Followers

Friday 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం నాలుగవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం నాలుగవ అధ్యాయం  


వ్యాస ఉవాచ
ఇతి బ్రువాణం సంస్తూయ మునీనాం దీర్ఘసత్రిణామ్
వృద్ధః కులపతిః సూతం బహ్వృచః శౌనకోऽబ్రవీత్

సూతుడు చెప్పినది విన్న శౌనకాదులు సూతున్ని స్తోత్రం చేసి అందరిలోకల్ల వృధ్ధుడైన, కులపతి అయిన, ఋగ్వేద ఆధ్యాయి అయిన శౌనకుడు ఈ విధంగా అడిగాడు.

శౌనక ఉవాచ
సూత సూత మహాభాగ వద నో వదతాం వర
కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాఞ్ఛుకః

చెప్పేవారందరిలో శ్రేష్టుడవైన నీవు మాకు శుకునికి పరీక్షిత్తు యేమని చెప్పాడో అలాగే మాకు వివరించండి

కస్మిన్యుగే ప్రవృత్తేయం స్థానే వా కేన హేతునా
కుతః సఞ్చోదితః కృష్ణః కృతవాన్సంహితాం మునిః

అసలు భాగవతం యే యుగంలో యే ప్రదేశంలో యే కారణం చేత యెవరు ప్రేరేపిస్తే ఈ భాగవత సం హితను చేసాడు. 

తస్య పుత్రో మహాయోగీ సమదృఙ్నిర్వికల్పకః
ఏకాన్తమతిరున్నిద్రో గూఢో మూఢ ఇవేయతే

మహాయోగి అయిన, సమదృక్ అయిన, నిర్వికల్పుడైన (ప్రకృతి మాయకు లొంగనివాడైన) నిరంతరమూ పరమాత్మ యందు లగ్నమైనవాడు, నిద్రను వీడినవాడు (నిద్ర అంటే మాయ. యేమి ఉన్నా తెలీని స్థితి) . రహస్యమైన వాడు, అన్నీ తెలిసికూడా మూఢుడిలా కనపడే శుకుడు

దృష్ట్వానుయాన్తమృషిమాత్మజమప్యనగ్నం దేవ్యో హ్రియా పరిదధుర్న సుతస్య చిత్రమ్
తద్వీక్ష్య పృచ్ఛతి మునౌ జగదుస్తవాస్తి స్త్రీపుమ్భిదా న తు సుతస్య వివిక్తదృష్టేః

వెనుక శుకున్ని పిలుస్తూ వెంట వెళ్తున్న నగ్నంగా లేని వ్యాసుడు, స్నానం చేస్తున్న దేవ కన్యలు వస్త్రంవేసుకుంటే దానికి కారణం అడిగాడు, అప్పుడు వారు 'నీకు ఆడా మగా అనే తేడా తెలుసు. నీ సుతునికి అది తెలీదు '. భేధ దృష్టే సిగ్గుని కలిగిస్తుంది. ఆ భేధం శుకునికి లేదు

కథమాలక్షితః పౌరైః సమ్ప్రాప్తః కురుజాఙ్గలాన్
ఉన్మత్తమూకజడవద్విచరన్గజసాహ్వయే

ఇలాంటి శుకున్ని పౌరులు ఎలా గుర్తుపట్టారు. ఒక పిచ్చివాడిలాగ మూగవాడిలాగ జడుడిలాగ ఉన్న శుకున్ని ఎలా గుర్తుపట్టారు.

కథం వా పాణ్డవేయస్య రాజర్షేర్మునినా సహ
సంవాదః సమభూత్తాత యత్రైషా సాత్వతీ శ్రుతిః

పరీక్షిత్తుకి  ఈయనతో సంవాదం ఎలా జరిగింది. అందులో భాగవతం ఎలా వచ్చింది

స గోదోహనమాత్రం హి గృహేషు గృహమేధినామ్
అవేక్షతే మహాభాగస్తీర్థీకుర్వంస్తదాశ్రమమ్

ఆవుపాలుపిండేంత సేపుకూడా ఉండని శుకుడు, వారి ఇళ్ళల్లోకి కూడా చూడని శుకుడు, ఆయనపాద స్పర్శతోనే తీర్థంకుర్వంతి - ఆ ఆశరమమే తీర్థమవుతుంది. అలాంటి శుకుడు ఒకే చోట ఏడురోజున్నాడంటే ఆయన పుణ్యమేమిటి

అభిమన్యుసుతం సూత ప్రాహుర్భాగవతోత్తమమ్
తస్య జన్మ మహాశ్చర్యం కర్మాణి చ గృణీహి నః

ఈ పరీక్షిత్తు మహాభాగవతోత్తముడని దీని బట్టి అర్థమవుతోంది. పరీక్షిత్తు కధకూడా చెప్పండి.

స సమ్రాట్కస్య వా హేతోః పాణ్డూనాం మానవర్ధనః
ప్రాయోపవిష్టో గఙ్గాయామనాదృత్యాధిరాట్శ్రియమ్

ఈ పరీక్షిత్తు సామ్రాట్. పండవుల గౌరవాని పెంచినవాడు సామ్రాజ్య సంపదను కాదని ఎందుకు ప్రాయోపవేశం చేసాడు.

నమన్తి యత్పాదనికేతమాత్మనః శివాయ హానీయ ధనాని శత్రవః
కథం స వీరః శ్రియమఙ్గ దుస్త్యజాం యువైషతోత్స్రష్టుమహో సహాసుభిః

తమప్రయోజనాలు నెరవేరాలని మిగతారాజులందరూ ఎవరికి వారి ధనాన్ని ఇస్తారో అలాంటి పదవిని
ఈ సంపదను అధికారాన్ని అంత చిన్న వయసులో యవన్నాన్ని, అనుయాయూలను ఎలా వదిలిపెట్టాడు.

శివాయ లోకస్య భవాయ భూతయే య ఉత్తమశ్లోకపరాయణా జనాః
జీవన్తి నాత్మార్థమసౌ పరాశ్రయం ముమోచ నిర్విద్య కుతః కలేవరమ్

తమకోసం బ్రతికేవారు విరక్తితో వదిలిపెట్టొచ్చు గాని రాజులు బ్రతికేది పరోపకరానికీ లోకశుభానికి సంపదకూ కదా. అలాంటివారు తమకోసం తాము జీవించరు. ఆయనున్నది పరాశ్రయానికి. ప్రజలకు ఇవన్నీ కలిగించే శరీరాన్ని విడువకూడదు కదా

తత్సర్వం నః సమాచక్ష్వ పృష్టో యదిహ కిఞ్చన
మన్యే త్వాం విషయే వాచాం స్నాతమన్యత్ర ఛాన్దసాత్

ఇదంతా మాకు చెప్పవలసింది. మీరులాంటి అన్ని విషాయలోనూ స్నాతకులే (తీరం చేరినవారే)

సూత ఉవాచ
ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగపర్యయే
జాతః పరాశరాద్యోగీ వాసవ్యాం కలయా హరేః

మూడవ ద్వాపరయుగంలో (ఎక్కడినుంచి మూడవది? బ్రమ్హసృష్టినుంచి ఇది 28వ ద్వాపరయుగం. భారత భాగవతాలు తయారయ్యినవి 28వ యుగంలో మొదలయ్యాయి. భరతుడినుండీ మనంకాలాన్ని గుణిస్తే ఇది 3వ ద్వాపరయుగం. నాలుగు యుగాలు 72 సార్లు తిరిగితే ఒక మన్వంతరం. మన్వంతరం రీత్య 28వది. 16వ మహాయుగంలో యేర్పడింది రామాయణం. భారతం 28వ మహాయుగం. 62లక్షలు ఒక మహాయుగం. రామాయణానికి భారతానికీ 12 మహాయుగాలు తేడా 62 లక్షలు * 12 సంవత్సరాల తేడా ఉంది ). పరాశర మహర్షి వలన వసు యొక్క కుమార్తే శ్రీమన్నారయుణి అంశతో వ్యాస భగవానుడు జన్మించాడు.

స కదాచిత్సరస్వత్యా ఉపస్పృశ్య జలం శుచిః
వివిక్త ఏక ఆసీన ఉదితే రవిమణ్డలే

సరవతీ నదిలో శుచి అయి ఏకాంత ప్రదేశంలో  కూర్చుని చూస్తే, )

పరావరజ్ఞః స ఋషిః కాలేనావ్యక్తరంహసా
యుగధర్మవ్యతికరం ప్రాప్తం భువి యుగే యుగే

జరిగినది జరగబోయేది తెల్సినవాడు కాబట్టి (పరావర) తెలియశక్యంకాని వేగం కల కాలంలో యుగధర్మం మారుతుండటం చూచాడు (పరమాత్మకూడా కాలచక్రాన్ని వెనక్కు తిప్పడు. )

భౌతికానాం చ భావానాం శక్తిహ్రాసం చ తత్కృతమ్
అశ్రద్దధానాన్నిఃసత్త్వాన్దుర్మేధాన్హ్రసితాయుషః

భౌతికమైన వస్తువులకు శక్తితగ్గిపోవడం చూసి (చెట్టు నీడ, కాయ పరిణామం ) మానవుల శక్తితగ్గడం చూసి, వారు అశ్రధ్ధాళువులు అశక్తిపరులు దుర్భుధ్ధి అల్పాయుస్యులు

దుర్భగాంశ్చ జనాన్వీక్ష్య మునిర్దివ్యేన చక్షుషా
సర్వవర్ణాశ్రమాణాం యద్దధ్యౌ హితమమోఘదృక్

దౌర్భాగ్యులు అయిన జనాలను చూసి దివ్య దృష్టితో చూసి సర్వవర్ణ ఆశ్రమాలవారు ఎలా హితమును పొందుతారో

చాతుర్హోత్రం కర్మ శుద్ధం ప్రజానాం వీక్ష్య వైదికమ్
వ్యదధాద్యజ్ఞసన్తత్యై వేదమేకం చతుర్విధమ్

వైదిక కర్మ ఎలా లోపించకుండా ఉండాలి అని ఒక వేదముగా ఉన్న వేదాన్ని నాలుగుభాగాలుగా చేసాడు

ఋగ్యజుఃసామాథర్వాఖ్యా వేదాశ్చత్వార ఉద్ధృతాః
ఇతిహాసపురాణం చ పఞ్చమో వేద ఉచ్యతే

అయిదవ వేదముగా ఇతిహాస పురాణాలని ఏర్పాటుచేసాడు

తత్రర్గ్వేదధరః పైలః సామగో జైమినిః కవిః
వైశమ్పాయన ఏవైకో నిష్ణాతో యజుషాముత

పైల జైమిన వైశంపాయ్నునికి ఋగ్ యజుర్ సామ వేదాలను

అథర్వాఙ్గిరసామాసీత్సుమన్తుర్దారుణో మునిః
ఇతిహాసపురాణానాం పితా మే రోమహర్షణః

అంగిరసునికి అధర్వణ వేదం. పురాణాలను మా తండ్రి అయిన రోమహర్షుణికి

త ఏత ఋషయో వేదం స్వం స్వం వ్యస్యన్ననేకధా
శిష్యైః ప్రశిష్యైస్తచ్ఛిష్యైర్వేదాస్తే శాఖినోऽభవన్

వేదాలు ఎంతమంది శిష్యులు ఉంటే అన్ని శాఖలుగా మారాయి

త ఏవ వేదా దుర్మేధైర్ధార్యన్తే పురుషైర్యథా
ఏవం చకార భగవాన్వ్యాసః కృపణవత్సలః

తక్కువ బుద్ధి ఉన్నవారు కూడా వేదాలను తెలుసుకోవడానికి ఇలాంటి విభాగాన్ని చేసాడు

స్త్రీశూద్రద్విజబన్ధూనాం త్రయీ న శ్రుతిగోచరా
కర్మశ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ
ఇతి భారతమాఖ్యానం కృపయా మునినా కృతమ్

ఈ వేదాలు స్త్ర్రి శూద్రులకు బ్రహ్మబంధులకి అర్థంకావు కాబట్టి
సంసారాన్ని దాటడానికి ఉత్తమకరంతెలియక అల్లాడుతున్నవారికి దయతో మహాభారతాన్ని ఏర్పాటుచేసాడు

ఏవం ప్రవృత్తస్య సదా భూతానాం శ్రేయసి ద్విజాః
సర్వాత్మకేనాపి యదా నాతుష్యద్ధృదయం తతః

ఇలా వ్యాసభగవానుడు ఇవన్నీ చేసికూడా తృప్తి కలగలేదు.

నాతిప్రసీదద్ధృదయః సరస్వత్యాస్తటే శుచౌ
వితర్కయన్వివిక్తస్థ ఇదం చోవాచ ధర్మవిత్

ధృతవ్రతేన హి మయా ఛన్దాంసి గురవోऽగ్నయః
మానితా నిర్వ్యలీకేన గృహీతం చానుశాసనమ్

భారతవ్యపదేశేన హ్యామ్నాయార్థశ్చ ప్రదర్శితః
దృశ్యతే యత్ర ధర్మాది స్త్రీశూద్రాదిభిరప్యుత

సరస్వతీ నదీ తీరంలో కూర్చిని తర్కించసాగాడు

తథాపి బత మే దైహ్యో హ్యాత్మా చైవాత్మనా విభుః
అసమ్పన్న ఇవాభాతి బ్రహ్మవర్చస్య సత్తమః

ఇన్ని చేసినా ఈ ఆత్మలో పరమాత్మ వచ్చి చేరినట్లు అనిపించలేదు. భగవంతుడు సంతోషించినట్లు లేదు

కిం వా భాగవతా ధర్మా న ప్రాయేణ నిరూపితాః
ప్రియాః పరమహంసానాం త ఏవ హ్యచ్యుతప్రియాః

యతులకు సన్యాసులకు ఇష్టమైన భాగవత ధర్మాలు చెప్పలేదేమొ అనుకున్నాడు

తస్యైవం ఖిలమాత్మానం మన్యమానస్య ఖిద్యతః
కృష్ణస్య నారదోऽభ్యాగాదాశ్రమం ప్రాగుదాహృతమ్

ఇంతచేసి నా మనసుకూ పరమాత్మకూ తృప్తిలేదని బాధ పడుచుండగా నారద మహర్షి ఆ ఆశ్రమానికి వచ్చాడు

తమభిజ్ఞాయ సహసా ప్రత్యుత్థాయాగతం మునిః
పూజయామాస విధివన్నారదం సురపూజితమ్

లేచి ఎదురేగి అథిది మర్యాదలతో పూజించాడు. 

Popular Posts