యో జగృహుః ప్రహర్ష వ్రీడానురాగప్రహితావలోకైః

ఆసాం ముహూర్త ఏకస్మిన్నానాగారేషు యోషితామ్
సవిధం జగృహే పాణీననురూపః స్వమాయయా

తాస్వపత్యాన్యజనయదాత్మతుల్యాని సర్వతః
ఏకైకస్యాం దశ దశ ప్రకృతేర్విబుభూషయా

సంతోషంతో సిగ్గుతో ప్రేమతో స్వామిని భర్తగా స్వీకరించారు. అంతమందినీ అన్ని రూపాలలో ఒకే సమయానికే వివాహం చేసుకున్నాడు. ప్రతీ రూపానికి తగ్గట్టుగా ఒక అనురూపాని సృష్టించుకొని  వివాహం చేసుకున్నాడు. తన మాయతో పదిమంది పుత్రులని కన్నాడు

కాలమాగధశాల్వాదీననీకై రున్ధతః పురమ్
అజీఘనత్స్వయం దివ్యం స్వపుంసాం తేజ ఆదిశత్

కాలయవనుడు జరాసంధుడు వంటి రాక్షసులను వధించాడు

శమ్బరం ద్వివిదం బాణం మురం బల్వలమేవ చ
అన్యాంశ్చ దన్తవక్రాదీనవధీత్కాంశ్చ ఘాతయత్

కొందరిని చంపాడు కొందరిని చంపించాడు

అథ తే భ్రాతృపుత్రాణాం పక్షయోః పతితాన్నృపాన్
చచాల భూః కురుక్షేత్రం యేషామాపతతాం బలైః

అన్నదమ్ములూ, వారి పిల్లలూ కలిసి "నా రాజ్యం నా భూమి" అనుకున్న వారిని పరివారంతో కలిసి ధ్వంసం చేసాడు. ఆ సైన్య పదఘట్టాలకు భూమి కంపించింది.

స కర్ణదుఃశాసనసౌబలానాం కుమన్త్రపాకేన హతశ్రియాయుషమ్
సుయోధనం సానుచరం శయానం భగ్నోరుమూర్వ్యాం న ననన్ద పశ్యన్

దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునుల దురాలోచనను ఆమోదించడం వలన వారి సంపదా, ఆయుష్షు క్షీణమయ్యింది. దాని పరిణామమే దుర్యోధనుడు తొడలు విరిగి భూమి మీద పడి ఉన్నాడు. అలా పడి ఉన్నవాడిని చూసి కూడా శ్రీకృష్ణుడు సంతోషించలేదు.

కియాన్భువోऽయం క్షపితోరుభారో యద్ద్రోణభీష్మార్జునభీమమూలైః
అష్టాదశాక్షౌహిణికో మదంశైరాస్తే బలం దుర్విషహం యదూనామ్

ఇంత కష్టపడినా భూమి భారం పూర్తిగా తగ్గలేదని భావించాడు.

మిథో యదైషాం భవితా వివాదో మధ్వామదాతామ్రవిలోచనానామ్
నైషాం వధోపాయ ఇయానతోऽన్యో మయ్యుద్యతేऽన్తర్దధతే స్వయం స్మ

మిగిలిన వారిలో, వారిలో వారికే కలహం వచ్చేట్లు చేసాడు. తమలో తాము కొట్టుకోవాలంటే తమను తాము మరచిపోవాలి. మధుపానంతో కళ్ళతో బాటు మనసు కూడా ఎర్రబారింది. అంతకన్న వారిని వధించడానికి వేరొక ఉపాయం లేదు. ఆయన స్వలోకాని వెళ్ళే లోపే ఈ పని జరగాలనుకున్నాడు.

ఏవం సఞ్చిన్త్య భగవాన్స్వరాజ్యే స్థాప్య ధర్మజమ్
నన్దయామాస సుహృదః సాధూనాం వర్త్మ దర్శయన్

ఇలా ధర్మరాజుని రాజ్యంలో ఉంచి, సజ్జన మార్గాన్ని నిర్దేశిస్తూ మిత్రులకి ఆనందం కలిగిస్తూ, అభిమన్య వీర్య నిక్షేపమైన ఉత్తాగర్భాన్ని అశ్వద్దాం అస్త్రాన్నుంచి కాపాడాడు

ఉత్తరాయాం ధృతః పూరోర్వంశః సాధ్వభిమన్యునా
స వై ద్రౌణ్యస్త్రసమ్ప్లుష్టః పునర్భగవతా ధృతః

అయాజయద్ధర్మసుతమశ్వమేధైస్త్రిభిర్విభుః
సోऽపి క్ష్మామనుజై రక్షన్రేమే కృష్ణమనువ్రతః

ధర్మరాజుతో మూడు అశ్వమేధాలను చేయించాడు. కృష్ణున్ని అనుసరించి ధర్మరాజు ఆనందముగా ఉన్నాడు

భగవానపి విశ్వాత్మా లోకవేదపథానుగః
కామాన్సిషేవే ద్వార్వత్యామసక్తః సాఙ్ఖ్యమాస్థితః

భగవానుడైన కృష్ణుడు కూడా లోక మార్గాన్ని వేద మార్గాన్ని అనుసరించినవాడై ద్వారకా నగరములో సకల కామభోగాలను అసక్తుడై జ్ఞ్యానమార్గంలో ఉండి అనుభవించాడు

స్నిగ్ధస్మితావలోకేన వాచా పీయూషకల్పయా
చరిత్రేణానవద్యేన శ్రీనికేతేన చాత్మనా

స్నేహం తొణికిసలాడే చిరునవ్వుతో కూడిన చూపుతో, అమృతం వంటి వాక్కుతో, ఏ మాత్రం దోషానికి ఆస్కారం లేని నడవడితో అమ్మవారికి నివాసమైన శరీరంతో

ఇమం లోకమముం చైవ రమయన్సుతరాం యదూన్
రేమే క్షణదయా దత్త క్షణస్త్రీక్షణసౌహృదః

ఈ లోకాన్ని పై లోకాన్ని ఆనందింపచేస్తూ, యాదవులకు ఇంకా ఆనందం కల్గింపచేస్తూ , క్షణికమైన సుఖాన్నిచ్చేది (క్షణద, రాత్రికి కూడా క్షణదా అని పేరు) ఈయబడిన క్షణకాలమైన స్త్రీయొక్క చూపుచేత తెలియబడే ప్రేమకలవాడు. అందరిలో తాను ఒకడిగా విహరించాడు

తస్యైవం రమమాణస్య సంవత్సరగణాన్బహూన్
గృహమేధేషు యోగేషు విరాగః సమజాయత
దైవాధీనేషు కామేషు దైవాధీనః స్వయం పుమాన్
కో విశ్రమ్భేత యోగేన యోగేశ్వరమనువ్రతః

గృహస్తు ఆచరించిన కర్మలయందు విరక్తి పుట్టి, లోకంలో కోరికలు కలుగుట, వాటి యందు విరక్తి పొందుట అనేది దైవాదీనములే కాబట్టి, ఆయన కూడా దైవాధీనుడు కాబట్టి, ప్రపంచంలో యోగీశ్వరుడు తప్ప ఈ సంసారంలో విరక్తి ఎవరికీ కలగదు అని

పుర్యాం కదాచిత్క్రీడద్భిర్యదుభోజకుమారకైః
కోపితా మునయః శేపుర్భగవన్మతకోవిదాః

ఇలా విరక్తి పుట్టి పరమాత్మ వెళ్ళాలనుకుంటున్నందు వలన, ఆయన సంకల్పం వలన, మునులు ముసలం పుడుతుంది అని శపించారు.

తతః కతిపయైర్మాసైర్వృష్ణిభోజాన్ధకాదయః
యయుః ప్రభాసం సంహృష్టా రథైర్దేవవిమోహితాః

కొంతకాలం తరువాత ఒక గ్రహణ సమయంలో దైవం చేత మోహించబడి వృష్ణి బోజ అంధక యదు కులం వారందరూ ప్రభాస తీర్థానికి వెళ్ళారు

తత్ర స్నాత్వా పిత్న్దేవానృషీంశ్చైవ తదమ్భసా
తర్పయిత్వాథ విప్రేభ్యో గావో బహుగుణా దదుః

అక్కడ స్నానం చేసి దేవతలనూ పితృదేవతలకూ తర్పణం చేసి బ్రాహ్మణులకు దానం చేసి

హిరణ్యం రజతం శయ్యాం వాసాంస్యజినకమ్బలాన్
యానం రథానిభాన్కన్యా ధరాం వృత్తికరీమపి

బంగారమూ, శయనము, కన్యలు, భూములూ, అన్నమూ అన్నీ దానం చేసి

అన్నం చోరురసం తేభ్యో దత్త్వా భగవదర్పణమ్
గోవిప్రార్థాసవః శూరాః ప్రణేముర్భువి మూర్ధభిః

సాష్టాంగపడి వారికి తలలు వంచి నమస్కరించారు. ఇవన్నీ లాంఛనంగా చేసారు.  తరువాత వారు చేసుకోబోయే విందూ విహారాలకోసం చేసారు.

Popular Posts