హిందూలు పవిత్రంగా భావించే గ్రంధాలు రామాయణం, భారతం, భాగవతం. ఇవి అన్నీ మానవ మనుగడకి కావలసిన జీవిత నౌకల వంటివి. వాటిలోని ప్రతీ సన్నివేశం క్షుణ్ణంగా పరిశీలిస్తే, నేడు మనకి వస్తున్న అనుభవాలలాగే ఉంటారుు. ఇక అందులో ప్రతి పాత్రా మానవజీవిత పరమార్ధానికి అద్దం పట్టేవే. రామాయణ కాలంలో శ్రీరాముడు, హనుమంతుడు, లక్ష్మణుడు, రావణుడు, గుహుడు ఇత్యాది చరిత్రలన్నీ మనం ఏ విధంగా నడచుకుంటే ధర్మాన్ని నిలబెట్టగలమో సూచించే దిక్సూచులే. అదేవిధంగా మహాభారత కాలంలో ధర్మరాజు, శ్రీకృష్ణూడు, అర్జునుడు, దుర్యోధనుడు మెుదలైన వ్యక్తుల వ్యక్తిత్వాలు కూడా మనల్ని జీవితాంతం నడిపించే జీవగరల్రే. అందుేక, ‘రాముడిలా నడచుకోవాలి, కృష్ణూడిలా మసలుకోవాలి’ అని పెద్దలు చెప్తూవుండేవారు. శ్రీరాముడు మనిషి ఏవిధంగా నడచుకోవాలో ఆ విధంగా తాను ఆచరించి చూపించాడు. శ్రీకృష్ణూడు అన్నిటా తానై ఉంటున్నట్టు కనిపించినా తామరాకు మీద నీటి బిందువులా మసలుకున్నాడు.
అమృత వాక్కులు
రాముని జనన విశేషం...రాముడు అదితి దేవతా నక్షత్రం అయిన పునర్వసు నక్షత్రంలో నవమినాడు ఈ భూమిపై జన్మించాడు. అదే విధంగా రాక్షస రాజైన రావణాసురుడు మఖ నక్షత్రంలో జన్మించాడు. మఖకి, పునర్వసు 3వ నవకంలో 7వ తార అవుతుంది. ఈ 7వ తారని నైధనతార అంటారు. నిధనం అంటే మరణం అని అర్ధం. మరణాన్ని ప్రసాదించడం కోసమే రాముని జననం. అదే రాముని జన్మరహస్యం. ‘దుష్ట శిక్షణ శిష్ట రక్షణ’ చేయడం కోసం అవతరిస్తానని స్వయంగా శ్రీహరి ఇచ్చిన మాటని నెరవేర్చుకునే క్రమంలో రాక్షస బాధల నుంచి లోకాన్ని రక్షించే కార్యక్రమం కోసం, తిరిగి భూమి మీద ధర్మాన్ని నిలపే ప్రయత్నంలో భాగమే రామావతారం. రావణ సంహారం చేసి ఈ భూమి మీద ‘పునర్ వసు’ (సంపద) నిలబెట్టడమే రామావతార లక్ష్యం.
ఇందులోనే శిష్ట రక్షణ కూడా దాగివుంది. ఎలాగంటే, వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు శ్రీహరి పరమ భక్తులు. సప్త ఋషుల వల్ల శాపగ్రస్తులవ్వగా శ్రీహరి తరుణోపాయాన్ని ప్రసాదించాడు. అవి ఏమిటంటే, పరమ భక్తులుగా పుట్టి 7జన్మల తర్వాత తనను కలుసుకోవడం ఒక మార్గం, ఇక రెండవది బద్ధ శత్రువులై శ్రీహరి చేతిలోనే సంహరింపబడి 3 జన్మల్లోనే స్వామి సన్నిధిని చేరుకోవడం. ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకోమని శ్రీహరి అడగగా, శ్రీహరిని విడిచి 7జన్మలు గడపటం అసాధ్యంగా భావించిన జయవిజయులు, ‘స్వామీ మేము తమకు బద్ధ విరోధులమై 3జన్మల్లోనే తిరిగి మీ వద్దకు వచ్చేటట్టు వరాన్ని ప్రసాదించు’ అని వేడుకున్నారు. శిష్టులైన వీరికి శాప విమోచనాన్ని కలిగించి రక్షించడం తన కర్తవ్యం.
ఆ కాలంలోనే శ్రీరాముడు జాతి, కుల వివక్షలేకుండా స్నేహ ధర్మాన్ని పాటించి విశ్వసౌభ్రాతృత్వం కనబరచిన మాన్యుడు శ్రీరామచంద్రుడు. అందుకు ఉదాహరణ, తనకన్నా తక్కువ స్థితిలో ఉన్న గుహుడ్ని ప్రేమతో అక్కున చేర్చుకుని కులం అంటే మనవత్వం అని చాటిచెప్పిన గొప్ప మానవతావాది శ్రీరాముడు. పక్షి జాతి అయిన జటాయువుని పట్ల కృతజ్ఞతా భావంతో అంత్యక్రియలు కూడా చేసి సద్గతుల్ని ప్రసాదించిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. వనచర జాతికి చెందిన వానర సమూహంతో స్నేహ బంధాలు ఏర్పరచుకున్న స్నేహశీలి.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే, రామునిది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. ఇది కూడా ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు. చెప్పినదానినే తూ.చా. తప్పకుండా ఆచరించాడు. తండ్రికిచ్చిన మాటని పాటించాడు. అరణ్యవాసం తరువాత నగరానికి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడై ప్రజలకిచ్చిన మాట కోసం మళ్ళీ సీతామాతను పరిత్యజించాడు. అందుకే ఒకే మాట మీద నిలబడే రాముడు, సత్యవాక్పరిపాలకుడు అన్న బిరుదు వహించాడు.
సీతామాతనే తప్ప అన్యకాంతల ముఖాలు కూడా చూడలేదు. శూర్పణఖ వృత్తాంతమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఏకపత్నీ వ్రతాన్ని ఆచరించిన మహోన్నతుడు శ్రీరామచంద్రుడు. అందుకే ఆయనకి ఒకే పత్ని. అన్న బాటని అనుసరించారు తమ్ముళ్ళు. తమ్ముల మాటని గౌరవించాడు శ్రీరాముడు. భ్రాతృప్రేమకి ఇదే నిదర్శనం. రామునిలో ఇన్ని కోణాలు దర్శించి రచించిన వాల్మీకి ఆ రామాయణ కావ్యాన్ని మనకందించాడు. రామాయణం అన్ని యుగాలకీ నిత్య పారాయణం.
రాజ్యకాంక్షగానీ, లోభత్వం కానీ, స్వలాభాపేక్షగానీ రామునిలో కనిపించవు. అదీకాక ఈ సంఘటనల వల్ల శ్రీరాముని దాతృత్వం కూడా వ్యక్తమవుతుంది. అలాగే కైకేయి కోరిక మీద, తండ్రి ఆనతి తలదాల్చి రాజ్యాన్ని భరతునికి ధారపోసి వనవాసానికి వెళ్ళడం వల్ల తల్లిదండ్రుల పట్ల తనయుల కర్తవ్యాన్ని ప్రత్యక్షంగా చూపించిన ధీరుడు శ్రీరామ చంద్రుడు. కట్టుకున్న ఇల్లాల్ని ఎంతగా ప్రేమించాడో, ఆమెని విడిపించడాన్ని బట్టే అర్ధం అవుతుంది.