Followers

Saturday 1 March 2014

భగవంతుడు ఉన్నాడా?


అస్తి యజ్ఞపతిర్నామ కేషాఞ్చిదర్హసత్తమాః
ఇహాముత్ర చ లక్ష్యన్తే జ్యోత్స్నావత్యః క్వచిద్భువః

మొత్తం పధ్నాలుగు శాస్త్రాల యొక్క చర్చ ఉన్న శ్లోకం ఇది
మనమాచరించే యజ్ఞ్యమునకు ఒక అధిపతి ఉన్నాడు. 
పరమాత్మను ఒప్పుకోని వారు కొందరుంటారు. భగవంతుడున్నాడని ఒప్పించడానికి "పరమాత్మ ఉన్నాడు" అని అన్నాడు పృధువు. పరమాత్మ లేడు అనే వారి ఉద్దేశ్యమేమిటి? పరమాత్మ ఉన్నట్లైతే వేటి వేటి వలన తెలియాలో వాటి వాటి వలన పరమాత్మ తెలియబడట్లేదు. ప్రత్యక్షం మనకు ఒక ప్రమాణం. కంటికి కనపడడు,  చెవికి వినబడడు. ప్రత్యక్షముతో తెలియబడడు. ప్రత్యక్షముతో తెలియబడనిది అనుమానముతో తెలియబడదు. ఉదా: అంతకు ముందు మనం నిప్పు వలన పొగ చూసిన వారే పొగను చూసి అక్కడ నిప్పు ఉందీఇ అనుకుంటారు. కాబట్టి ప్రత్యక్షముతో తెలియబడని వస్తువు అనుమానముతో తెలియబడదు. అలాగే ప్రత్యక్షముతో తెలియబడనిది ఉపమానముతో కూడా తెలియబడదు. ఇక మిగిలిన ప్రమాణం శబ్దము. ఇది రెండు రకాలు. లౌకిక శబ్దము మనము మాట్లాడుకునేది. వైదిక శబ్దాలు వేదాలు. లౌకిక శబ్దం ప్రమాణం కాదు. ఎందుకంటే వాటిలో భ్రమా పొరబాటూ ఉంటుంది. బాధితులూ స్వార్థులూ ఆశాపరులూ ఒక తీరుగా ఉన్న దానిని ఇంకో తీరుగా చెప్పవచ్చు. మరచిపోయీ చెప్పవచ్చు. శబ్దము మనకు అర్థమును తెలపాలంటే ఎలాంటిది కావాలి? ప్రపంచములో మాట్లాడేవారందరూ వ్యాకరణ శాస్త్రమూ వేదమూ తెలిసి మాట్లాడుకుంటారా? వారి వారి పెద్దల వలన వచ్చిన శాబ్ద బోధే వారు మాట్లాడుకుంటారు. వృధ్ధులూ పెద్దలూ చెప్పేవన్నీ అశాశ్వతములే అనిత్యములే. మన ఇంట్లో పెద్ద వారు వేద శబ్దాలను చెబుతున్నారా? లేదు. వృద్ధ వ్యవహారము కూడా నశించేవాటి గురించే చెబుతాయి. నశించని పరమాత్మ నశించే వస్తువులను కూర్చి చెప్పే ప్రమాణముతో వర్ణింపబడలేదు. శబ్దమూ ప్రమాణము కాదు. ఉపమానం అనుమానం ప్రత్యక్షం ప్రమాణం కాదు. 
వేదములో ఉన్నవన్నీ అర్థవాదాలు. మరి జగత్తుకు కారణం అని దేన్నంటారు. మనకు ఆచరించే పనులకు రావలసిన ఫలాన్ని ఎవరిస్తారు? ప్రకృతే ఫలమిస్తుందని కొందరి వాదన. ఉదా: భూమిలో విత్తనం వేస్తే పంట వస్తోంది,  వాన పడితే భూమి పండుతోంది. దేశ కాల వస్తు విభాగాలను ముందు పెట్టుకుని అవే ఇస్తున్నాయి. ప్రకృతి కంటే జీవుని కంటే విలక్షణముగా పరమాత్మ ఉన్నాడని ఎందుకు ఒప్పుకోవాలి. సృష్టి జీవులు చేస్తున్నాయి, ప్రకృతి ఫలితం ఇస్తోంది. కనుక పరమాత్మ లేడు. జీవుడే కర్త. అని ఒక వాదం. 
ఈ వాదాలు చెప్పేవారందరికీ సమాధానముగా పృధు చక్రవర్తి "అస్తి యజ్ఞ్యపతి" అన్నాడు
కొందరి దృష్టిలో పరమాత్మ లేడు అంటున్నారేమో గానీ పరమాత్మ ఉన్నాడని చెప్పేవారి సంఖ్యే ఎక్కువ - కేషాఞ్చిదర్హసత్తమాః
మరి దానికి ప్రమాణమేమిటి? అన్ని లోకాలూ ఒక్క తీరులో ఉన్నాయా? విశేశముగా ప్రకాశించే లోకాలు కొన్ని ఉన్నాయి. కొన్ని లోకాలు చీకటితో ఉన్నాయి. 
ఇహాముత్ర చ లక్ష్యన్తే జ్యోత్స్నావత్యః క్వచిద్భువః -
కొన్ని లోకాలలో సుఖమూ కొన్ని లోకాలలో దుఃఖముంది. దుఃఖము కలిగేదాన్ని జీవుడెందుకు సృష్టించాడు. లోకాలను జీవుడెందుకు సృష్టించాడు. ఆ జీవుడు స్వర్గాది లోకాలకు వెళ్ళాలంటే యజ్ఞ్యం ఎందుకు చేస్తున్నాడు? అంటే జీవుడే స్వర్గాన్ని సృష్టించి, ఆ స్వర్గానికి వెళ్ళడానికి మళ్ళీ యజ్ఞ్యమెందుకు చేస్తున్నాడు? అంటే తన ఇంటికి తాను వెళ్ళడానికి ఇంకొకరి అనుమతి కావాలా?కాదు, ఈ లోకాలన్నీ ప్రకృతే సృష్టిస్తోందనుకుందాము. ప్రకృతే సృష్టిస్తోంటే ఇన్ని చిత్ర విచిత్రాలు ప్రకృతిలో ఉండకూడదు. ప్రకృతి పరిణామశీలము. ప్రకృతి స్తబ్ధముగా ఉండదు. మరి నిరంతర పరిణామశీలమైతే ప్రళయకాలములో ఏమి చేస్తుంది? నిరంతర పరిణామశీలమైతే ప్రళయకాలములో కూడా పరిణామశీలం కావాలి కదా. ప్రకృతి ప్రళయకాలములో స్తబ్ధముగా ఉంటుంది. అంటే ప్రకృతి సృష్టి చేయట్లెదు. జీవుడు సృష్టి చేసాడనుకుంటే నరకాన్నిచ్చే పాపాన్నెందుకు సృష్టిస్తాడు. సృష్టించిన పాపాన్ని తాను ఆచరిస్తాడా? తాను పాపాన్ని సృష్టించి దాని వలన బాధలు పడడానికి నరకాన్ని సృష్టించి దానిలో బాధపడతాడా? 
కొన్ని జీవులు పురుగులుగా కొన్ని కీటకాలుగా ఎందుకు పుడుతున్నాయి. ఇన్ని రకాల జీవరాశులు ఎందుకుంటాయి. ప్రపంచములో ఏ జీవుడైనా అలాంటి జన్మ కావాలి అని కోరుకుంటారా? 
అంటే జీవుడూ కాదు, ప్రకృతీ కాదు సృష్టి చేసేది. అందుకే ఈ రెంటికీ విలక్షణముగా ఒకడు సృష్టి చేస్తాడు. ఆచరించే పనులను రెండు భాగాలుగా విభజించాడు, మంచి కర్మలూ చెడు కర్మలూ అని.
ఆయన ఆజ్ఞ్యను శాస్త్రం అని చెప్పి, మన చేత చేయించాడు, వ్యవస్థలో పనీ, పనిని చేయించేవాడు, పని చేసేవాడు, చేసిన వాడు తప్పు చేస్తే శిక్షించేవాడు, ఒప్పు చేస్తే రక్షించేవాడు ఉండాలి. జీవుడే సృష్టించేవాడంటే, పని తానే సృష్టించి, దాని ఫలితాన్నీ తానే పొందుతాడా? అంటే తప్పు తానే చేసి తనను తానే కారాగారములో పెట్టుకుంటాడా? అంటే ఒక యజ్ఞ్యపతి ఉన్నాడు.
యజ్ఞ్యం అంటే కర్మ, యజ్ఞ్యము చేసేవాడు కర్త, చేయించే వాడు పరమాత్మ. ఒక శాసకుడూ ప్రభువూ, రక్షకుడూ ఉన్నాడు. పాపము చేస్తే ఒక లోకానికీ పుణ్యము చేస్తే ఒక లోకానికీ పముపుతాడు. కర్మా కర్తా శాసకుడూ ఉన్నారు. ఈ ప్రకృతినీ జీవాత్మనూ పరమాత్మ తన ఇష్టానుపూర్వముగా నడిపిస్తున్నాడు. చిత్ర విచిత్రములైన లోకములూ దేహములూ పనులూ, ఈ మూడూ ఉన్నాయంటే ఇవి మనకు మనముగా చేసుకునేవి కావు. ఎవరి మటుకూ వాడు కష్టపడేవాటిని సృష్టించుకోడు. దొంగా, కారాగారం, కారాగారములో వేసేవాడు ఈ ముగ్గురూ వేరు. మనకు ఇష్టము లేకుండా మనం బాధపడే లోకాలు ఉన్నాయి, మనను బాధపెట్టే పనులూ ఉన్నాయి. అంటే ఇది ఎవరి పని? ఎవరికి వారు వారిని వారు బాధించుకోడూ, శిక్షించుకోడూ కాబట్టి అవి ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. సృష్టించింది మానవుడే అయి ఉంటే ఎవరికీ రోగాలు రావు. అందుకే యజమాని ఒకడు ఉన్నాడు. కర్మ (యజ్ఞ్యము) ఉంది. 
అందుకే పరమాత్మ ఉన్నాడు. ఎటువంటి సందేహము లేదు. భూలోకములో హిమాలయాది ప్రాంతాలూ ఉన్నాయి, నీటి చుక్కలు లేని ఎడారులూ ఉన్నాయి. అన్ని ప్రాంతాలు ఒకలా ఎందుకు లేవు. అలాగే పరలోకాలలో కూడా యమలోకం వరుణ లోకం పితృలోకం అని ఉన్నాయి. కర్మలను బట్టి ఆయా కర్మలను ఆచరించిన వారికి ఆయా లోకాలను పంపడానికి ఆ లోకాలు సృష్టించబడ్డాయి. పరమాత్మ ఉన్నాడు అనడానికి ఒక ప్రమాణం ప్రకృతే. కర్తా కారయితా, చేసే వాడు చేయించేవాడూ చేసే పనీ  పనికి ఫలితం, - ఈ నాలుగు ఒక తీరుగా ఉండవు. తర్క మీమాన్స (జైన) కార్తాంతికులనూ పృధువు ఈ విధముగా

Popular Posts