Followers

Friday 19 July 2013

అక్షరపరబ్రహ్మయోగము ( 8 వ అధ్యాయము )

అర్జునుడు:

కృష్ణా బ్రహ్మము,ఆధ్యాత్మము,కర్మ,అధిభూతం,అధిదైవము అనగా ఏమిటి?ఈ దేహంలో అధియజ్ఞుడు అంటే ఎవరు?అతడెలా ఉంటాడు?యోగులు మరణసమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకుంటారు.


భగవానుడు:


నాశనంలేనిదీ,సర్వోత్కృష్టమైనది బ్రహ్మము.ప్రకృతి సంబంధమైన స్వబావాలే ఆధ్యాత్మము.భూతాల ఉత్పత్తి కైన సంఘటనయే ధర్మము.నాశనమయ్యే పదార్థము అధిభూతం.పురుషుడు అధిదైవతం.అంతర్యామి ఐన నేనే అధియజ్ఞుడిని.


మరణమందు కూడా ఎవరైతే నన్నే తలచుకుంటూ శరీరాన్ని విడిచినవాడు నన్నే పొందుతాడు.ఎవడు అంత్యకాలంలో ఏ భావంతో మరణిస్తాడో ఆ భావాన్నే పొందుతాడు.


కాబట్టి నన్నే స్మరిస్తూ యుద్దం చెయ్యి.అన్యచింతనలు లేని మనసుతో పరమాత్మను ధ్యానించేవాడు అతడినే పొందుతాడు.


ఎవడైతే అంత్యకాలంలో ప్రాణవాయువును భౄమధ్యంలో నిలిపి పురాణపురుషుడు,అణువుకంటే అణువు,అనూహ్యమైనవాడు సూర్యకాంతితేజోమయుడు ఐన పరమాత్మున్ని ధ్యానిస్తాడొ అతడు ఆ పరమాత్మనే పొందుతాడు.


వేదవేత్తలు,నిష్కాములు కోరుకునేదాన్ని క్లుప్తంగా చెప్తాను.నవద్వారాలను బంధించి,ఇంద్రియనిగ్రహం కల్గి,మనోవృత్తులను నిరోధించి,ప్రాణాన్ని బ్రహ్మరంధ్రంలో నిలిపి ఓంకారాన్ని ధ్యానిస్తూ,నన్ను స్మరిస్తూ మరణించేవాడు పరమపదాన్ని పొందుతాడు.ఇతర అలోచనలు లేకుండా నన్నే స్మరిస్తూ నమ్ముకున్నవాడు తిరిగి ఈ దుఃఖపూరిత అశాశ్వత లోకంలో జన్మించక నన్నే పొందుతాడు.


బ్రహ్మలోకము వరకూ పునర్జన్మ ఉందికానీ నన్నుచేరినవారికి లేదు.బ్రహ్మకు వేయివేయియుగాలు ఒక పగలు,వేయియుగాలు ఒక రాత్రి.అతని పగటి కాలంలో పుట్టిన ప్రకృతి అతని రాత్రికాలంలో లయమవుతుంది.అలానే సకలజీవులు కూడా.ప్రకృతికి అతీతమైన,శాశ్వతమైన పరబ్రహ్మ మాత్రం నశించదు.అదే నా నివాస స్థానం.అది ఇంద్రియాలకు గోచరం కాదు.


సమస్తప్రాణులు ఉన్న,జగత్తు అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ భక్తసులభుడు.


అగ్ని,జ్యోతి,పగలు,శుక్లపక్షం,ఉత్తరాయణ మార్గాలలో జన్మించినవారు పరబ్రహ్మను పొంది పునర్జన్మను పొందరు.


పొగ,రాత్రి,కృష్ణపక్షం,దక్షిణాయనం లలో మరణించినవారు తిరిగి జన్మిస్తారు.ఇవి తెలిసిన యోగి భ్రాంతి చెందడు.కాబట్టి యోగయుక్తుడవై ఉండు.


దీనిని గ్రహించిన జ్ఞాని వేద,యజ్ఞ,జపతపాదుల వలన కలిగే పుణ్యస్థానాన్ని అధిగమించి శాశ్వత బ్రహ్మపదాన్ని పొందుతాడు.

Popular Posts