Followers

Tuesday 25 March 2014

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం నాలగవ అధ్యాయం

.

శ్రీనారద ఉవాచ
ఏవం వృతః శతధృతిర్హిరణ్యకశిపోరథ
ప్రాదాత్తత్తపసా ప్రీతో వరాంస్తస్య సుదుర్లభాన్

శ్రీబ్రహ్మోవాచ
తాతేమే దుర్లభాః పుంసాం యాన్వృణీషే వరాన్మమ
తథాపి వితరామ్యఙ్గ వరాన్యద్యపి దుర్లభాన్

దుర్లభుములైనా ఆ వరాలను బ్రహ్మ ఇచ్చాడు. ఇచ్చి, నీవడిగినవి లోకములో ఎవరికీ లభించేవి కావు. అయినా నీ తపస్సుకు మెచ్చి ఇస్తున్నాను. ఇలా వరములిచ్చి బ్రహ్మగారు ప్రజాపతులతో హిరణ్యకశిపులతో స్తోత్రం చేయబడి అంతర్థానం చెందాడు. 

తతో జగామ భగవానమోఘానుగ్రహో విభుః
పూజితోऽసురవర్యేణ స్తూయమానః ప్రజేశ్వరైః

ఏవం లబ్ధవరో దైత్యో బిభ్రద్ధేమమయం వపుః
భగవత్యకరోద్ద్వేషం భ్రాతుర్వధమనుస్మరన్

బ్రహ్మ వలన వరమును పొంది, అది తలచుకొని బ్రహ్మను సృష్టించిన పరమాత్మ  యందు వైరాన్ని పొందాడు. 
అన్ని లోకములనూ దిక్కూనూ గెలిచాడు. దేవ దానవ యక్ష కిన్నెర గరుడ భూత ప్రేత పిశాచాలనూ సకల ప్రాణులనూ తన వశములో ఉంచుకుని ప్రపంచాన్ని గెలిచినవాడయ్యాడు. సకల్ అ లోఖలపాలకుల స్థానాన్ని ఆక్రమించాడు తన తేజస్సుతో స్వర్గానికి వెళ్ళి ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. మహేంద్ర భవనాన్ని అధిష్ఠించి. పగడములతో సోపానములు గల మరకత మణులతో  నేలలు గల స్ఫటికమణులతో ఉన్న గోడలు ఉన్న మహేంద్ర భవనము, పాల నురుగు లాంటి శయ్యలూ, ఘల్లు ఘల్లు మనే శబ్దం చేసే అందెలు గల దేవతా వనితలు గలది ఆ భవనం. ఆ మహేంద్ర భవనములో అన్ని లోకాలనూ గెలిచి ఏక రాజు ఆయాడు

స విజిత్య దిశః సర్వా లోకాంశ్చ త్రీన్మహాసురః
దేవాసురమనుష్యేన్ద్ర గన్ధర్వగరుడోరగాన్

సిద్ధచారణవిద్యాధ్రానృషీన్పితృపతీన్మనూన్
యక్షరక్షఃపిశాచేశాన్ప్రేతభూతపతీనపి

సర్వసత్త్వపతీన్జిత్వా వశమానీయ విశ్వజిత్
జహార లోకపాలానాం స్థానాని సహ తేజసా

దేవోద్యానశ్రియా జుష్టమధ్యాస్తే స్మ త్రిపిష్టపమ్
మహేన్ద్రభవనం సాక్షాన్నిర్మితం విశ్వకర్మణా
త్రైలోక్యలక్ష్మ్యాయతనమధ్యువాసాఖిలర్ద్ధిమత్

యత్ర విద్రుమసోపానా మహామారకతా భువః
యత్ర స్ఫాటికకుడ్యాని వైదూర్యస్తమ్భపఙ్క్తయః

యత్ర చిత్రవితానాని పద్మరాగాసనాని చ
పయఃఫేననిభాః శయ్యా ముక్తాదామపరిచ్ఛదాః

కూజద్భిర్నూపురైర్దేవ్యః శబ్దయన్త్య ఇతస్తతః
రత్నస్థలీషు పశ్యన్తి సుదతీః సున్దరం ముఖమ్

తస్మిన్మహేన్ద్రభవనే మహాబలో మహామనా నిర్జితలోక ఏకరాట్
రేమేऽభివన్ద్యాఙ్ఘ్రియుగః సురాదిభిః ప్రతాపితైరూర్జితచణ్డశాసనః

తమఙ్గ మత్తం మధునోరుగన్ధినా వివృత్తతామ్రాక్షమశేషధిష్ణ్యపాః
ఉపాసతోపాయనపాణిభిర్వినా త్రిభిస్తపోయోగబలౌజసాం పదమ్

జగుర్మహేన్ద్రాసనమోజసా స్థితం విశ్వావసుస్తుమ్బురురస్మదాదయః
గన్ధర్వసిద్ధా ఋషయోऽస్తువన్ముహుర్విద్యాధరాశ్చాప్సరసశ్చ పాణ్డవ

స ఏవ వర్ణాశ్రమిభిః క్రతుభిర్భూరిదక్షిణైః
ఇజ్యమానో హవిర్భాగానగ్రహీత్స్వేన తేజసా

అలాంటి అత్యుత్తమమైన మహేంద్ర భవనములో ఏకచత్రాధిపతి అయిన దేవతలందరి చేతా నమస్కరిచబడుతూ దేవ సింహాసనం మీద కూర్చుని మహా సుగంధం గల మద్యపానముతో మదించి కన్నులు ఎర్రబారగా, కళ్ళు తిరుగుతూ ఉన్న హిరణ్యకశిపున్ని అన్ని లోకపాలకులూ కానుకలు తెచ్చి నమస్కరిస్తూ ఉంటారు.  

అకృష్టపచ్యా తస్యాసీత్సప్తద్వీపవతీ మహీ
తథా కామదుఘా గావో నానాశ్చర్యపదం నభః

రత్నాకరాశ్చ రత్నౌఘాంస్తత్పత్న్యశ్చోహురూర్మిభిః
క్షారసీధుఘృతక్షౌద్ర దధిక్షీరామృతోదకాః

శైలా ద్రోణీభిరాక్రీడం సర్వర్తుషు గుణాన్ద్రుమాః
దధార లోకపాలానామేక ఏవ పృథగ్గుణాన్

స ఇత్థం నిర్జితకకుబేకరాడ్విషయాన్ప్రియాన్
యథోపజోషం భుఞ్జానో నాతృప్యదజితేన్ద్రియః

నేనూ (నారదుడు) తుంబురుడూ ఆయనను కీర్తిచాము. గంధర్వ విద్యాధర అప్సరసలూ స్తోత్రం చేసారు. యజ్ఞ్యములతో దక్షిణలతో అతన్నే ఆరాధించారు. అతని తేజస్సుతో అగ్నిలో వేసిన ఆహుతులు కూడా తనే స్వీకరించాడు. ఏడు ద్వీపాలున్న భూమి దున్నకుండానే పంటను ఇచ్చింది. ఆకాశములో ఆశ్చర్యాలకు హద్దే లేదు. సముద్రములన్నీ రత్నముల రాశులను వారి భార్యల చేత తీసుకుని వచ్చి అతనికి ఇచ్చాయి. అలాగే పర్వతాలు కూడా అన్ని కానుకలూ ఇస్తున్నాయి. అష్ట దిగ్పాలకుల గుణములను ఒక్కడే స్వీకరించాడు. ఇంద్రియ జయం లేని వాడై ఎన్ని వచ్చినా తృప్తి పొందలేకపోయాడు

ఏవమైశ్వర్యమత్తస్య దృప్తస్యోచ్ఛాస్త్రవర్తినః
కాలో మహాన్వ్యతీయాయ బ్రహ్మశాపముపేయుషః

తస్యోగ్రదణ్డసంవిగ్నాః సర్వే లోకాః సపాలకాః
అన్యత్రాలబ్ధశరణాః శరణం యయురచ్యుతమ్

తస్యై నమోऽస్తు కాష్ఠాయై యత్రాత్మా హరిరీశ్వరః
యద్గత్వా న నివర్తన్తే శాన్తాః సన్న్యాసినోऽమలాః

ఇతి తే సంయతాత్మానః సమాహితధియోऽమలాః
ఉపతస్థుర్హృషీకేశం వినిద్రా వాయుభోజనాః

ఐశ్వర్యముతో మదించి బాగా గర్వం వచ్చి, శాస్త్రాన్ని ఉల్లంఘించాడు. ఇలా చాలా కాలమ గడిచింది. బ్రహ్మ వరమును పొంది గర్వించిన ఇతనికి బ్రాహ్మణ శాపం తగ్లింది. తని ఉగ్ర దండానికి కలత చెందిన ఋషులూ దేవతలు పరమాత్మ ఉన్న దిక్కుకు నమస్కరించి, పరమపద వాసికి నమస్కరించి, మనసునూ బుద్ధినీ ఏకాగ్రం చేసుకుని పరిశుద్ధులై హృషీకేశున్ని స్తోత్రం చేసారు.అప్పుడు వారికి రూపం లేని వాక్కు వినిపించింది.మేఘ గంభీర స్వనముతో, సజ్జనులకు అభయాన్ని ప్రసాదించే వాక్కు వినపడింది.

తేషామావిరభూద్వాణీ అరూపా మేఘనిఃస్వనా
సన్నాదయన్తీ కకుభః సాధూనామభయఙ్కరీ

మా భైష్ట విబుధశ్రేష్ఠాః సర్వేషాం భద్రమస్తు వః
మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే

దేవోత్తములారా భయపడవలదు మీకు అన్ని దిక్కులా శుభమే కలుగుతుంది. నా దర్శనమైతే వెంటనే శ్రేయస్సు చేకూరుతుంది. రాక్షసాధముడి యొక్క దౌర్జన్యం తెలుసు. దానికి నేను శాంతిని చేస్తాను. కొంత కాలం ఎదురు చూడండి.

జ్ఞాతమేతస్య దౌరాత్మ్యం దైతేయాపసదస్య యత్
తస్య శాన్తిం కరిష్యామి కాలం తావత్ప్రతీక్షత

యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు
ధర్మే మయి చ విద్వేషః స వా ఆశు వినశ్యతి

దేవతల యందు గోవుల యందు సాధువుల యందు బ్రాహ్మణుల యందు ధర్మము యందు చివరకు నాయందూ ఎప్పుడైతే వ్యతిరేకముగా ప్రవర్తిస్తాడో అప్పుడు వాడే అంతమొందుతాడు  

నిర్వైరాయ ప్రశాన్తాయ స్వసుతాయ మహాత్మనే
ప్రహ్రాదాయ యదా ద్రుహ్యేద్ధనిష్యేऽపి వరోర్జితమ్

తన కొడుకుని ద్వేషించడముతో వాడి నాశం మొదలవుతుంది, ఎవ్వరినీ ద్వేషించనీ, ప్రశాంత చిత్తుడూ, తన సొంతకొడుకైన, మహాత్ముడైన, ప్రహ్లాదునికి ద్రోహం చేసినప్పుడు ఎన్ని వరాలున్నా సరే నేను చంపుతాను.

శ్రీనారద ఉవాచ
ఇత్యుక్తా లోకగురుణా తం ప్రణమ్య దివౌకసః
న్యవర్తన్త గతోద్వేగా మేనిరే చాసురం హతమ్

ఇలా పరమాత్మ చేత చెప్పబడి కలత తొలగిన దేవతలు తిరిగి వెళ్ళారు.అలాంటి హిరణ్య కశిపునికి నలుగురు కుమారులు కలిగారు. 

తస్య దైత్యపతేః పుత్రాశ్చత్వారః పరమాద్భుతాః
ప్రహ్రాదోऽభూన్మహాంస్తేషాం గుణైర్మహదుపాసకః

బ్రహ్మణ్యః శీలసమ్పన్నః సత్యసన్ధో జితేన్ద్రియః
ఆత్మవత్సర్వభూతానామేకప్రియసుహృత్తమః

దాసవత్సన్నతార్యాఙ్ఘ్రిః పితృవద్దీనవత్సలః
భ్రాతృవత్సదృశే స్నిగ్ధో గురుష్వీశ్వరభావనః
విద్యార్థరూపజన్మాఢ్యో మానస్తమ్భవివర్జితః

అందులో ప్రహ్లాదుడు గొప్పవారి చేత ఉపాసించబడే వాడు
బ్రాహ్మణ భక్తి కలవాడు, అందరినీ తనలాగ చూచే వాడు, ఇంద్రియ జయం కలవాడు, పెద్దలకు దాసుడిలా నమస్కరించేవాడు, ఆడిన మాట తప్పని వాడు, దీనులను తండ్రిలా ప్రేమించేవాడు, తన తోటివారిని సోదరుల్లా చూచేవాడు, పెద్దల గురువుల యందు పరమాత్మ భావన కలవాడు, విద్యా సౌందర్యమూ కులమూ ధనముతో శొభించేవాడు

నోద్విగ్నచిత్తో వ్యసనేషు నిఃస్పృహః శ్రుతేషు దృష్టేషు గుణేష్వవస్తుదృక్
దాన్తేన్ద్రియప్రాణశరీరధీః సదా ప్రశాన్తకామో రహితాసురోऽసురః

అన్నీ ఉన్నా అభిమానం ధంభం లేని వాడు. ఎన్ని రకముల బాధలు వచ్చినా కలత చెందని వాడు. వినబడేవీ కనపడేవీ ఏవీ వాస్తవాలు కావు అనుకొనేవాడు. ఇంద్రియమునూ ప్రాణమును మనసునూ బుద్ధినీ నియమించుకున్నవాడు. జాతి రీత్యా అసురుడైనా ఆసురీ గుణములు లేని వాడు

యస్మిన్మహద్గుణా రాజన్గృహ్యన్తే కవిభిర్ముహుః
న తేऽధునా పిధీయన్తే యథా భగవతీశ్వరే

ప్రహ్లాదునిలో ఉన్న గుణములను దేవలోకములో దేవతలు శత్రువు పుత్రుడైన భావాన్ని మరచిపోయి స్తోత్రం చేస్తారు. పరమాత్మ యందు ఎలా గుణాలు ఉన్నాయో ప్రహ్లాదుని యందు కూడా అలాంటి గుణాలే ఉన్నాయి.

యం సాధుగాథాసదసి రిపవోऽపి సురా నృప
ప్రతిమానం ప్రకుర్వన్తి కిముతాన్యే భవాదృశాః

శత్రువులు(దేవతలు) కూడా సద్గుణములకు పోలికగా ప్రహ్లాదుని చెబుతారు. అతని గుణములతో అతని మాహాత్మ్యం ప్రకటించబడుతుంది.

గుణైరలమసఙ్ఖ్యేయైర్మాహాత్మ్యం తస్య సూచ్యతే
వాసుదేవే భగవతి యస్య నైసర్గికీ రతిః

పరమాత్మ యందు సహజ సిద్ధమైన భక్తి అతనిలో ఉంది . తమకు తాముగా అన్ని గుణాలూ వచ్చి చేరాయి

న్యస్తక్రీడనకో బాలో జడవత్తన్మనస్తయా
కృష్ణగ్రహగృహీతాత్మా న వేద జగదీదృశమ్

పరమాత్మ యందు భక్తి కలిగి ఉండటముతో పిల్లవారు ఆడుకొనే ఆటలు కూడా మానేశాడు. జడుడిలాగ నిరంతరం పరమాత్మ యందే మనసు లగ్నం చేసి ఉంటాడు. కృష్ణుడనే ఒక గ్రహం అతన్ని పట్టింది. అతనికి ప్రపంచమంటే అస్సలు తెలీదు.  

ఆసీనః పర్యటన్నశ్నన్శయానః ప్రపిబన్బ్రువన్
నానుసన్ధత్త ఏతాని గోవిన్దపరిరమ్భితః

పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ
లా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుడేతద్విస్వమున్ భూవరా

క్వచిద్రుదతి వైకుణ్ఠ చిన్తాశబలచేతనః
క్వచిద్ధసతి తచ్చిన్తా హ్లాద ఉద్గాయతి క్వచిత్

అతని యందే మనసు లగ్నం చేసుకుని ఉంటాడు ఒక చోట.ఒక చోట అతని గుణాలను గానం చేస్తాడు, అరుస్తాడు, సిగ్గు విడిచి నాట్యం చేస్తాడు, 

నదతి క్వచిదుత్కణ్ఠో విలజ్జో నృత్యతి క్వచిత్
క్వచిత్తద్భావనాయుక్తస్తన్మయోऽనుచకార హ

క్వచిదుత్పులకస్తూష్ణీమాస్తే సంస్పర్శనిర్వృతః
అస్పన్దప్రణయానన్ద సలిలామీలితేక్షణః

స ఉత్తమశ్లోకపదారవిన్దయోర్నిషేవయాకిఞ్చనసఙ్గలబ్ధయా
తన్వన్పరాం నిర్వృతిమాత్మనో ముహుర్దుఃసఙ్గదీనస్య మనః శమం వ్యధాత్

అతనికి భాగవత సంగతితో కలిగిన భక్తితో ఇలా ప్రహ్లాదుడు పరమాత్మ యొక్క పాదపద్మముల సేవలో మునిగిపోయాడు. ప్రపంచములో ఎవ్వరూ పొందనంత తృప్తిని పొందాడు. దుర్జనుల సంగం వలన మనసు పొందిన దైన్యాన్ని తొలగించుకున్నవాడయ్యాడు. 

తస్మిన్మహాభాగవతే మహాభాగే మహాత్మని
హిరణ్యకశిపూ రాజన్నకరోదఘమాత్మజే

ఇలాంటి పరమభాగవతోత్తముడైన, కన్న కొడుకైన, ప్రహ్లాదుని యందు హిరణ్యకశిపుడు పాపం చేసాడు

శ్రీయుధిష్ఠిర ఉవాచ
దేవర్ష ఏతదిచ్ఛామో వేదితుం తవ సువ్రత
యదాత్మజాయ శుద్ధాయ పితాదాత్సాధవే హ్యఘమ్

పుత్రాన్విప్రతికూలాన్స్వాన్పితరః పుత్రవత్సలాః
ఉపాలభన్తే శిక్షార్థం నైవాఘమపరో యథా

ఇంత గొప్పవాడైన కుమారుని విషయములో పరిశుద్ధుడు పరమసాధువైన ప్రహ్లాదుని యందు తండ్రి ఇంత పాపం చేసాడు. సొంత కొడుకు తప్పు చేస్తే దారికి తెచ్చుకుంటారు కదా ప్రపంచములో. ఎవరిమీదైనా ప్రేమలేకుండా ఉండవచ్చు గానీ కన్న కొడుకు మీద ప్రేమలేకుండా ఉంటారా. మంచి దారిలోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తారు గానీ, శత్రువులాగ వధ చేయాలని అనుకోరు కదా

కిముతానువశాన్సాధూంస్తాదృశాన్గురుదేవతాన్
ఏతత్కౌతూహలం బ్రహ్మన్నస్మాకం విధమ ప్రభో
పితుః పుత్రాయ యద్ద్వేషో మరణాయ ప్రయోజితః

దుష్టులైనా దారికి తెస్తారే,పరమాత్మని దైవముగా భావించే వారిని ఇలా చేయడానికి గల కారణమేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. కొడుకు మీద తండ్రికున్న ద్వేషం తండ్రి మరణానికి కారణయ్యింది కదా? ఎందుకిలా జరిగింది అని ధర్మరాజు నారదున్ని అడిగాడు

Popular Posts