Followers

Monday 23 September 2013

కోమలమైన పాదాలు.. చేతులు

hands-n-feet-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema

శీతాకాలంలో పాదాలు, చేతులు రంగుమారిపోతాయి. పగుళ్లు వచ్చి వికారంగా కనిపిస్తాయి. ప్రత్యేకమైన సంరక్షణ తీసుకుం పాదాలు, చేతులను కోమలంగా ఉంచగలుగుతాం. అలాంటి అందమైన పాదాలు సొంతం చేసుకోవాలంటే 15 రోజులకోసారి పెడిక్యూర్ చేయించాలి. పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్లలేని వారు ఇంట్లో దొరికే వస్తువులతోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. గోరు వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు, హైడ్రోజన్‌పెరాకె్సైడ్ లేదా డెటాల్, షాంపూ వేయాలి. అందులో 15 నుంచి 20 నిమిషాలపాటు కాళ్లను నానబెట్టాలి. బయటకు తీసి ప్యూమిక్‌స్టోన్ లేదా స్క్రబ్బింగ్ స్టోన్ లేదా బ్రష్ ఉపయోగించి రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తరువాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి బాగా రుద్దాలి. అనంతరం ఆలివ్ ఆయిల్‌తో కాలును మొత్తం మసాజ్ చేయాలి. అనంతరం పాదాలకు సాక్స్ వేసుకోవాలి.
-ఇలా చేయడం వల్ల పగుళ్లు, దురద రాకుండా ఉంటాయి.
-సాల్ట్ కాళ్ల నొప్పులను నివారిస్తుంది.
-హైడ్రోజన్ పెరాకె్సైడ్ / డెటాల్ పగుళ్లలోపల ఉన్న మురికిని తొలగిస్తాయి.
-నిమ్మచెక్క, గ్లిజరిన్ వల్ల టాన్‌మారిన పాదాలు తిరిగి మునుపటి కాంతిని సంతరించుకుంటాయి.
-చలికాలంలో రోజంతా సాక్స్ వేసుకుని ఉండటం మంచిది.

మానిక్యూర్
చేతులను మృదువుగా ఉంచడానికి ఉప్పు, హైడ్రోజన్‌పెరాకె్సైడ్ లేదా డెటాల్, షాంపూ కలిపిన గోరు నీటిలో చేతులను కూడా నానబెట్టాలి. తరువాత మెత్తటి బ్రష్‌తో మృదువుగా రుద్ది క్లీన్ చేయాలి. అనంతరం శనగపిండి, పాలు, కస్తూరి పసుపు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో చేతులను స్క్రబ్ చేయాలి. కడిగిన తరువాత నిమ్మచెక్కపై గ్లిజరిన్ వేసి రుద్దాలి. ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయాలి. చేతులు డ్రై అయిపోకుండా ఉండాలంటే బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా గ్లోవ్స్ వేసుకోవాలి. 

Popular Posts