Followers

Sunday 29 September 2013

ప్రార్థన యొక్క పరమార్థం


మనవులు వేరువేరు ఉద్దేశములతో, ఆశయములతో దైవ  ప్రార్థన చేస్తుంటారు. శ్రీ కౄష్ణ భగవానుడు భగవద్గీతలో భక్తులను నాలుగు విధాలుగా పేర్కొన్నాడు. మొదటి రకం భక్తుని ఆర్త అని పిలుస్తారు. ఈ వ్యక్తి తను కష్టములలోనున్నపుడు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నపుడు భగవంతుని జ్ణ్జాపకము తెచ్చుకొనును. పరిస్థితులు తనుకు అనుకూలముగానున్నపుడు దానికంతకు కారణము తనే అని భావించును. రెండవ రకము భక్తుని ఆర్దార్థి అంటారు. ఇతడు ఆధ్యాత్మిక చింతన కలిగి తన జీవితము మీద భగవంతుడు దయచూపుతున్నడన్న విషయమును గ్రహించియుండును. కాని, ఇతదు తన స్వప్రయోజనము ఆశించే దైవప్రార్థన చేయును.

ఆర్థార్థి దౄష్టి ఎప్పుడు ఇహసుఖములమీద, భౌతిక సంపదలమీదే ఉండును. ఆర్త భక్తుని వలె ఆర్థార్థి భక్తుడు కూడా కష్టములనుండి విముక్తి కలిగించుటకే దైవప్రార్థన చేయును. మూడవ రకము భక్తుని జిజ్ణ్జాసుడంటారు. ఇతడు మోక్షమును పొందుటకు, జీవితము లోని అశుభములను పారద్రోలుటకు జ్ణ్జాన సంపాదన చేయును. మోక్షము సంపాదించుట అందరి జీవితాశయమైనప్పటికి, ఒక్క జిజ్ణ్జాసు మాత్రమే జ్ణ్జాన సంపాదన వలనే మోక్షము లభించునన్న సత్యము గ్రహించి దానికై పాటుపడును. అతని ప్రార్థన – జ్ణ్జానము సంపాదించుటకు కావలసిన బుద్ధికుశలత, మనోవికాసము తనకు కలుగచేయమని వెడుకొనుత. నాలుగవ రకం భక్తుడు జ్ణ్జాని. ఇతడు తనయందే భగవంతున్నాడని తలచును. తనకు భగవంతుని భేదములేదని తలచును. జ్ణ్జాని చేసే ప్రార్థన  సర్వోత్తమమైనది. అది జ్ణ్జానమును విశదీకరించు సాధన.

Popular Posts