Followers

Saturday 22 March 2014

అంతరిక్షము యొక్క సంక్షేప వర్ణనం


భూమికి పైనా కిందా ఉండే లోకాల మధ్య ఉన్నదానిని అంతరిక్షం అంటారు. భూః భువః సువః లోకాలని ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు తిరుగుతూ ఉండడములోనే ఉత్తరాయాణ దక్షిణం విశువత్ (రాత్రి పగల్లు సమానముగా ఉండటం). చుట్టూ ఉండే వాటిని పన్నెండు భాగాలుగా విడదీసి పన్నెండు రాశులుగా చేసి. మేషములో సూర్యుడు ప్రవేశించి మకరములోకి రావడానికి మధ్యలో తులలోకి వస్తాడు. అలా తులలోకి వచ్చినపుడు రాత్రి పగల్లు సమానముగా ఉంటాడు. మేషమునుంచి సూర్యుడు మిథునము ... కన్యా రాశిలోకి వచ్చేసరికి రాత్రి తరుగుతుంది. తులనుంచి వృశ్చుకములో ప్రవేశించేసరికి దక్షిణాయనం, రాత్రి ఎక్కువ ఉంటుంది.
మానసోత్తరపర్వతము తూర్పు వైపు ఇంద్రుని పట్టణం రాజధాని, దక్షిణం వైపు యముడు, ఉత్తరం వైపు కుబేరుడు పడమర వైపు వరుణుడు. సూర్య ప్రవృత్తి బట్టి ఉదయం మధ్యాన్నం రాత్రీ అంటున్నము. ఎక్కడ బయటకు సూర్యుడు కనిపిస్తాడో, అక్కడ ఒక తాడు పెట్టి కొలిస్తే, అవతలి వైపు ఉండే చోట సూర్యుడు అస్తమిస్తాడు. ఏక రేఖ మీద ఉదయాస్తమాలు జరుగుతాయి. పదిహేను ఘడియలకొక ఝాము. పడమటికి వెళ్ళినపుడు సూర్యుడు కనపడకుండా పోతాడు. ఈ చుట్టూ ఉన్న గ్రహమండలం ముప్పైనాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు తిరుగుతుంది.
ఈ సూర్యుని రథమే కాల చక్రం, ఏడు గుఱ్ఱాలు. దానికి పన్నెండు అరలు (రేకులు) ఉన్నాయి. పన్నెండు మాసాలు. ఆరు నేములున్నాయి. ఆరు ఋతువులు. మూడు నాభులు (వేసవి వర్ష శీతా కాలాలు) సూర్యుడు నడిచే యంత్రము ఎప్పుడూ ఆగకుండా తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు నడుస్తూ ఉంటే అరుణుడు (అందుకే సూర్యుడు ఉదయించినా అస్తమించినా ఎర్రదనం వస్తుంది) వాలఖిల్యులు సూర్య సూక్తాన్ని చదువుతూ ఉంటారు. దేవతలూ యక్షులూ నాగులూ గుంపులుగా ఉండి సూర్యుని ఉపాసన చేస్తూ ఉంటారు. సూర్యునికి మేరువూ ద్రువునికీ ప్రదక్షిణం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. రాశులు వాటికి వ్యతిరేక దిశలో అప్రదక్షిణముగా తిరుగుతూ ఉంటాయి. కుడి నుంచి ఎడమకొస్తాయి.
చక్రముతోబాటే అక్కడ ఉన్న గ్రహములు తిరుగుతూ ఉంటాయి. కుమ్మరి కుండ మీద ఈగ వాలితే కుండతో బాటు తిరుగుతూ ఉంటాయి.
పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రములో ఉంటే చైత్రం. విశాఖ నక్షత్రములో పూర్ణిమనాడు ఉంటే- వైశాఖ, జ్యేష్ట - జ్యేష్ఠా, ఉత్తరా/పూర్వాషాడ నక్షత్రం - ఆషాడ మాసం, ఉత్తరా/పూర్వా భాద్ర - భాద్రపద మాసం, అశ్వినీ నక్షత్రములో పూర్ణిమ నాడు ఉంటే- ఆశ్వియుజ మాసం, కృతిక నక్షత్రములో పూర్ణిమనాడు ఉంటే - కార్తీక మాసం, మృగశీర్ష - మార్గశీర్ష, పుష్య - పుష్య, మఖ - మాఘ, ఫాల్గుణీ నక్షత్రం - పాల్గుణ మాసం.
ఒక సారి ఈ చక్రమంతా తిరిగ్తే ఒక సంవత్సరం. చద్రుని చుట్టూ తిరిగితే పరివత్సరం, బృహస్పతి చుట్టూ తిరిగ్తే ఇడావత్సరం, నక్షత్రాల చుట్టూ తిరిగితే - విద్వత్సరం.
చంద్రుడు సూర్యమండలానికి పైన ఉన్నాడు. అది లక్ష యోజనాల పైన ఉన్నది. వెన్నెల నిండిన పక్షములో దేవతలకూ వెన్నెల క్షీణించే పక్షం పితృదేవతలకు ప్రీతి. ముప్పై ముహూర్తాలు ఒక నక్షత్రం తిరుగుతుంది. దేవతలకూ పితృదేవతలకూ మనుష్యులకూ లతలకూ పక్షులకూ అన్నిటికీ పోషణాన్ని అందిస్తాడు.
చంద్రునికి చుట్టూ మూడు లక్షల యోజనాల మేర ఇరవై ఏడు నక్షత్రాలు. అభిజిత్ అనేది ఇర్వై ఎనిమిదవ నక్షత్రం. ఆకడే శుక్రుడూ, బుధుడూ ఉన్నాడు. దాని పైన కుజుడు (అంగారకుడు) బృహస్పతీ శనీ ఇలా అందరూ ఒకరికన్నా ఒకరు రెండు లక్షల యోజనాల దూరములో ఉంటారు.
పదకొండు లక్షల యోజనల పైన భగవానుని పరమపదమున్నదని అంటారు.

మేడీ స్తంభం - పశువులను కట్టే ఒక కర్ర. అలాగే ఈ మండలాలన్నీ ద్రువునికి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ జ్యోతిర్మండలాలన్నీ శింశుమారమనే రూపములో ఉంటాయి. దాని తోక దగ్గర ద్రువుడు ఉంటాడు. దాని వెనక ప్రజాపతీ అగ్ని ఇంద్రుడు ధర్మ. కటి యందు సప్తర్షులు. వంగిన శరీరం దగ్గర నక్షత్రాలు.సర్వ గ్రహమండలములూ మృగాకారములో ఉన్నారు. ఇది భగవంతుని సర్వదేవతా మయమైన రూపము. మనకు వెలుగునిచ్చేవాడు ఆధారముగా ఉన్నవాడు సూర్యభగవానుడు. ఆయనకు నమస్కార్మ్ చేస్తే ఆయనలో ఉన్న నారాయణునికి నమస్కారం చేసినట్లు.

రాహువూ కేతువూ సూర్యమండలం కిందన ఉంటాడు. సూర్యుని కాంతి వ్యాపిస్తున్న తరువాత రాహువు ఉంటాడు. సూర్య చంద్ర మండలానికి కిందన రాహువు ఉంటాడు. కాని అక్కడ స్వామి చక్రం ఉండటం వలన ఎక్కువ సేపు ఉండలేడు.  ఈ వరుసలో నక్షత్ర - గ్రహ - చంద్ర - సూర్య - సిద్ధ చారణులు ఉండే లోకాలు - యక్ష రాక్షస పిశాచాలు ఉండేవి - భూమి.
అలాగే కింద ఏడు లోకాలున్నాయి. స్వర్గాది విహారాలు అనుభవించిన తరువాత మాయ చేత ఆవరించబడిన వారు భూమి కిందలోకాలలో వస్తారు. అక్కడ ఇంద్రియాలకు ఆనందం కలిగించే సన్నివేశాలూ, చెట్లూ, నదులూ ఉంటాయి.కంటికీ మనసుకీ ఉత్సవం కలిగించే కాంతులు.
అక్కడ ఒక పాము ఉంటుంది. అంతా చీకటిగా ఉన్నా, పాముల తల మీద మణుల వలన అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ దివ్య ఔషధులూ రసాయనాలు ఉంటాయి. అక్కడ రోగాలూ ముసలితనం చెమటా ఏమీ ఉండవు.
వారికి చావు అనేది ఎప్పుడొస్తుందో తెలియదు. భగవానుని చక్రం మాత్రమే వారిని వధిస్తుంది. అక్కడ వారికి భయం వలనే పురుడు వస్తుంది. అతలం అనేది మీద లోకం. అక్కడ మయుడి కొడుకు బలుడు ఉంటాడు. అతడు మాయను సృష్టించాడు. ఇంద్రజాలాలు అవి ఇక్కడనుంచి వచ్చినవే. ఒకసారి అతను ఆవలిస్తే మూడు రకాలైన అందమైన ఆడవారు వచ్చారు. వారు ముగ్గురే లోకములో విచ్చలవిడిగా తిరిగి, మగవారికంటే ఎక్కువగా తిరిగి, ఎవరిని పడితే వారిని ప్రేమించేవారు కొందరూ, తమ భర్తను విడిచి మిగతావారితో తిర్గేవారు కొందరు. ఈ మూడు జాతులూ పుట్టాయి. స్వైణ్యః కామిన్యః పుంశ్చల్యః అని. వారు ఆలోకములో బంగారం అంటే మోజు. వారు బంగారముతో పురుషులను లోభపెట్టి, వారిని గాఢాలింగనం చేసుకుని ఆనందింపచేస్తూ ఉంటారు. పురుషులు వారిని ఆనందింపచేసి మధాందుడై గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.
దాని కింద వితల లోకములో హాఠకేశ్వరుడు శివుడు ఉంటాడు. భూత గణాలతో పార్వతీ దేవితో ఉంటాడు. హాటకీ నది అక్కడ ఉంటుంది. అక్కడ చిత్రభానువు (అగ్ని) వాయువుతో కలిసి అక్కడ జలాన్ని పానం చేస్తూ ఉండటం వలన అది బంగారం అవుతూ ఉంటుంది.
దానికింద సుతలం అనే లోకం. అక్కడ విలోచనుని కుమారుడు బలి పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన ద్వారం దగ్గర భగవానుడు కాపలా కాస్తూ ఉంటాడు. ఆ బలి చక్రవర్తి భగవంతుని యందు మనసు నిలిపి భగవంతుని నామం చెప్పుకుంటూ పాపం పోగొట్టుకుంటూ ఉంటాడు. ఇది సుతల లోకం. ఇలా ఆయన దాస్యం కావాలనే ప్రహ్లాదుడు కోరుకున్నాడు.
తరువాత తలాతల లోకములో మయుడనే రాక్షసుడు, త్రిపురాసురుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహం చేత అక్కడ ఉండేవారికి మహాసుఖాలు లభిస్తాయి
మహాతలములో ఒక శిరస్సూ అనేక శిరస్సులూ కల పాములుంటాయి. దాని అడుగున రసాతలం ఉంటుంది. అక్కడి వారు భగవంతుని ప్రేమించిన వారిని ద్వేషిస్తారు. దాని కింద పాతాళం ఉంది. అక్కడ నాగాధిపతులు ఉంటారు.
అట్టడుగున మూల దేశములో ముప్పై వేల యోజనాల దూరములో సంకర్షణుడు వేయిపడగలు కలిగి ఉంటాడు. ప్రళయం వచ్చినపుడు ఆయన పదకొండు రుద్రులను బయటకు పంపిస్తాడు. అక్కడ ఉండే నాగములన్నీ స్వామి అనంతుని పాదములకు నమస్కరిస్తూ ఉంటారు. ఆయనను సేవిస్తూ ఉంటారు. లోకాలను మోస్తూ కాపాడుతూ ప్రళయములో ఉపశమిస్తూ ఉంటారు. నారదుడు ఈయనను స్తోత్రం చేస్తూ ఉంటారు.
భూః భువః సువః లోకాల మధ్యనే ఉంటాయి నరకాలు. భూమి కిందన ఉంటాయి. పితృ దేవతలకు అధిపతి యముడు ఉంటాడు. ఆయన తన లోకానికి వచ్చిన వారిని వారి వారి దోషాలకు తగిన శిక్షను అనుభవింపచేస్తూ ఉంటాడు.

Popular Posts