Followers

Friday 7 February 2014

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 10


1. పూర్వం విత్తనం వేయటానికి ఊరిబయటకు వెళ్ళీ భూమినీ నాగలినీ దేవతలనీ బ్రాహ్మణులనీ ఎద్దులనీ వరుణున్నీ పూజించి ప్రారంభించేవారు. పంట పండించడమే కాదు భోజనం చేయడం కూడా వ్రతం. బ్రతికేదీ పుట్టేదీ అన్నముతో. భోజనవ్రతం. కాళ్ళూ చేతులూ కడుకున్ని ఆచమనం చేసి హృదయములో స్వామిని ఆరాధించి, భోజనానికి అనుమతి తీసుకోవాలి, పాత్రను మూడు సార్లు ప్రోక్షించాలి, పదహారు సార్లు ఆచమనం చేయాలి భోజనం చేసే ముందు, చేసిన తరువాత ఇరవై నాలుగు సార్లు ఆచమనం చేయాలి, దాని వలన చిగుళ్ళమధ్య ఇరుక్కున్నవి పోతాయి, చేతిని పదహారు సార్లు కడుక్కోవాలి.
కోపముతోనూ ఏడుస్తూ అరుస్తూ కలహిస్తూ నిందిస్తూ కాళ్ళూ చేతులూ ఒళ్ళూ ఊపుతూ, సంగీతం వింటూ భోజనం చేయకూడదు. ఆచమనం చేసి తినడం వలన అన్న నాళములో ఏమీ అడ్డురాకుండా ఉంటుంది. అన్నము సరిగ్గా లోపలకి వెళుతుంది

2. సమాం చ కురు మాం రాజన్దేవవృష్టం యథా పయః
అపర్తావపి భద్రం తే ఉపావర్తేత మే విభో

ఎత్తువంపులుగా ఉన్న నన్ను సమానము చేయి. కురిసిన నీరు అన్ని ప్రాంతాలలోకీ సమానముగా వెళుతుంది. ఇంకిన తరువాత కొంత నీరు నిలువ ఉండేట్లు చేయి. వర్షాకలం కాని సమయములో కూడా భూమి మీద నీరు నిలువ ఉండేలా చేయి. భగవంతుని చేత వర్షించిన నీరు వర్షాకాలం కాని సమయములో కూడా మీకందరికీ అందాలి 
3. యద్ధ్యాయతో దైవహతం ను కర్తుం మనోऽతిరుష్టం విశతే తమోऽన్ధమ్
భగవంతుడు చెడగొట్టిన దాన్ని చేయాలి అనుకున్నవారికి కోపం వస్తుంది ఆవేశం వస్తుంది బుద్ధి పాడవౌతుంది జ్ఞ్యానం నశిస్తుంది. ఆ పని కాలేదంటే "ఇది పరమాత్మకు ఇష్టం లేదేమో" అని పరమాత్మకు నమస్కరించాలి.
పరమాత్మ చెడగొట్టిన దాన్ని గురించి చేయడానికి ఆలోచించేవాడికి మనసు కోపాక్రాంతమవుతుంది. అజ్ఞ్యానములో చేరుతుంది. భగవంతుడు చెడగొట్టిన పని గురించి ఆలోచించవద్దు

4. శరీరం ఉన్న వాడు తింటే శరీరము లేని వాడి కడుపు నిండుతుంది. పాంచభౌతిక శరీరం లేని వాడికి శరీరం ఉన్నవాడు తింటే కడుపు నిండుతుంది. అగ్ని జలము వలన పుడుతుంది (విద్యుత్ శక్తి). సజాతీయములతో పుట్టుక జరుగదు. విద్యుత్తు నీటి నుండి పుడుతుంది. వేడికి సంబంధించిన దానితో వేడి పుట్టదు. విజాతీయం ( విరుద్ధమైన ధర్మం) ఉన్న వాటితోనే పుడుతుంది. అలాగే శరీరం లేని వాడికి కడుపు నిండాలంటే శరీరం ఉన్నవాడు తినాలి. మరి శరీరం లేని వాడికి కడుపుంటుందా? ఉండదు. కానీ మనసు ఉంటుంది. అది నిండితే చాలు. ఎక్కడో ఉన్న కొడుకుకు మేలు జరిగితే (ఉదా: మనవడు పుడితే) ఇక్కడే ఉన్న తండ్రి మనసు నిండుతుంది. అంటే తృప్తి అనేది ఎక్కడ ఉన్నా పుడుతుంది. అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. పరలోకములోకి నిండేది కడుపు కాదు తృప్తి. ఈ లోకములో పూజిస్తే పైలోకములో ఉన్నవాడు తృప్తిపడతాడు.

5. గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేऽను సమ్పదః
ప్రసీదతాం బ్రహ్మకులం గవాం చ జనార్దనః సానుచరశ్చ మహ్యమ్

సంపదలు ఎవరి దగ్గరకు వస్తాయి? అన్ని మంచి గుణములూ కలవాడికి, ఉత్తం శీలము కలవాడికి, చేసిన ఉపకారం మరచిపోని వాడికీ, పెద్దవారిని ఆశ్రయించి ఉన్నవాడికీ అన్ని సంపదలూ స్వయముగా వచ్చి వరిస్తాయి. కాబట్టి అలాంటి బ్రాహ్మణోత్తములు గోవులూ దేవతలూ పరమాత్మ నా విషయములో ప్రసన్నమవుదురు గాక.

6. సప్తర్షులు యజ్ఞ్యం నిర్వహించినపుడు ఋషులు వారి భార్యలతో ప్రదక్షిణం చేసినపుడు అగ్నిహోత్రుడు వారిమీద వ్యామోహపడ్డాడు. ఆ వేదనతో అగ్నిహోత్రుడు చిక్కిపోయి, హవిస్సులను కూడా తీసుకోవట్లేదు. అది గమనించిన భార్య ఆయా భార్యల రూపములో వ్యవహరించింది. అగ్నిహోత్రుడు తృప్తి పడ్డాడు. ఋషులు ఆ విషయం తెలియక తమ భార్యలనూ అగ్నిహోత్రునీ శపించాడు. అగ్నిహోత్రుని భార్య నచ్చజెప్పడం వలన ఋషులు శాపాన్ని ఉపసంహరించారు. అప్పటినుంచీ భార్యాభర్తలు ప్రదక్షిణం చేస్తుంటే అగ్నిహోత్రునికి కళ్ళు కనపడకుండా ఉండాలన్న శాపమిచ్చారు. ఈ విషయం శంకరుడు స్కాంధ పురాణములో చెప్పాడు. అగ్నీ వాయువూ శంకరుని అంశలే. అందుకే కుమారస్వామి ఆరుగురి నుంచి జన్మించాడు: భూమి, భూమి భరించలేకపోతే అగ్ని, వాయువు, నీరు, శంకరుడు ఇలా ఆరుగురినుంచి షడ్యః అని కుమారస్వామి పుట్టాడు. అందుకే కృత్తికలు ఆరుగురు వచ్చారు. కుమారస్వామి అగ్ని పుత్రుడయ్యాడు. అలాగే హనుమంతుడు వాయు పుత్రుడు. అగ్నీ వాయువూ శంకరుడూ ఒకరే.

7. మశకా మత్కుణా రాత్రౌ మక్షికా భిక్షుకా దివా
పిపీలికా చ భార్యా చ దివారాత్రం ప్రబాధతే

8. న అతంత్రీ వాద్యతే వీణా న అచక్రః వర్తతే రథః |
న అపతిః సుఖం ఏధతే యా స్యాత్ అపి శత ఆత్మజా |౨-౩౯-౨౯|

మితం దదాతి హి పితా మితం మాతా మితం సుతః |
అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేత్ |౨-౩౯-౩౦|

హద్దు లేని ప్రేమనిచ్చేవాడు భర్త మాత్రమే. తల్లీ తండ్రీ అంత ప్రేమను ఇవ్వలేరు. అందుకు భర్తను అవమననించవద్దు. అయోధ్యాకాండము_-_సర్గము_39

9. గుణేషు క్రియతాం యత్నః కిమాటోపైః భయంకరైః
విక్రీయంతే న ఘంటాభిః గావః క్షీర వివర్జితాః

పాలియ్యని ఆవుల మెడలో గంటలు పెడితే కొంటారా.  మానవుడు గుణములచే గౌరవము పొందును గానీ,
ఆడంబరముచే కాదు. 

10. తత్కర్మ హరితోషం యత్సా విద్యా తన్మతిర్యయా - పరమాత్మకు సంతోషం కలిగింపచేసేదే పని, పరమాత్మయందు బుద్ధి నిలిపేదే చదువు 

Popular Posts