Followers

Thursday 29 May 2014

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం రెండవ అధ్యాయం

              

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం రెండవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తతశ్చానుదినం ధర్మః సత్యం శౌచం క్షమా దయా
కాలేన బలినా రాజన్నఙ్క్ష్యత్యాయుర్బలం స్మృతిః

క్షమా ధర్మ సత్యం శౌచం దయా మొదలైన్వాటిని రాజులే నశింపచేస్తారు
బలమైన కాలం వీటిని పోగొడుతుంది, బలము పోతుంది, స్మృతి (బుద్ధి బలం) కూడా పోతుంది

విత్తమేవ కలౌ నౄణాం జన్మాచారగుణోదయః
ధర్మన్యాయవ్యవస్థాయాం కారణం బలమేవ హి

ఎవడికి బాగా డబ్బు ఉంటే వాడే మంచి ఆచారవంతుడు, గుణవంతుడు, మంచి వంశములో పుట్టినవాడు అవుతాడు. వాడిదే ఉత్తమ ఆచారం.
బలవంతుడు చెప్పినదే ధర్మమ్న్యాం అని నిర్ణ్యైంచడుతుంది

దామ్పత్యేऽభిరుచిర్హేతుర్మాయైవ వ్యావహారికే
స్త్రీత్వే పుంస్త్వే చ హి రతిర్విప్రత్వే సూత్రమేవ హి

అమ్మాయికి అబ్బాయి నచ్చడం, అబ్బాయికి అమ్మాయి నచ్చడమే వివాహానికీ దాంపత్యానికీ హేతువు.
వ్యవహారం అంటే మాయ.
స్త్రీత్వం పుంసత్వమే రతికి కారణం. ప్రేమ ఉండదు
యజ్ఞ్యోపవీతం ఉన్నవాడే బ్రాహ్మణుడు

లిఙ్గం ఏవాశ్రమఖ్యాతావన్యోన్యాపత్తికారణమ్
అవృత్త్యా న్యాయదౌర్బల్యం పాణ్డిత్యే చాపలం వచః

కాషాయం వేసుకుంటే సన్యాసి, అమ్మయితో ఉంటే గృహస్థు. ఇలా వేషాన్ని బట్టి ఆశ్రమాన్ని చెబుతారు గానీ వారు ఆయా ఆశ్రమ ధర్మాలు పాటించరు.
బతుకు తెరువు లేదు కాబట్టి అన్యాయం పెరుగుతుంది. బలహీనులవుతారు.
ఎంత అర్థం లేకుండా మాట్లాడితే అంత పండితులు.

అనాఢ్యతైవాసాధుత్వే సాధుత్వే దమ్భ ఏవ తు
స్వీకార ఏవ చోద్వాహే స్నానమేవ ప్రసాధనమ్

డబ్బు లేనివాడే దుర్జనుడు
డాంభికముగా ఉన్నవాడు ఉత్తముడు.
వివాహానికి స్వీకారమే (నచ్చడమే) కారణం
కేవలం స్నానం చేయడమే అలంకారం

దూరే వార్యయనం తీర్థం లావణ్యం కేశధారణమ్
ఉదరంభరతా స్వార్థః సత్యత్వే ధార్ష్ట్యమేవ హి
దాక్ష్యం కుటుమ్బభరణం యశోऽర్థే ధర్మసేవనమ్

ఎంత ఎక్కువ దూరం ప్రయాణిస్తే అదే తీర్థం. తీర్థ యాత్ర పేరుతో ఎంత ఎక్కువ దూరానికి వెళితే అంత గొప్ప అన్నమాట.
అందం అంటే కేశ ధారణ. జుట్టు పెంచుకోవడమే అందం
పొట్ట నింపుకోవడమే అందరి ఉద్దేశ్యం
ఎదుటివారిని అదరగొట్టడమే సత్యం
కుటుంబాన్ని బాగా పోషించుకున్నవాడే దక్షుడు
పేరు కోసమే ధర్మాచరణ చేస్తారు

ఏవం ప్రజాభిర్దుష్టాభిరాకీర్ణే క్షితిమణ్డలే
బ్రహ్మవిట్క్షత్రశూద్రాణాం యో బలీ భవితా నృపః

ఇలాంటి దుష్టులతో భూమండలం అంతా నిండిపోతుంది.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఎవడు బలవంతుడో వాడే రాజు అవుతాడు

ప్రజా హి లుబ్ధై రాజన్యైర్నిర్ఘృణైర్దస్యుధర్మభిః
ఆచ్ఛిన్నదారద్రవిణా యాస్యన్తి గిరికాననమ్

పిసినారితోటి, డబ్బు మీద ఆశ ఉన్నవారితో దయ లేనివారితో అధర్మాత్ములైన రాజులతో ప్రజలు బాధించబడతారు
చివరకు వచ్చేసరికి భార్యా పిల్లలూ ఎవరూ ఉండరు. ఇంక ఎవరూ ఊరిలో ఉండలేక అడవుల వెంటబడతారు.

శాకమూలామిషక్షౌద్ర ఫలపుష్పాష్టిభోజనాః
అనావృష్ట్యా వినఙ్క్ష్యన్తి దుర్భిక్షకరపీడితాః

కూరగాయలూ మూలములూ మాంసమూ తేనె పళ్ళూ పుష్పాలూ తింటూ ఉంటారు
కరవుతో పంటలు నశిస్తాయి. పన్నుతో అందరూ పీడించబడతారు

శీతవాతాతపప్రావృడ్ హిమైరన్యోన్యతః ప్రజాః
క్షుత్తృడ్భ్యాం వ్యాధిభిశ్చైవ సన్తప్స్యన్తే చ చిన్తయా

చలితో గాలితో ఎండతో వర్షాలతో మంచుతో ఒకరినొకరు బాధించబడతారు
ఆకలీ దప్పులూ వ్యాధులూ. ఇవన్నీ ఎక్కువ గావాడముతో చింతిస్తూ ఉంటారు.

త్రింశద్వింశతి వర్షాణి
పరమాయుః కలౌ నృణామ్

ఇరవై ముప్పయ్యేళ్ళు దాటితే పరిపూర్ణ ఆయువు కింద లెక్క (వారికొచ్చే రోగాల వలన)


క్షీయమాణేషు దేహేషు దేహినాం కలిదోషతః
వర్ణాశ్రమవతాం ధర్మే నష్టే వేదపథే నృణామ్

కలి దోషాల వలన వీరి శరీరాలు క్షీణించిపోతాయి
వర్ణాలూ ఆశ్రమాలు ధర్మాలు వేద మార్గమూ నశిస్తాయి.

పాషణ్డప్రచురే ధర్మే దస్యుప్రాయేషు రాజసు
చౌర్యానృతవృథాహింసా నానావృత్తిషు వై నృషు

పాప ఖండమే ధర్మం (నాస్తికత్వం)
రాజులంటే దొంగలు
మానవులు చౌర్యమూ అబద్దమూ అకారణ హింస అనే నానా వృత్తులను స్వీకరిస్తారు

శూద్రప్రాయేషు వర్ణేషు చ్ఛాగప్రాయాసు ధేనుషు
గృహప్రాయేష్వాశ్రమేషు యౌనప్రాయేషు బన్ధుషు

అన్ని వర్ణాల వారూ శూద్రుల వలనే ఉంటారు
మేకలలాగ ఆవులు ఉంటాయి
సన్యాసుల ఆశ్రమాలు ఇళ్ళలా ఉంటాయి
బంధువులు అంటే భార్య తరపువారే. (యోని సంబంధం ఉన్నవారే  బంధవులు)

అణుప్రాయాస్వోషధీషు శమీప్రాయేషు స్థాస్నుషు
విద్యుత్ప్రాయేషు మేఘేషు శూన్యప్రాయేషు సద్మసు

అణువులా ఉండే ఔషధాలు
పెద్ద వృక్షాలు అంటే జమ్మి చెట్టు అంత ఉంటాయి
మబ్బులు మెరుపులులా ఉంటాయి (అంటే వర్షాలు పడవు)
ఇళ్ళన్నీ ఖాళీగా ఉంటాయి

ఇత్థం కలౌ గతప్రాయే జనేషు ఖరధర్మిషు
ధర్మత్రాణాయ సత్త్వేన భగవానవతరిష్యతి

గతములో ప్రాయమంతా గడిచి జనులంతా దుష్ట ధర్మాలు ఆచరిస్తూ ఉంటే
మళ్ళీ స్వామి అపుడూ అవతరిస్తాడు

చరాచరగురోర్విష్ణోరీశ్వరస్యాఖిలాత్మనః
ధర్మత్రాణాయ సాధూనాం జన్మ కర్మాపనుత్తయే

పరమాత్మ చరాచర గురువు. ధర్మాన్నీ సాధువులనూ రక్షించడానికీ
వారి జన్మా కర్మా కాపాడడానికీ స్వామి వస్తాడు.

శమ్భలగ్రామముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః
భవనే విష్ణుయశసః కల్కిః ప్రాదుర్భవిష్యతి

శంబల గ్రామములో విష్ణు యశస అనే బ్రాహ్మణునికి కల్కి పుడతాడు

అశ్వమాశుగమారుహ్య దేవదత్తం జగత్పతిః
అసినాసాధుదమనమష్టైశ్వర్యగుణాన్వితః

దేవదత్తం అనే అశ్వమెక్కి ఖడ్గముతో దుష్టులందరినీ సంహరిస్తాడు
అష్టైశ్వర్య గుణాలు గల స్వామి

విచరన్నాశునా క్షౌణ్యాం హయేనాప్రతిమద్యుతిః
నృపలిఙ్గచ్ఛదో దస్యూన్కోటిశో నిహనిష్యతి

గుర్రముతో భూమండలము అంతా తిరిగి రాజుల వేషం వేసుకున్న దుర్మార్గులనూ దొంగలనూ సంహరిస్తాడు

అథ తేషాం భవిష్యన్తి మనాంసి విశదాని వై
వాసుదేవాఙ్గరాగాతి పుణ్యగన్ధానిలస్పృశామ్
పౌరజానపదానాం వై హతేష్వఖిలదస్యుషు

పరమాత్మ రావడముతో అందరి మనసులూ శుద్ధమవుతాయి
వాసుదేవుని శరీరం నుండి ప్రవహించే పరిశుద్ధమైన గాలి తగలడముతో అనదరి మనసులూ పరిశుద్ధములవుతాయి. దొంగలందరూ చంపబడిన తరువాత

తేషాం ప్రజావిసర్గశ్చ స్థవిష్ఠః సమ్భవిష్యతి
వాసుదేవే భగవతి సత్త్వమూర్తౌ హృది స్థితే

ప్రజా సృష్టి స్థవిష్ఠమవుతుంది.
పరమాత్మ మన హృదయములో ఉంటే

యదావతీర్ణో భగవాన్కల్కిర్ధర్మపతిర్హరిః
కృతం భవిష్యతి తదా ప్రజాసూతిశ్చ సాత్త్వికీ

ధర్మ పతి ఐన కల్కి రాగానే కలియుగం కాస్తా కృతయుగమవుతుంది.
ప్రజలు కూడా సత్వ గుణ సంపన్నులు అవుతారు

యదా చన్ద్రశ్చ సూర్యశ్చ తథా తిష్యబృహస్పతీ
ఏకరాశౌ సమేష్యన్తి భవిష్యతి తదా కృతమ్

కృత యుగం అంటే చంద్రుడూ సూర్యుడూ బృహస్పతీ వీరు ఒకే రాశిలో ఉన్నపుడు కృత యుగం అవుతుంది.

యేऽతీతా వర్తమానా యే భవిష్యన్తి చ పార్థివాః
తే త ఉద్దేశతః ప్రోక్తా వంశీయాః సోమసూర్యయోః

గడిచిన వారూ ఉన్నవారూ వచ్చేవారు, (రాజులు) అన్నీ నీకు చెప్పాను.

ఆరభ్య భవతో జన్మ యావన్నన్దాభిషేచనమ్
ఏతద్వర్షసహస్రం తు శతం పఞ్చదశోత్తరమ్

నీ పుట్టుక దగ్గర నుండీ నందాభిషేకం వరకూ అన్నీ చెప్పాను
ఇదంతా పదకొండు వందల పదహేను సంవత్సరాలు

సప్తర్షీణాం తు యౌ పూర్వౌ దృశ్యేతే ఉదితౌ దివి
తయోస్తు మధ్యే నక్షత్రం దృశ్యతే యత్సమం నిశి

సప్త ఋషులలో మొదటి ఇద్దరూ ఉదయించినపుడు ,
ఆ ఇద్దరి మధ్యనా ఒక చుక్క కనపడితే,

తేనైవ ఋషయో యుక్తాస్తిష్ఠన్త్యబ్దశతం నృణామ్
తే త్వదీయే ద్విజాః కాల అధునా చాశ్రితా మఘాః

అప్పుడు మానవుల ఆయుష్యం నూరేళ్ళుగా ఉంటుంది.  వారు కూడా మనకు నూరేళ్ళు కనపడతారు
ఇపుడు ఆ ఋషులందరూ మఘా నక్షత్రాన్ని ఆశ్రయించి ఉన్నారు

విష్ణోర్భగవతో భానుః కృష్ణాఖ్యోऽసౌ దివం గతః
తదావిశత్కలిర్లోకం పాపే యద్రమతే జనః

పరమాత్మ యొక్క కృష్ణ భానుడు వైకుంఠానికి వెళ్ళాడు. పరమాత్మ శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళగానే కలి ప్రవేశించాడు. ఈ కలియుగములో అందరికీ పాపమే నచ్చుతుంది

యావత్స పాదపద్మాభ్యాం స్పృశనాస్తే రమాపతిః
తావత్కలిర్వై పృథివీం పరాక్రన్తుం న చాశకత్

కృష్ణ పరమాత్మ తన పాదములతో భూమిని స్పృశించి ఉన్నంత కాలం కలి భూమి మీదకు రావడానికి సాహసించలేదు

యదా దేవర్షయః సప్త మఘాసు విచరన్తి హి
తదా ప్రవృత్తస్తు కలిర్ద్వాదశాబ్దశతాత్మకః

దేవర్షులు ఏడుగురు మఘా నక్షత్రాలలో విహరించినపుడు కలి వచ్చాడు
ఇది పన్నెండు వందల దివ్య సంవత్సరాలు

యదా మఘాభ్యో యాస్యన్తి పూర్వాషాఢాం మహర్షయః
తదా నన్దాత్ప్రభృత్యేష కలిర్వృద్ధిం గమిష్యతి

సప్త ఋషులు మఘ నుండి పూర్వాషాఢ నక్షత్రానికి వెళ్ళినప్పటినుంచీ నందుల రాజ్యం వస్తుంది
అప్పటినుంచీ కలి పెరుగుతాడు

యస్మిన్కృష్ణో దివం యాతస్తస్మిన్నేవ తదాహని
ప్రతిపన్నం కలియుగమితి ప్రాహుః పురావిదః

కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిన పూటే కలి వచ్చాడు.
పరమాత్మ వెళ్ళిన వెంటనే కలి వచ్చింది అని ప్రాచీన పండితులు చెబుతున్నారు

దివ్యాబ్దానాం సహస్రాన్తే చతుర్థే తు పునః కృతమ్
భవిష్యతి తదా నౄణాం మన ఆత్మప్రకాశకమ్

ఇలా దివ్య సంవత్సరాలు పన్నెండు వందలు గడిస్తే, (1200 - కలియుగం , 2400- ద్వాపర....)
కృత యుగం ఐతే మళ్ళీ మానవుల మనసు ప్రకాశిస్తుంది.

ఇత్యేష మానవో వంశో యథా సఙ్ఖ్యాయతే భువి
తథా విట్శూద్రవిప్రాణాం తాస్తా జ్ఞేయా యుగే యుగే

ఈ రకముగా మానవ వంశాన్ని భూలోకములో ఎలా చెప్పుకుంట్నామో
వైశ్యులూ శూద్రులూ బ్రాహ్మణుల స్వభావాలు ఆయా యుగాలకు అనుగుణముగా చెప్పుకోవాలి.

ఏతేషాం నామలిఙ్గానాం పురుషాణాం మహాత్మనామ్
కథామాత్రావశిష్టానాం కీర్తిరేవ స్థితా భువి

మహాత్ముల నామాలూ రూపాలూ గుర్తులూ చెప్పాము, పరిపాలన చెప్పాము
వారు లేకపోయినా వారి కీర్తి మాత్రమే మిగులుతుంది.

దేవాపిః శాన్తనోర్భ్రాతా మరుశ్చేక్ష్వాకువంశజః
కలాపగ్రామ ఆసాతే మహాయోగబలాన్వితౌ

శంతనుడి సోదరుడు దేవాపి, ఇక్ష్వాకు వంశస్థుడు మరు, వీరిద్దరూ కలాప గ్రామములో వేంచేసి ఉంటారు, మహా యోగబలముతో ఉంటారు

తావిహైత్య కలేరన్తే వాసుదేవానుశిక్షితౌ
వర్ణాశ్రమయుతం ధర్మం పూర్వవత్ప్రథయిష్యతః

కలియుగం ఐపోయాక వారు మళ్ళీ ఇక్కడకు వచ్చి పరమాత్మ చేత బోధించబడి, వర్ణాశ్రమ ధర్మాలను, యధాపూర్వం ప్రవర్తింపచేస్తారు

కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగమ్
అనేన క్రమయోగేన భువి ప్రాణిషు వర్తతే

కృత త్రేతా ద్వాపర కలియుగాలలో ఇదే క్రమముగా ప్రాణులందరిలో తిరుగుతూ ఉంటాయి
ఇవన్నీ నీకు వరుసలో చెప్పాను

రాజన్నేతే మయా ప్రోక్తా నరదేవాస్తథాపరే
భూమౌ మమత్వం కృత్వాన్తే హిత్వేమాం నిధనం గతాః

రాజుల గురించీ చెప్పాను
వారంతా "నా భూమి నా భూమి" అంటూ మమకారం పెంచుకుని దానితోనే పోయారు

కృమివిడ్భస్మసంజ్ఞాన్తే రాజనామ్నోऽపి యస్య చ
భూతధ్రుక్తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః

క్రిమి విట్ భస్మ అయ్యే ఈశరీరముతో, రాజు అనే పేరుతో ప్రాణులకు ద్రోహం చేస్తున్నారు
నరకం మాత్రమే రప్పించే ఆశరీరముతో ఇలాంటి పని చేస్తూ అదే స్వార్థం అనుకుంటున్నారు
తనకు తాను కీడు తెచ్చుకునే వాడు స్వార్థపరుడెలా అవుతాడు

కథం సేయమఖణ్డా భూః పూర్వైర్మే పురుషైర్ధృతా
మత్పుత్రస్య చ పౌత్రస్య మత్పూర్వా వంశజస్య వా

ఈ భూమి "నా పూర్వులు నన్ను ఎలా ధరించారు, నా తరువాతి వారు ఎలా తయారు చేస్తారు. నా కుమారులకూ మనవలకూ ఈ భూమి ఎలా చెప్పాలి" అనుకుంటూ

తేజోऽబన్నమయం కాయం గృహీత్వాత్మతయాబుధాః
మహీం మమతయా చోభౌ హిత్వాన్తేऽదర్శనం గతాః

నిపూ నీరు అన్నముతో శరీరాన్ని పెంచుకుని జ్ఞ్యానం లేని వారు
ఈ భూమి నాది నాదీ, అనే భావముతో ఆ భూమినే వదలిపెట్టి కనపడకుండా పోయార్య్ ఇపుడు

యే యే భూపతయో రాజన్భుఞ్జతే భువమోజసా
కాలేన తే కృతాః సర్వే కథామాత్రాః కథాసు చ

తన పరాక్రమముతో ఏ ఏ రాజులు భూమిని అనుభవించారో
అలాంటి రాజులందరూ ఇపుడు కథలలో మాత్రమే కనపడుతున్నారు.
వారు కథల్లో దొరుకుతారు. ( ఆ రాజు బాగా పరిపాలించాడట  అని అందరూ అనుకుంటారు గాని , అంతకుమించి వారికి మిగిలేది ఏదీ ఉండదు)

                                                         సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts