Followers

Tuesday 30 July 2013

కిడ్నీ జబ్బులతో గుండెకు చేటు


అనేక రకాల కారణాల వల్ల ఇలా కిడ్నీ పనితీరు దెబ్బతినడం వల్ల రక్తం వడపోత ప్రక్రియ సజావుగా సాగదు. ఫలితంగా రక్తం సక్రమంగా శుభ్రం కాదు. మలినాలన్నీ పేరుకుపోవడం వల్ల శరీరంలోని అవయవాలన్నీ దుష్ర్పభావానికి లోనవుతాయి. రక్తపోటు పెరగడం వల్ల గుండెకు హాని కలిగే ప్రమాదం ఎక్కువ. చాలా రకాల జబ్బులు కిడ్నీ దెబ్బతినడానికి కారణమ వుతాయ.

రక్తాన్ని శుభ్రపరిచే యంత్రం కిడ్నీ ఒక్కసారిగా మూలనపడితే..! శరీరంలో మలినాలన్నీ పేరుకుపోరుు వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అరుుపోతారుు. రక్తపోటు పెరిగి గుండె, మెదడు లాంటి ప్రధాన అవయవాలు కూడా దెబ్బతింటారుు. క్రానిక్‌ కిడ్నీ వ్యాధికి గురైనవారిలో గుండె దెబ్బతినడం వల్ల సగం మంది మృత్యువాత పడుతున్నారు. అందుేక కిడ్నీని కాపాడుకుంటే గుండెను రక్షించుకోవచ్చు. 


శరీరంలోని మలినాలను అన్నింటినీ ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తూ ఉండే ప్రధాన అవయవం కిడ్నీ. శరీరంలోని భాగాల నుంచి సేకరించిన రక్తాన్ని వడపోసి, ఆ మలినాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంది. కిడ్నీలో ఉండే నెఫ్రాన్లు ఈ వడపోతకు ఉపయోగపడతాయి. అనేక రకాల కారణాల వల్ల ఇలా కిడ్నీ పనితీరు దెబ్బతినడం వల్ల రక్తం వడపోత ప్రక్రియ సజావుగా సాగదు. ఫలితంగా రక్తం సక్రమంగా శుభ్రం కాదు. మలినాలన్నీ పేరుకుపోవడం వల్ల శరీరంలోని అవయవాలన్నీ దుష్ర్పభావానికి లోనవుతాయి. రక్తపోటు పెరగడం వల్ల గుండెకు హాని కలిగే ప్రమాదం ఎక్కువ. చాలా రకాల జబ్బులు కిడ్నీ దెబ్బతినడానికి కారణమవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు, క్రానిక్‌ గ్లోమెర్యులో నైఫ్రైటిస్‌ (గ్లోమెర్యులస్‌ వాపు), పాలీసిస్టిక్‌ కిడ్నీ డిసీజ్‌ (కిడ్నీలో సిస్ట్‌లు ఏర్పడటం), కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ వ్యాధులుంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశ కూడా ఉంది. పెయిన్‌ కిల్లర్లు అతిగా వాడటం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటాయి. కిడ్నీ పనితీరు బాగుంటే గుండెతో పాటు మిగిలిన అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.
కిడ్నీ ఫెయిల్యూర్‌ ఉన్నప్పుడు అనేక రకాల లక్షణాలు మూకుమ్మడిగా కనిపిస్తాయి. ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, గుండె చుట్లూ వాపు, నాడుల్లో సమస్యలు, మానసికస్థితి సక్రమంగా ఉండకపోవడం, మగతగా ఉండటం, ఫిట్స్‌ రావడం, అపస్మారక స్థితిలోకి కూడా వెళ్లవచ్చు. ముఖం, పాదాల్లో వాపు, రక్తపోటు పెరగడం, రక్తహీనత, ఎముకల సమస్యలు, ఎలక్ట్రొలైట్ల పరిమాణంలో మార్పులు... ఈ లక్షణాలన్నింటినీ కలిపి యూరేమియా అంటారు. 

గుర్తించడం కష్టమే! సాధారణంగా కిడ్నీ పూర్తిగా దెబ్బతినేవరకు పైకి ఎటువంటి లక్షణాలూ కనిపించవు. చాలా సందర్భాల్లో ఇతర జబ్బుల కోసం మూత్ర, రక్త పరీక్షలు చేసినప్పుడు సమస్య బయటపడుతుంది.
చాలా మందిలో కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఏర్పడే మూత్రం పరిమాణం మాత్రం సాధారణంగానే ఉంటుంది. కానీ వాటిలో మాత్రం వ్యర్థ పదార్థాలన్నీ పోవు. మూత్ర పరిమాణం మామూలుగానే ఉండటం వల్ల కిడ్నీలో సమస్య ఉందనే అనుమానం రాదు.

నివారణ - చికిత్స కిడ్నీలు దెబ్బతినడానికి గల కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ తగ్గాలంటే ముందుగా చేయాల్సింది రక్తపోటు నియంత్రించడం. ప్రొటీన్లు తక్కువగా తీసుకుంటే డయాలసిస్‌ అవసరాన్ని తగ్గించవచ్చు. కాబట్టి మాంసాహారం ద్వారా వచ్చే ప్రొటీన్‌ను తీసుకోకూడదు. పొటాషియంను తగ్గించాలి. కాబట్టి పండ్లు, పండ్ల రసాలను తీసుకోవద్దు. ఫాస్ఫ రస్‌ ఎక్కువగా ఉండే మాంసం, సోయాబీన్స్‌, డ్రైఫ్రూట్స్‌ జోలికి వెళ్లకపోవడం మంచిది. తక్కువ కొవ్వు ఉండే ఆహారం, రక్తంలో చక్కెరలను నియంత్రించడం, ధూమపానానికి దూరంగా ఉండటం ద్వారా కొలెస్ట్రాల్‌ పెరగకుండా జాగ్రత్తపడాలి.

మధుమేహం ఉన్న వాళ్లు చక్కెరల శాతం పెరగకుండా మరింత జాగ్రత్తపడాలి. కిడ్నీ ఫెయిల్యూర్‌ వల్ల హిమోగ్లోబిన్‌ శాతం తగ్గిపోతుంది. కాబట్టి ఎరిత్రోపాయిటిన్‌, ఇనుము సప్లిమెంట్లు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. కిడ్నీ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నప్పుడు డయాలిసిస్‌ తప్పనిసరి అవుతుంది. అవసరాన్ని బట్టి హీమోడయాలిసిస్‌ లేదా పెరిటినియల్‌ డయాలిసిస్‌ గానీ చేయాలి. చివరి దశలో కిడ్నీ మార్పిడి తప్ప మార్గం లేదు. మనదేశంలో ఏటా సుమారు రెండు లక్షల మందికి పైగా ఫెయిల్యూర్‌కి గురవుతున్నారు. వీరిలో చాలా మంది గుండె దెబ్బతినండం వల్లనే మరణిస్తున్నారు. కిడ్నీ వ్యాధిని ముందుగా గుర్తించగలిగితే రెండింటినీ కాపాడుకునే వీలుంటుంది.

అధిక రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచుకోవడం.
ప్రొటీన్ల మోతాదు తగ్గించడం.
మాంసాహారం, పండ్లు, పండ్ల రసాలు వద్దు.
ధూమపానానికి దూరంగా ఉండాలి.
సోయాబీన్స్‌, డ్రైఫ్రూట్స్‌, కొవ్వు పదార్థాలు తీసుకోవద్దు. 


టెస్టులతోనే తెలుసుకోవచ్చు 

అల్బుమిన్‌, ప్రొటీన్ల మోతాదు తెలుసుకోవడం కోసం మూత్ర పరీక్ష చేస్తారు. క్రియాటినిన్‌, సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్‌ల మోతాదు రక్తపరీక్షలో తెలుస్తుంది. అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్‌, సిటి స్కాన్‌, కిడ్నీ బయాప్సీ చేయించుకోవాల్సి ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు ఉన్నా లేకపోయినా కిడ్నీ దెబ్బతింటే గుండె కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రీనల్‌ ఫెయిల్యూర్‌ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఒకసారి కిడ్నీ పూర్తిగా దెబ్బతింటే గుండె పాడయ్యే అవకాశం 20 నుంచి 30 వంతులు అధికంగా ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవడంతో పాటు, ప్రొటీన్‌ను మూత్రం ద్వారా వెళ్లిపోవడాన్ని తగ్గించగలిగితే కిడ్నీనే కాదు గుండెనూ కాపాడుకోవచ్చు.

Popular Posts