Followers

Monday 30 September 2013

కృత, త్రేతా, ద్వాపర, కలియుగాల వివరాలు Krita Treta Dvapara Kali Yuga Details

కృత, త్రేతా, ద్వాపర, కలియుగాల వివరాలు
Krita Treta Dvapara Kali Yuga Details
నాలుగు యుగాలను సృష్టించింది, నిర్ణయించింది బ్రహ్మదేవుడు.
ఏ యుగంలో ఎలాంటి వ్యక్తులు ఉండాలో, ఆ యుగం ఇంతకాలం సాగాలో ఆయనే ఏర్పాటు చేశాడు.
కృతయుగం 17,28,000 - ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలా నడిచేది. అందరూ సత్యం మాట్లాడుతూ, నీతిగా ఉండేవారు. కృతయుగం వైశాఖ మాసం సుద్ద తృతీయనాడు ఆరంభమైంది.
త్రేతాయుగం 12,96,000 ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది. మహా సాత్వికురాలు సీతమ్మవారిమీద కూడా అనుమానం కలిగే రోజులు తలెత్తాయి. త్రేతాయుగం కార్తీకమాసం శుద్ద నవమిరోజున ప్రారంభమైంది. శ్రీరాముడు ధర్మపాలన చేశాడు.
ద్వాపరయుగం 8,64,000 ఈ యుగం శ్రావణమాసం శుద్ధ త్రయోదశినాడు ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు పరిపాలించాడు. త్రేతాయుగంలో ధర్మం రెండు పాదాలమీద నడవడం మొదలైంది. శ్రీకృష్ణుని మీద సిట అపవాదులు మోపే స్థితికి వచ్చారు.
కలియుగం 4,32,000 ఈ యుగం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఆరంభమైంది. కలియుగం వచ్చేసరికి ధర్మం పూర్తిగా అంతరించి ఒంటి కాలిమీద కుంటుతూ నడుస్తోంది. ఇప్పుడు మనం కలియుగం ప్రధమపాదంలో ఉన్నాం. ఒక్కో పాదం లక్షా ఎనిమిది వేల సంవత్సరాలు కనుక ఇంకా మూడున్నర లక్షల వరకూ ఈ విశ్వం అంతరించే ప్రశ్నే లేదు. కాకపోతే వినాశకాలం కనుక ప్రకృతి వైపరీత్యాలు వచ్చిపడుతుంటాయి. ప్రజల్లో కక్షలు, కార్పణ్యాలు ప్రబలుతాయి. ఒకర్నొకరు ద్వేషించుకుంటారు. తన్నుకుంటారు. చంపుకుంటారు. చిట్టచివరికి సృష్టి అంతరిస్తుంది.


Popular Posts