Followers

Thursday 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై ఏడవ అధ్యాయo

    
ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై ఏడవ అధ్యాయo

శ్రీశుక ఉవాచ
స ఉపస్పృశ్య సలిలం దంశితో ధృతకార్ముకః
నయ మాం ద్యుమతః పార్శ్వం వీరస్యేత్యాహ సారథిమ్

మళ్ళీ ఆచమనం చేసి ధనస్సు తీసుకుని నన్ను త్వరగా తీసుకుని వెళ్ళు ద్యుమంతుని వద్దకు అని అడిగాడు

విధమన్తం స్వసైన్యాని ద్యుమన్తం రుక్మిణీసుతః
ప్రతిహత్య ప్రత్యవిధ్యాన్నారాచైరష్టభిః స్మయన్

ఎదురుగా వెళ్ళి తన బాణాలతో ద్యుమంతుని కొట్టాడు. గుర్రాలను సారధినీ రథాన్నీ ధనువునూ ధ్వజాన్నీ అతని శిరసునూ ఖండించాడు

చతుర్భిశ్చతురో వాహాన్సూతమేకేన చాహనత్
ద్వాభ్యం ధనుశ్చ కేతుం చ శరేణాన్యేన వై శిరః

గదసాత్యకిసామ్బాద్యా జఘ్నుః సౌభపతేర్బలమ్
పేతుః సముద్రే సౌభేయాః సర్వే సఞ్ఛిన్నకన్ధరాః

గదుడూ సాత్యకీ సాంబుడూ శాల్వుడి సైన్యాన్ని ధ్వంసం చేసారు. తలలు తెగి అందరూ సముద్రములో పడుతున్నారు. ఇలా యదువులకూ శాల్వులకూ ఒకరినొకరు చంపుకుంటూ ఇరవై ఏడు రోజులు ఘోరమైన యుద్ధం జరిగింది.

ఏవం యదూనాం శాల్వానాం నిఘ్నతామితరేతరమ్
యుద్ధం త్రినవరాత్రం తదభూత్తుములముల్బణమ్

ఇన్ద్రప్రస్థం గతః కృష్ణ ఆహూతో ధర్మసూనునా
రాజసూయేऽథ నివృత్తే శిశుపాలే చ సంస్థితే

ధర్మ రాజు రాజ సూయ యాగం చేయడానికి పిలిస్తే కృష్ణ పరమాత్మ అక్కడకు వెళ్ళి రాజసూయం పూర్తి చేయించి శిశుపాలుని వధించి, కొన్నాళ్ళు అక్కడ ఉండి.

కురువృద్ధాననుజ్ఞాప్య మునీంశ్చ ససుతాం పృథామ్
నిమిత్తాన్యతిఘోరాణి పశ్యన్ద్వారవతీం యయౌ

కురు వృద్ధులనూ ధర్మరాజాదులనూ కుంతినీ ఒప్పించి, జరుగుతున్న  అపశకములను వారికి చెప్పి ద్వారకకు వెళ్ళాడు

ఆహ చాహమిహాయాత ఆర్యమిశ్రాభిసఙ్గతః
రాజన్యాశ్చైద్యపక్షీయా నూనం హన్యుః పురీం మమ

నేను అందరినీ కలుద్దామని కలిసి ఉందామని ఇక్కడకు వచ్చాను. శిశుపాలుని మిత్రులైన రాజులు నేను లేనపుడు నా నగరాన్ని ప్రజలనూ బాధిస్తూ ఉంటారు

వీక్ష్య తత్కదనం స్వానాం నిరూప్య పురరక్షణమ్
సౌభం చ శాల్వరాజం చ దారుకం ప్రాహ కేశవః

ఇలా అనుకుంటూ వచ్చాడు కృష్ణుడు, యుద్ధం జరుగుతూనే ఉంది. శాల్వుడినీ సైన్యాన్ని చూచి నగర రక్షణకు ఏర్పాటు చేసి యుద్ధానికి తీసుకు వెళ్ళమని శాల్వుని వద్దకు తీసుకుని వెళ్ళమని ఆజ్ఞ్యాపించాడు

రథం ప్రాపయ మే సూత శాల్వస్యాన్తికమాశు వై
సమ్భ్రమస్తే న కర్తవ్యో మాయావీ సౌభరాడయమ్

ఇత్యుక్తశ్చోదయామాస రథమాస్థాయ దారుకః
విశన్తం దదృశుః సర్వే స్వే పరే చారుణానుజమ్

శాల్వశ్చ కృష్ణమాలోక్య హతప్రాయబలేశ్వరః
ప్రాహరత్కృష్ణసూతయ శక్తిం భీమరవాం మృధే

ఇతను మాయావి. ఐనా నీవు కంగారు పడకు అని సారధికి చెప్పాడు. యుద్ధానికి వస్తున్న కృష్ణున్ని చూచాడు శాల్వుడు., వచ్చిన కృష్ణున్ని చూడగానే వాడి బలమూ తేజస్సూ శోభా తగ్గిపోయింది. కృష్ణుని సారధి మీద ఒక శక్తి ప్రయోగిస్తే స్వామి దాన్ని నూరుముక్కలు చేసి పదుహారు బాణాలతో సౌభరి విమానాన్ని కొట్టాడు.

తామాపతన్తీం నభసి మహోల్కామివ రంహసా
భాసయన్తీం దిశః శౌరిః సాయకైః శతధాచ్ఛినత్

తం చ షోడశభిర్విద్ధ్వా బానైః సౌభం చ ఖే భ్రమత్
అవిధ్యచ్ఛరసన్దోహైః ఖం సూర్య ఇవ రశ్మిభిః

శాల్వః శౌరేస్తు దోః సవ్యం సశార్ఙ్గం శార్ఙ్గధన్వనః
బిభేద న్యపతద్ధస్తాచ్ఛార్ఙ్గమాసీత్తదద్భుతమ్

ఇలా కృష్ణుడు శాంఖమును ఎక్కిపెట్టి కొడుతూ ఉంటే శాల్వుడు ధనువును ఎక్కుపెట్టి కృష్ణుని భుజాన్ని కొట్టగా కృష్ణుని చేతిలో ఉన్న శాంగము జారికిందపడింది

హాహాకారో మహానాసీద్భూతానాం తత్ర పశ్యతామ్
నినద్య సౌభరాడుచ్చైరిదమాహ జనార్దనమ్

దాన్ని చూచి అందరూ హాహాకారాలు చేసారు. అంతటితో సౌభరి తాను గొప్పవాడిగా తనను భావించుకుని ఇలా అన్నాడు కృష్ణుడితో

యత్త్వయా మూఢ నః సఖ్యుర్భ్రాతుర్భార్యా హృతేక్షతామ్
ప్రమత్తః స సభామధ్యే త్వయా వ్యాపాదితః సఖా

నా మిత్రుని కాబోయే భార్యను మేమందరూ చూస్తుండగా అపహరించావు. సభలో ఏమరపాటుగా ఉన్న నా మిత్రుని చంపావు. ఎపుడూ ఎవరిచేతా ఓడింపను అన్న గర్వం ఉన్న నిన్ను నా బాణాలతో ఎన్నడూ తిరిగి రాని లోకాలకు పంపుతాను, నా ముందర నిలబడితే

తం త్వాద్య నిశితైర్బాణైరపరాజితమానినమ్
నయామ్యపునరావృత్తిం యది తిష్ఠేర్మమాగ్రతః

శ్రీభగవానువాచ
వృథా త్వం కత్థసే మన్ద న పశ్యస్యన్తికేऽన్తకమ్
పౌరుసం దర్శయన్తి స్మ శూరా న బహుభాషిణః

అది విని "బుద్ధి హీనుడా నీ ముందర ఉన్న యమున్ని చూడక గర్విస్తున్నావు. నిజమైన శూరులు పౌరుషాన్ని చూపుతారు కానీ మాట్లాడరు. అది మాని నీవు మాట్లాడుతునావంటే నీవు పౌరుషహీనుడవు అని అర్థం"

ఇత్యుక్త్వా భగవాఞ్ఛాల్వం గదయా భీమవేగయా
తతాడ జత్రౌ సంరబ్ధః స చకమ్పే వమన్నసృక్

అపుడు తన గదతో ఒక దెబ్బ కొట్టాడు కృష్ణుడు. దానితో శాల్వుడు నెత్తురు కక్కాడు. దానితో కృష్ణుని బలం అర్థమైపోయింది అతనికి.

గదాయాం సన్నివృత్తాయాం శాల్వస్త్వన్తరధీయత
తతో ముహూర్త ఆగత్య పురుషః శిరసాచ్యుతమ్
దేవక్యా ప్రహితోऽస్మీతి నత్వా ప్రాహ వచో రుదన్

కృష్ణ కృష్ణ మహాబాహో పితా తే పితృవత్సల
బద్ధ్వాపనీతః శాల్వేన సౌనికేన యథా పశుః

ఎదురుగా కృష్ణుడితో పోరాడలేము అని అర్థం అయ్యింది. ఒక్క క్షణములో ఒక దూత వచ్చాడు కృష్ణుడి దగ్గరకు. "స్వామి నన్ను దేవకి పంపింది, నాయనా కృష్ణా మీ నాన్నగారైన వసుదేవున్ని శాల్వుడు బంధించి తీసుకు వెళ్ళాడు"

నిశమ్య విప్రియం కృష్ణో మానుసీం ప్రకృతిం గతః
విమనస్కో ఘృణీ స్నేహాద్బభాషే ప్రాకృతో యథా

కథం రామమసమ్భ్రాన్తం జిత్వాజేయం సురాసురైః
శాల్వేనాల్పీయసా నీతః పితా మే బలవాన్విధిః

ఆ మాట విని మామూలు మానవుడిలా నరలోక ధర్మాన్ని అనుసరిస్తూ ప్రాకృత మానవుడిలా వైమనశ్యాన్ని పొందాడు,స్నేహముతో జాలితో " ఇది ఎలా జరిగింది. నగర రక్షకు బలరామున్ని ఏర్పాటు చేసాను కదా. దేవ దానవులు కలిసినా బలరామున్ని గెలవలేరు కదా"

ఇతి బ్రువాణే గోవిన్దే సౌభరాట్ప్రత్యుపస్థితః
వసుదేవమివానీయ కృష్ణం చేదమువాచ సః

అలా అంటూ ఉండగా శాల్వుడు విమానం తీసుకుని వసుదేవుని ముందర పెట్టుకుని కృష్ణునితో అంటున్నాడు.

ఏష తే జనితా తాతో యదర్థమిహ జీవసి
వధిష్యే వీక్షతస్తేऽముమీశశ్చేత్పాహి బాలిశ

ఈయన మీ తండ్రి. నీవు ఇంత కాలం ఎవరి వద్ద బతుకుతూ ఉన్నావో ఆ తండ్రిని నీ ముందే చంపుతున్నాను, వీరుడవైతే కాపాడుకో

ఏవం నిర్భర్త్స్య మాయావీ ఖడ్గేనానకదున్దుభేః
ఉత్కృత్య శిర ఆదాయ ఖస్థం సౌభం సమావిశత్

అని ఖడ్గముతో శిరసును ఖండించి ఆకాశములో తన విమానానికి వెళ్ళి తాను కూర్చున్నాడు

తతో ముహూర్తం ప్రకృతావుపప్లుతః స్వబోధ ఆస్తే స్వజనానుషఙ్గతః
మహానుభావస్తదబుధ్యదాసురీం మాయాం స శాల్వప్రసృతాం మయోదితామ్

కృష్ణ పరమాత్మ కూడా ఒక క్షణ కాలం నిర్వీర్యుడయ్యాడు. తన అంశను జ్ఞ్యప్తికి తెచ్చుకుని ఒక సారి నావాడు. ఇదంతా మాయ అని తెలుసుకున్నాడు
ఇది వాడు ప్రయోగించిన మాయ అని నిశ్చయించుకునగానే శాల్వుడూ దూతా తన తండ్రీ ఎవరూ లేరు

న తత్ర దూతం న పితుః కలేవరం ప్రబుద్ధ ఆజౌ సమపశ్యదచ్యుతః
స్వాప్నం యథా చామ్బరచారిణం రిపుం సౌభస్థమాలోక్య నిహన్తుముద్యతః

కలలో చూచినట్లుగా అవి అన్నీ మాయమయ్యాయి. అపుడు ఆకాశములో శత్రువును చూచాడు

ఏవం వదన్తి రాజర్షే ఋషయః కే చ నాన్వితాః
యత్స్వవాచో విరుధ్యేత నూనం తే న స్మరన్త్యుత

కృష్ణ పరమాత్మ కూడ క్షణకాలం వాడి మాయకు నిర్విణ్ణుడయ్యాడని కొందరు చెబుతారు.
ఇది నిజమని వారు నమ్ముతారా. వాళ్ళమాట వాళ్ళకే అడ్డువస్తుంది. సకల చరాచర జగత్తు ఎవరి మాయ వలన సృష్టించబడుతుందో రక్షించబడి సంహరించబడుతుందో అలాంటి వాడు ఇంకొకడి మాయకు లోబడతాడా

క్వ శోకమోహౌ స్నేహో వా భయం వా యేऽజ్ఞసమ్భవాః
క్వ చాఖణ్డితవిజ్ఞాన జ్ఞానైశ్వర్యస్త్వఖణ్డితః

జ్ఞ్యానం లేని వారికి కలిగేవి శోక మోహ భయాలు. అలాంటి అజ్ఞ్యానముతో కలిగేవి ఎక్కడ, నిరంతరం అఖండ జ్ఞ్యాన స్వరూపమైన పరమాత్మ ఎక్కడ

యత్పాదసేవోర్జితయాత్మవిద్యయా హిన్వన్త్యనాద్యాత్మవిపర్యయగ్రహమ్
లభన్త ఆత్మీయమనన్తమైశ్వరం కుతో ను మోహః పరమస్య సద్గతేః

మహానుభావులూ యోగులూ ఋషులూ ఎవరి పాద పద్మాలను సేవించడం వలన అనాధిగా వస్తున్న అవిద్యను తొలగించుకుని గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతున్నారో అలాంటి వాడికి మోహం ఎలా ఉంటుంది.

తం శస్త్రపూగైః ప్రహరన్తమోజసా
శాల్వం శరైః శౌరిరమోఘవిక్రమః
విద్ధ్వాచ్ఛినద్వర్మ ధనుః శిరోమణిం
సౌభం చ శత్రోర్గదయా రురోజ హ

ఈ క్షణ కాలములో వాడు కురిపిస్తున్న బాణ వర్షాన్ని చూచి కోపించిన స్వామి శస్త్రాలతో అతన్ని విముఖున్ని చేసి తన గదతో ఆ విమానాన్ని చూర్ణం చేసాడు

తత్కృష్ణహస్తేరితయా విచూర్ణితం పపాత తోయే గదయా సహస్రధా
విసృజ్య తద్భూతలమాస్థితో గదాముద్యమ్య శాల్వోऽచ్యుతమభ్యగాద్ద్రుతమ్

పరమాత్మ గదతో కొట్టబడి విమానం పొడిపొడి ఐ సముద్రములో పడింది. శాల్వుడు భూమి మీద పడ్డాడు. గదతో కృష్ణున్ని కొడదామని వచ్చాడు

ఆధావతః సగదం తస్య బాహుం భల్లేన ఛిత్త్వాథ రథాఙ్గమద్భుతమ్
వధాయ శాల్వస్య లయార్కసన్నిభం బిభ్రద్బభౌ సార్క ఇవోదయాచలః

అలా వస్తున్న శాల్వుని హస్తమును బాణముతో వధించి అతన్ని వధించడానికి చక్రం తీసుకుని దానితో అతని శిరస్సును ఖండించాడు

జహార తేనైవ శిరః సకుణ్డలం కిరీటయుక్తం పురుమాయినో హరిః
వజ్రేణ వృత్రస్య యథా పురన్దరో బభూవ హాహేతి వచస్తదా నృణామ్

శాల్వ సంహారముతో హాహా కారాలు జరిగాయి, అందరూ కృష్ణున్ని అభినందించారు

తస్మిన్నిపతితే పాపే సౌభే చ గదయా హతే
నేదుర్దున్దుభయో రాజన్దివి దేవగణేరితాః
సఖీనామపచితిం కుర్వన్దన్తవక్రో రుషాభ్యగాత్

వాడు చనిపోగానే విమానం పడిపోగానే దుందుభులు మోగాయి, పుష్పవర్షాలు కురిసాయి. తన మిత్రులకు ఉపకారం చేయడానికి దంత వక్తృడు వచ్చాడు యుద్ధానికి

                                                       సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts