Followers

Thursday 29 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పన్నెండవ అధ్యాయం

              

  ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పన్నెండవ అధ్యాయం

శ్రీభగవానువాచ
న రోధయతి మాం యోగో న సాఙ్ఖ్యం ధర్మ ఏవ చ
న స్వాధ్యాయస్తపస్త్యాగో నేష్టాపూర్తం న దక్షిణా

సత్సంగం నన్ను మీ వశములో ఉంచేట్లు ఏమీ ఉంచవు. ఒక్క సత్సంగమే నన్ను చేరే ఉపాయం
యోగం సాంఖయ్మూ ధర్మమూ స్వాధ్యాయమూ  తపమూ త్యాగమూ ఇష్టాపూర్తములూ దక్షిణా

వ్రతాని యజ్ఞశ్ఛన్దాంసి తీర్థాని నియమా యమాః
యథావరున్ధే సత్సఙ్గః సర్వసఙ్గాపహో హి మామ్

వ్రతములూ యజ్ఞ్యములూ తీర్థములూ నియమమూ యమమూ చందస్సూ ఇవన్నీ నన్ను మీ హృదయములో ఉంచలేవు. సత్సంగమే ఉంచుతుంది. అన్ని ఇతర సంగములను తొలగించేదే సత్సంగం. సజ్జనులతో ఒక సారి స్నేహము చేస్తే మరి ఇంక దేనితో సంగము ఉండదు. సత్సంగముతో వశమైనట్లు మరి దేనితోనూ వశం కాను

సత్సఙ్గేన హి దైతేయా యాతుధానా మృగాః ఖగాః
గన్ధర్వాప్సరసో నాగాః సిద్ధాశ్చారణగుహ్యకాః

ఎలాంటి యోగ్యతా లేని వారు కూడా సత్సంగముతో మోక్షాన్ని పొందారు.
రాక్షసులు గంధర్వులు మృగాలు పక్షులు అప్సరసలు నాగులు సిద్ధులు చారణులు గుహ్యకులు విద్యాధరులు వైశ్యులు స్త్రీలు శూద్రులు అంత్యజులు రజస్తమో గుణాలు కలవారు, ఆయా యుగాలలో వీరందరూ నన్ను చేరారు

విద్యాధరా మనుష్యేషు వైశ్యాః శూద్రాః స్త్రియోऽన్త్యజాః
రజస్తమఃప్రకృతయస్తస్మింస్తస్మిన్యుగే యుగే

బహవో మత్పదం ప్రాప్తాస్త్వాష్ట్రకాయాధవాదయః
వృషపర్వా బలిర్బాణో మయశ్చాథ విభీషణః

వృత్తాసురుడూ ప్రహ్లాదుడూ మొదలైన వారు సత్సంగము వలన అనదరూ నన్ను చేరారు.
వృషపర్వుడు బలి బాణుడు మయుడు విభీషణ

సుగ్రీవో హనుమానృక్షో గజో గృధ్రో వణిక్పథః
వ్యాధః కుబ్జా వ్రజే గోప్యో యజ్ఞపత్న్యస్తథాపరే

సుగ్రీవ జాంబవంత గజమూ గద్దా వ్యాపారి బోయవాడు కుబ్జ వ్రజములో గోపికలు వీరంతా మోక్షం పొందారు

తే నాధీతశ్రుతిగణా నోపాసితమహత్తమాః
అవ్రతాతప్తతపసః మత్సఙ్గాన్మాముపాగతాః

వారు వేదములను చదువుకోలేదు. పెద్దలను వారు పెద్దగా ఆరాధించలేదు. వ్రతములూ తపస్సు లేదు. కేవలం సత్సంగముతోనే నన్ను చేరారు.

కేవలేన హి భావేన గోప్యో గావో నగా మృగాః
యేऽన్యే మూఢధియో నాగాః సిద్ధా మామీయురఞ్జసా

యం న యోగేన సాఙ్ఖ్యేన దానవ్రతతపోऽధ్వరైః
వ్యాఖ్యాస్వాధ్యాయసన్న్యాసైః ప్రాప్నుయాద్యత్నవానపి

ఎంత ప్రయత్నం చేసినా యోగమూ సాంఖ్యమూ దానమూ తపస్సుతో వ్రతమూ యాగాలు ఉత్తమ వాఖ్యానాలూ స్వాధ్యాయాలూ సన్యాసాలతో నన్ను పొందలేని వారు సత్సంగముతో పొందారు

రామేణ సార్ధం మథురాం ప్రణీతే శ్వాఫల్కినా మయ్యనురక్తచిత్తాః
విగాఢభావేన న మే వియోగ తీవ్రాధయోऽన్యం దదృశుః సుఖాయ

అకౄరుడు నన్ను మధురను తీసుకు రావడానికి వస్తే నా యందే మనసు ఉంచిన గోపికలు నా మీద ప్రీతితో నా వియోగాన్ని మనసులో ఉంచుకుని అలాగే కుమిలిపోయారు గానీ, నేను లేను కదా అని మరెవరినో పొందలేదు
(నిజముగా వారు శరీర సుఖమే అభిలషించి ఉంటే ఆ సుఖం పొందడానికి వేరే ఉపాయం చూసేవారు. కానీ వారు మళ్ళీ కృష్ణుడు కనపడే దాకా కృష్ణుడినే ధ్యానం చేస్తూ ఉన్నారు. అది కలగడానికి వారికి సత్సంగమే తోత్పడింది)

తాస్తాః క్షపాః ప్రేష్ఠతమేన నీతా మయైవ వృన్దావనగోచరేణ
క్షణార్ధవత్తాః పునరఙ్గ తాసాం హీనా మయా కల్పసమా బభూవుః

అంత మంచి రాత్రులు నాతో గడిపారుం నేను నేను వారికి శ్రేష్టతమున్ని. అలా నాతో అన్ని రాత్రులూ రోజులూ అరక్షణాలల గడిపిన వారు నేను వెళ్ళిన తరువాత ఆ రాత్రులు కల్పములా దీర్ఘముగా బాధపెట్టి ఉంటాయి. ఐనా

తా నావిదన్మయ్యనుషఙ్గబద్ధ ధియః స్వమాత్మానమదస్తథేదమ్
యథా సమాధౌ మునయోऽబ్ధితోయే నద్యః ప్రవిష్టా ఇవ నామరూపే

వారికి ఇన్ని రోజులు గడిచాయి అని తెలియనేలేదు. నా అనుసంగముతో వారు బద్ధులయ్యారు. సముద్రములో ప్రవేశించిన నదులు తమ నామ రూపాలను వదులుకున్నట్లుగా నాయందు మనసు ఉంచిన గోపికలు తక్కినవాటి మొత్తాన్ని వదులుకున్నారు. తామెవరో కూడా మరచిపోయారు.
నదులు సముద్రములో ప్రవేశించినపుడు తమ పేరులు వదులుకున్నట్లు స్వామిని కలిసిన తరువాత మనకు నామమూ రూపమూ వేరేగా ఉండవు

మత్కామా రమణం జారమస్వరూపవిదోऽబలాః
బ్రహ్మ మాం పరమం ప్రాపుః సఙ్గాచ్ఛతసహస్రశః

నా మీదకోరికతోనే నేను కేవలం రమింపచేసే జారుడిగానే నా స్వరూపాన్ని తెలియక అబలులుగా నన్ను భావించి కూడా పరబ్రహ్మనైన నన్ను పొందారు.

తస్మాత్త్వముద్ధవోత్సృజ్య చోదనాం ప్రతిచోదనామ్
ప్రవృత్తిం చ నివృత్తిం చ శ్రోతవ్యం శ్రుతమేవ చ

ఉద్ధవా, వేద విహితమైన కర్మలూ విన్నదాన్ని వినవలసిన దాన్నీ ప్రవృత్తినీ నివృత్తినీ విడిచి, అన్ని ధర్మాలనూ విడిచి సర్వ దేహులకూ

మామేకమేవ శరణమాత్మానం సర్వదేహినామ్
యాహి సర్వాత్మభావేన మయా స్యా హ్యకుతోభయః

ఆత్మనైన నన్ను సర్వాత్మ భావముతో శరణు వేడు. అపుడు నాతోనే ఉంటావు. నీకు ఎలాంటి భయమూ ఉండదు

శ్రీద్ధవ ఉవాచ
సంశయః శృణ్వతో వాచం తవ యోగేశ్వరేశ్వర
న నివర్తత ఆత్మస్థో యేన భ్రామ్యతి మే మనః

నా మనసులో సన్శయం అలాగే ఉంటోంది నీవెన్ని చెప్పినా...

శ్రీభగవానువాచ
స ఏష జీవో వివరప్రసూతిః ప్రాణేన ఘోషేణ గుహాం ప్రవిష్టః
మనోమయం సూక్ష్మముపేత్య రూపం మాత్రా స్వరో వర్ణ ఇతి స్థవిష్ఠః

నీవు శరీరములో ఉన్నంత వరకూ ఈ సంశయం ఉంటుంది. అలా శరీరములో ప్రవేశించి మనోమయమైన రూపాన్ని పొంది, స్వర రూపములో వర్ణ రూపములో మాత్రా రూపములో స్థూలముగా సూక్ష్మముగా ఈ దహరాకాశములో ప్రవేశించిన జీవుడు

యథానలః ఖేऽనిలబన్ధురుష్మా బలేన దారుణ్యధిమథ్యమానః
అణుః ప్రజాతో హవిషా సమేధతే తథైవ మే వ్యక్తిరియం హి వాణీ

ఆకాశములో అగ్నికి వాయువు బంధువైనట్లు, అదే అగ్ని కట్టెలో బాగా మధనం చేస్తే చిన్నగా అవుతుంది. అగ్ని  ఆకాశములో ఉంటుంది. అదే అరణిలో మధిస్తే బయలుదేరుతుంది. అదే కుండములో పెద్దగా ఉంటుంది. హవిస్సు వేస్తే ఇంకా పెద్దదవుతుంది. అలాగే దహారాకాశములో ఉన్నవాడు అణువు, శరీరములోకి వచ్చిన తరువాత బృహత్ అవుతాడు. అలాగే నేను కూడా దహరాకాశములో సూక్ష్మముగా ఉంటాను, అదే వాక్కుతో వింటే కొంచెం పెద్ద అవుతాను. అదే అర్చా రూపములో చూస్తే ఇంకా పెద్ద అవుతాను, అనంతమవుతాను. నన్నే ధ్యానిస్తే ఆ భక్తి వలన ఇంకా విశ్వవ్యాపి అవుతాను. దహరాకాశములో అంతర్యామిగా ఉన్న స్వామే ధ్యానముతో కీర్తనతో శ్రవణముతో ఆవిర్భవిస్తాడు. అర్చారూపమూ, దాన్ని ధ్యానించుటచే ఇంకా విశ్వరూపుడవుతాడు.

ఏవం గదిః కర్మ గతిర్విసర్గో ఘ్రాణో రసో దృక్స్పర్శః శ్రుతిశ్చ
సఙ్కల్పవిజ్ఞానమథాభిమానః సూత్రం రజఃసత్త్వతమోవికారః

పలుకుట వెళ్ళుట గంధమూ రుచీ చూపు వదులుట రూపమూ స్పర్శ వినడం సంకల్పమూ ఆలోచనా అభిమానం, ఇవన్నీ

అయం హి జీవస్త్రివృదబ్జయోనిరవ్యక్త ఏకో వయసా స ఆద్యః
విశ్లిష్టశక్తిర్బహుధేవ భాతి బీజాని యోనిం ప్రతిపద్య యద్వత్

ఇవన్నీ సత్వ రజస్తమో గుణరూపములు, ఆయనే చతుర్ముఖ బ్రహ్మ, విరాట్ పురుషుడు, అతనే మొదటి జీవుడు. ఆ సూత్రాత్మే బహురూపములుగా మనకు భాసిస్తుంది వ్యాప్త్మైన శక్తి గలవాడై. (బీజం ఎలా రూపాన్ని పెంచుకుని వ్యాపిస్తుందో)

యస్మిన్నిదం ప్రోతమశేషమోతం పటో యథా తన్తువితానసంస్థః
య ఏష సంసారతరుః పురాణః కర్మాత్మకః పుష్పఫలే ప్రసూతే

ఈ సకల జగత్తు ఏ పరమాత్మ యందు నిలుపబడినదో. దారముల కూర్పే వస్త్రము.
ఈ సంసార వృక్షము నిత్యమూ పుష్పాలనూ ఫలాలనూ ఇస్తుంది. ఫలం నుండి మళ్ళీ బీజం. దాని నుంచీ మళ్ళీ చిగురిస్తుంది

ద్వే అస్య బీజే శతమూలస్త్రినాలః పఞ్చస్కన్ధః పఞ్చరసప్రసూతిః
దశైకశాఖో ద్విసుపర్ణనీడస్త్రివల్కలో ద్విఫలోऽర్కం ప్రవిష్టః

పుణ్య పాపములు దీనికి బీజములు, దీనికి మూలములు మాత్రం మూడు సత్వ రజస్తమో గుణములు. కొమ్మలు ఫలములూ ఐదు. జ్ఞ్యానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు. ఇదే పది + ఒకటి - పదకొండు. పదకొండు ఇంద్రియాలు. రెండు పక్షులు. జీవాత్మా పరమాత్మ

అదన్తి చైకం ఫలమస్య గృధ్రా గ్రామేచరా ఏకమరణ్యవాసాః
హంసా య ఏకం బహురూపమిజ్యైర్మాయామయం వేద స వేద వేదమ్

సత్వ రజస్తమో గుణాలు అనే మూడు గుణాలు కాకుండా అర్థ దశార్థ పూర్ణార్థ అనే పుణ్య పాప ఫలములు తీసుకుని స్వర్గమో నరకమో ప్రవేశిస్తాము
ఇలాంటి మహా వృక్షం యొక్క ఫలాన్ని కొన్ని గ్రామములో తిరిగే పక్షులు తింటాయి (అరణ్యములో తిరిగే హంసలు తినవు)
ఎవరైతే ఇలాంటి నా మాయా మయమైన స్వరూపాన్ని తెలుసుకుంటారో పరమాత్మ ఐన నన్ను తెలుసుకుంటారు

ఏవం గురూపాసనయైకభక్త్యా విద్యాకుఠారేణ శితేన ధీరః
వివృశ్చ్య జీవాశయమప్రమత్తః సమ్పద్య చాత్మానమథ త్యజాస్త్రమ్

ఇలా గురువుగారి యొక్క ఉపాసనతో ప్రధానమైన భక్తితో, గురూపాసన విద్య అనే గొడ్డలితో ఈ వృక్షాన్ని చేదించాలి. అలా నరికిన గొడ్డలిని కూడా వదిలిపెట్టాలి
భగవంతున్ని తెలుసుకునేంతవరకే జ్ఞ్యానమును పట్టుకోవాలి. తరువాత ఆ జ్ఞ్యానాన్ని కూడా వదిలిపెట్టాలి

                                  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts